ఢిల్లీ: నూతన విద్యావిధానంతో మన దేశంలో పెనుమార్పులు సంభవించనున్నాయని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. నూతన విద్యావిధానంతో విస్తృత ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఇక విద్యార్థులు వారికి ఇష్టమైన కోర్సును చిన్నప్పడే ఎంచుకోవచ్చని.. హోంవర్కులు, పుస్తకాల మోత ఉండబోదని తెలిపారు. 30 ఏళ్ల తర్వాత దేశంలో ఈ కొత్త విద్యా విధానం అమల్లోకి రానుందని ఆయన చెప్పారు. శుక్రవారం ఆయన మన్కీ బాత్లో మాట్లాడుతూ.. పిల్లలకు పుస్తకాల భారం తగ్గుతుందని.. నేర్చుకోవాలనే అభిలాష పెరుగుతుందన్నారు. సృజనాత్మకత నిశిత పరిశీలన పెంపొందుతుందన్నారు. […]
వాషింగ్టన్: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని ‘ఆర్ఎల్ఎఫ్-100’ అనే ఔషధం పనిచేస్తుందని అమెరికా వైద్యులు తేల్చారు. ఈ మందును రోగులపై వాడేందుకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ కూడా ఆమోదం తెలిపింది. అయితే ఈ మందు కొత్తగా వాడుకలోకి వచ్చిందేమి కాదు. శృంగార సమయంలో పరుషులకు ఉత్తేజాన్ని ఇచ్చేందుకు ఈ మందును వినియోగించేవారు. కానీ ప్రస్తుతం ఇది కరోనాను నియంత్రిస్తుండటం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మందును ‘అవిప్టడిల్’ అనే పేరుతో మార్కెట్లో అమ్ముతుంటారు. దీన్ని ముక్కుద్వారా […]
పుణే: కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్కు చెందిన పలు ఫార్మా కంపెనీలు పురోగతి సాధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్నది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీ.. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి (జీఏవీఐ) భాగస్వామ్యంతో భారతదేశంతో సహా 92 దేశాలకు 100 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేస్తున్నది. కాగా దీని ధర రూ. 225 గా […]
రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్ జైల్లో 265మంది ఖైదీలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వారితో పాటు 24మంది జైలు సిబ్బంది కోవిడ్ బారినపడ్డారు. ఆగస్టు 3న 900మంది ఖైదీలకు నిర్వహించిన పరీక్షల్లో ఒకేరోజు 247మందికి కరోనా ప్రబలినట్లు సంబంధిత వర్గాల ద్వారా తేలింది. కోవిడ్ ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు చేయలేక ఖైదీలకు జైలులోనే ఉంచి పోలీసు సిబ్బంది చికిత్స అందజేస్తున్నారు. జైలులో మొత్తం 1675 మంది ఉంటే 265 మందికి ఈ కరోనా వైరస్ సోకడంతో […]
ఢిల్లీ: మనదేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. గురువారం నాటికి కేసుల సంఖ్య 20 లక్షలకు చేరింది. గత 24 గంటల్లో 62,538 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటివరకు మొత్తం 20,27075 మందికి కరోనా సోకగా, 41,585 మంది ప్రాణాలు కోల్పోయారు. 6,07384 మందికి ఆస్పత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 13,78,106 మంది కోలుకున్నారు. ఒక్క రోజులో 60వేల కేసులు దాటడం ఇదే తొలిసారి. ప్రస్తుతం కరోనా దేశంలో మరణాల రేటు 2. […]
అమరావతి: ప్రొబేషనర్(2018 బ్యాచ్) ఐఏఎస్లను సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 12 మందిని సబ్ కలెక్టర్లుగా నియమించింది. చిత్తూరు డీఆర్డీఏ పీవోగా ఎంఎస్ మురళి నియమితులయ్యారు. అలాగే ప్రస్తుతం రాజంపేట, నరసరావుపేట, కందుకూరు, నూజివీడు, నంద్యాల, టెక్కలి, నర్సీపట్నంలో కొనసాగుతున్న డిప్యూటీ కలెక్టర్లను జీఏడీకు రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. సబ్ కలెక్టర్లుగా నియమితులైన వారి వివరాలు పృథ్వీ తేజ్ ఇమ్మడి – సబ్ కలెక్టర్ కడప (కడప), ప్రతిష్ఠ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం 2,207 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా బాధితుల సంఖ్య 75,257కు చేరింది. కరోనా బారినపడి 53,239మంది కోలుకున్నారు. ప్రస్తుతం 21,412యాక్టివ్ కేసులున్నాయి. 24గంటల్లో 12మంది కోవిడ్19 వైరస్ కాటుకు బలయ్యారు. దీంతో రాష్ర్టంలో కరోనా వైరస్తో చనిపోయిన వారిసంఖ్య 601కు చేరింది. నిన్న మొత్తం 21,417శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 5,66,984కు చేరుకుంది.
బీజింగ్ : చైనాలోని వుహాన్ నుంచి వెలువడిన కరోనా మహమ్మారి కరోనా వైరస్తో ప్రపంచం ఇంకా పోరాడుతుండగా, మరో కొత్త వైరస్ వ్యాప్తి అక్కడి వైద్యులకు నిద్ర లేకుండా చేస్తోంది. చైనా దినపత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ కథనం ప్రకారం, టిక్-కాటు ద్వారా వెళ్లే కొత్త రకం వైరస్ చైనాలో ఉద్భవించింది. ఎస్ఎఫ్టీఎస్(సివియర్ ఫీవర్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్) వైరస్ గా పిలుస్తున్న దీనివల్ల ఇప్పటికే కనీసం ఏడుగురు ప్రాణాలను కోల్పోయారు. దాదాపు 60 మందికి పైగా ఈ […]