సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని జిల్లా సెక్టరియల్ అధికారి ఆర్.సూర్యప్రకాష్ శుక్రవారం సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. మండల ఐఈఆర్ డీ సమన్వయకర్తకు పలు సూచనలు చేశారు. మండలంలోని ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల సంఖ్య, వారికి అవసరమైన సదుపాయాలు, వారికి ఉన్న వనరులను ప్రత్యేకంగా మండల సమన్వయకర్తకు వివరించారు. ఆ దిశగా ప్రభుత్వం ప్రత్యేకావసరాలు కలిగిన పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలు ప్రతి పిల్లవాడికి చేరేలా కృషిచేయాలని సూచించారు. టెలీసర్వీస్ ప్రతిరోజు పిల్లవాడికి […]
సారథి, బిజినేపల్లి: మండలంలోని వట్టెం గ్రామంలో పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్జిల్లా అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ పీఆర్ సీలో చోటు కల్పిస్తున్నామని చెప్పిన హామీలను అమలుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితబంధు పథకంలో పంచాయతీ కార్మికులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో బిజినేపల్లి మండలాధ్యక్షుడు జిల్లెల రామకృష్ణ, పరుశరాములు, లక్ష్మయ్య, మల్లయ్య, ఎల్లమ్మ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం మృతులు తండ్రీకొడుకులు బిజినేపల్లి మండల కేంద్రంలో దుర్ఘటన పరామర్శించిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి సారథి, బిజినేపల్లి: అతివేగం ఇద్దరి నిండుప్రాణాలను బలితీసుకుంది. రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో తండ్రీకొడుకులు చనిపోయారు. ఈ దుర్ఘటన శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన శివకుమార్ గౌడ్(35), బాలయ్య గౌడ్(65) వట్టెం నుంచి వనపర్తికి వెళ్తున్నారు. అలాగే కోడేర్కు చెందిన […]
సారథి, చొప్పదండి: సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం అవసరమని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ పద్మనాయక కల్యాణ మండపంలో గురువారం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదికలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు సంబోజీ సునీల్, నెల్లి సంతోష్, బండారి అఖిల్ నాయకులు పాల్గొన్నారు.
సారథి ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన బొలిశెట్టి రాజేష్ కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.3.5 లక్షల చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావా వసంత కలిసి గురువారం పంపిణీ చేశారు. అనంతరం జగిత్యాల రూరల్ మండలం చలిగల్ క్లస్టర్ గ్రామ రైతువేదికను ప్రారంభించారు. ఇటీవల మొరపల్లి గ్రామానికి చెందిన రైతు ఎడమల నాగరాజు మరణించగా వారి కుటుంబసభ్యులకు రూ.ఐదులక్షల రైతుబీమా చెక్కును అందజేశారు. అనంతరం […]
సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటలకు కౌంటింగ్చేశారు. ఆలయానికి రూ.1.2 కోట్ల ఆదాయం సమకూరింది. 198 గ్రాముల బంగారం, 11 కిలోలన్నర వెండి వచ్చింది. ఈ లెక్కింపు ప్రక్రియ ఆలయ కార్యనిర్వహణాధికారి హరికిషన్ ఆధ్వర్యంలో కొనసాగింది.
సారథి ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై తహసీల్దార్లు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ జి.రవి సూచించారు. అనుమతి లేకుండా ఇసుకను డంప్ చేసే స్థలాలను గుర్తించి భూ యజమానులపై కేసులు పెట్టాలని ఆదేశించారు. వాహనాలకు పెనాల్టీలు మాత్రమే విధించకుండా సీజ్ చేయాలన్నారు. కలెక్టరేట్నుంచి జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లతో ఆయన జూమ్ మీటింగ్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక రవాణాపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని, అక్రమరవాణా చేసే వారిపై కఠినంగా వ్యవహరించి […]
సారథి, రామడుగు: ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న భారతీయ జనతా యువమోర్చా మండల నాయకులను రామడుగు ఎస్సై నరేష్ గురువారం అరెస్ట్చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలుచేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్అయిన వారిలో యువమోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండలాధ్యక్షుడు దురిశెట్టి రమేష్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, కార్యదర్శి బుర్ర […]