Breaking News

265 మంది ఖైదీలకు కరోనా

265 మంది ఖైదీలకు కరోనా

రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్​ జైల్​లో 265మంది ఖైదీలకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. వారితో పాటు 24మంది జైలు సిబ్బంది కోవిడ్​ బారినపడ్డారు. ఆగస్టు 3న 900మంది ఖైదీలకు నిర్వహించిన పరీక్షల్లో ఒకేరోజు 247మందికి కరోనా ప్రబలినట్లు సంబంధిత వర్గాల ద్వారా తేలింది. కోవిడ్​ ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు చేయలేక ఖైదీలకు జైలులోనే ఉంచి పోలీసు సిబ్బంది చికిత్స అందజేస్తున్నారు. జైలులో మొత్తం 1675 మంది ఉంటే 265 మందికి ఈ కరోనా వైరస్​ సోకడంతో అటు అధికారులు, ఇటు ఖైదీల్లో భయాందోళన నెలకొంది.