రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్ జైల్లో 265మంది ఖైదీలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వారితో పాటు 24మంది జైలు సిబ్బంది కోవిడ్ బారినపడ్డారు. ఆగస్టు 3న 900మంది ఖైదీలకు నిర్వహించిన పరీక్షల్లో ఒకేరోజు 247మందికి కరోనా ప్రబలినట్లు సంబంధిత వర్గాల ద్వారా తేలింది. కోవిడ్ ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు చేయలేక ఖైదీలకు జైలులోనే ఉంచి పోలీసు సిబ్బంది చికిత్స అందజేస్తున్నారు. జైలులో మొత్తం 1675 మంది ఉంటే 265 మందికి ఈ కరోనా వైరస్ సోకడంతో అటు అధికారులు, ఇటు ఖైదీల్లో భయాందోళన నెలకొంది.
- August 7, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- తూర్పుగోదావరి
- ముఖ్యమైన వార్తలు
- CARONA
- JAIL
- RAJAMANDRY
- కరోనా
- జైలు
- రాజమండ్రి
- Comments Off on 265 మంది ఖైదీలకు కరోనా