న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇది నిజంగా ఉపశమనం కలిగించే వార్తే. కేంద్ర వైద్యశాఖ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. గత 24 గంటల్లో 51,255 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒకే రోజు ఇంతమంది కోలుకోవడం మనదేశంలో ఇదే ప్రథమం. కాగా ఇప్పటివరకు మొత్తం 11,45,629 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 54,735 కొత్తకేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 17,50,723కు చేరుకున్నది. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన […]
తమిళం, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించిన ఖైదీ చిత్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఆగస్టు 9 నుంచి 15 వరకు కెనడాలోని టోరంటోలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. ఇప్పటికే తెలుగు సినిమా జెర్సీ కూడా టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శనకు ఎంపికైన విషయం తెల్సిందే . ఖైదీ చిత్రానికి ఇంత గొప్ప గౌరవం దక్కడం తమకెంతో గర్వకారణమని ఆ చిత్ర నిర్మాతలు కేకే రాధామోహన్, ఎన్ఆర్ ప్రభు, […]
విలక్షణ నటుడు మంచు మోహన్బాబుకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి రంగారెడ్డి జిల్లా జల్పల్లిలోని ఆయన ఫామ్హౌస్లోకి వచ్చారు. అనంతరం వారు ‘మోహన్బాబు నిన్ను చంపేస్తాం, నీ కుటుంబాన్ని వదిలిపెట్టం’ అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. మంచు ఫ్యామిలీ తేరుకునేలోపే వారు అక్కడినుంచి పారిపోయారు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి మంచు కుటుంబం షాక్గు గురైంది. అనంతరం మోహన్బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి ఏపీ 31 […]
ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తివ్రిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తారక్ కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించనున్నట్టు సమాచారం. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ మరోసారి నటిస్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు. కాగా ఇందులో ఓ పవర్ ఫుల్ […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్నేత పైడికొండల మాణిక్యాలరావు కరోనాతో శనివారం కన్నుమూశారు. ఇటీవల ఆయన తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్ భీమ శంకరరావు(తాతాజీ)తో కలిసి ఒకే కారులో ప్రయాణించారు. శంకరరావుకు కరోనా ప్రబలినట్లు నిర్ధారణ కావడంతో మాణిక్యాలరావు కూడా కరోనా టెస్టు చేయించుకున్నారు. 20 రోజుల పాటు ఏలూరు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకొచ్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. తాడేపల్లిగూడెం నుంచి బీజేపీలో సామాన్య కార్యకర్త నుంచి […]
న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్సింగ్ (64) శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. మార్చ్ లో చికిత్స కోసం ఆయన సింగపూర్ ఆస్పత్రికి కూడా వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అమర్సింగ్కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 1956 జనవరి 27 ఉత్తరప్రదేశ్లోని అజంఘర్లో అమర్సింగ్ జన్మించారు. 1996లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో చివరి సారిగా రాజ్యసభకు సమాజ్వాదీ పార్టీ నుంచి […]