సారథిన్యూస్, ఆసిఫాబాద్: మావోయిస్టలు తెలంగాణలోకి ప్రవేశించారని కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తర్యాని మండలపరిధిలోని అడువుల్లో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టు పార్టీకి చెందిన ఓ అగ్రనేత, రాష్ట్రకమిటీ సభ్యుడు మైలవరకు అడెల్లు అలియాస్ భాస్కర్ త్రుటిలో తప్పించుకున్నట్టు సమాచారం. కాగా పోలీసులు, ప్రత్యేక బలగాలు ఈ అడవిని జల్లెడ పడుతున్నారు. పోలీసులకు విప్లవసాహిత్యం, మావోయిస్టుల యూనిఫాంలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, డిటోనేటర్లు, కార్దెక్స్ వైర్లు, పాలితిన్ […]
సారథి న్యూస్, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఓ డ్రైవర్ కు కరోనా నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి, మున్సిపల్ చైర్మన్ మదన్మోహన్స్పష్టంచేశారు. ఇటీవల అతడు జ్వరంతో బాధపడుతుండగా, వైద్యపరీక్షలు చేయించగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆ ఇంటిలో 12 మంది ఉండడంతో కరోనా ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
సారథిన్యూస్, గోదావరిఖని: సింగరేణి తన వ్యాపార విస్తరణలో భాగంగా నూతన ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నదని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. సోమవారం ఆయన సింగరేణి ఉన్నతాధికారలతో సమావేశమయ్యారు. సింగరేణి సంస్థ రిజర్వాయర్ల నీటిపై తేలియాడే సోలార్ ప్లాంటులను నిర్మించేందుకు సమాయత్తమవుతుందని చెప్పారు. దాదాపు 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను నిర్మించనున్నామని చెప్పారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్ (ఇ&ఎం) ఎస్ శంకర్, రాష్ట్ర రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ శాఖ వైస్ ప్రెసిడెంట్ జానయ్య, ప్రాజెక్టు డైరెక్టర్ […]
సారథిన్యూస్, రామడుగు: బీజేపీ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి అమానుషమని చొప్పదండి నియోజవర్గ బీజేపీ కన్వీనర్ జిన్నారం విద్యాసాగర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే నేతలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో నాయకులు పొన్నం శ్రీను, పోచంపల్లి నరేశ్, కల్లెం శివ, వెంకటేశ్, అజయ్, […]
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రతి గ్రామంలోనూ 50 కల్లాలు నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హుస్నాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయితీ సెక్రటరీలు నెలలో 3రోజులు అనుమతి లేకుండా విధులకు గైర్హాజతే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, ఎమ్మెల్యే సతీశ్కుమార్, డీఆర్డీవో గోపాల్ రావు, డీపీవో సురేశ్, డీఎఫ్ వో శ్రీధర్, ఆర్డీవో […]
సారథిన్యూస్, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న రైతు వేదికలు దేశానికే తలమానికమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు, వారికి ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకే సీఎం కేసీఆర్ రైతువేదికలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల […]
సారథి న్యూస్, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో నేషనల్ హైవేల వెంట మంజూరైన అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. సోమవారం హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఎన్ హెచ్ -9, ఎన్ హెచ్- 44 రూట్లలో పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. మల్కాపూర్ బ్రిడ్జి వద్ద సైడ్ డ్రెయిన్లు పూర్తిచేయకపోవడంతో వర్షపు నీరు నిలిచి ట్రాఫిక్ కు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ […]
మిస్ యూనివర్స్ కంటెస్టెంట్, ప్రముఖ టీవీనటి దివ్యాచౌక్సీ కొద్దికాలంగా కేన్సర్ తో పోరాడుతూ ఆదివారం కన్నుమూసింది. చనిపోవడానికి కొన్ని గంటల ముందు దివ్యా చౌక్సీ తన చివరి పోస్టును ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అదిప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కేన్సర్ తో పోరాడుతాను తాను గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని..‘ప్రస్తుతం నేను నా డెత్ బెడ్ మీద ఉన్నా.. ఏం చెప్పాలో కూడా నాకు తెలీడం లేదు.. నాకు ఏమైనా […]