సారథి న్యూస్, మెదక్: అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి బ్యాంకులు ఆర్థికంగా చేయూత ఇవ్వాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి కోరారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్లో కలెక్టర్ అధ్యక్షతన డీసీసీ, డీఎల్ఆర్సీ కమిటీ సమావేశం నిర్వహించారు. చేనేత వృత్తులు, పరిశ్రమలకు రుణాలు ఇవ్వడం ద్వారా చాలామందికి ఉపాధి కలుగుతుందని ఆయన సూచించారు. జిల్లాలో కూరగాయలు, పండ్లు, పూల సాగుకు రుణాలు ఇవ్వాలన్నారు. అనంతరం అనంతరం ఎస్సీ, ఎస్టీ బీసీ రుణాల మంజూరుతో పాటు […]
గుట్టలుగా పేరుకుపోతున్న ఫైల్స్ తిరిగి తిరిగి వేసారిపోతున్న బాధితులు సారథి న్యూస్, హైదరాబాద్: పెండింగ్.. పెండింగ్.. పెండింగ్.. పలు కీలకమైన అంశాలకు సంబంధించిన ఫైళ్ల గురించి రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ ఉన్నతాధికారిని అడిగినా ఇప్పుడు వారి నోటి నుంచి వస్తున్న మాట ఇదే. తాత్కాలిక సచివాలయం(బీఆర్కే భవన్) నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం (మెట్రో రైల్ భవన్, బేగంపేట) దాకా ఇదే పరిస్థితి నెలకొంది. అత్యవసరం, అనివార్యమైతే తప్ప మిగతా దస్త్రాలను ముట్టకోని పరిస్థితి నెలకొంది. దీంతో మూడు […]
సారథి న్యూస్, కర్నూలు: కరోనా వ్యాప్తి సమయంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి సూచించారు.మంగళవారం కర్నూలు నగరంలోని రీజినల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను ఆయన పరిశీలించారు. సైబర్నేరగాళ్లు మాయమాటలతో మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోం(ఇంటి నుంచి ఉద్యోగాలు) ఉద్యోగాలు చేసేవారు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఫేక్ ఐడీలు, ఫేక్ వెబ్ సైట్లతో ఆన్ లైన్ లో ఉద్యోగాలు చేసే […]
సారథి న్యూస్, కర్నూలు: బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు చట్టాలు రూపొందించాయని, పిల్లలతో పనులు చేయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్నూలు ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప హెచ్చరించారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు మంగళవారం కర్నూలు జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ను ప్రారంభించారు. అందులో భాగంగా నగరంలోని రాజ్విహార్ సెంటర్ నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్లో ఎస్పీ పాల్గొన్నారు. రెస్క్యూ చేసిన వీధి, అనాథ బాలలకు శానిటైజర్లు, మాస్కులు, బిస్కెట్లను ఎస్పీ పంపిణీ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో అదేస్థాయిలో కరోనా మహమ్మారి కొనసాగుతోంది. మంగళవారం 1,524 పాజిటివ్కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా 37,745 కు కరోనా కేసులు చేరాయి. తాజాగా మహమ్మారి బారినపడి 10 మృతిచెందారు. చికిత్స అనంతరం ఒకేరోజు 1,161 మంది డిశ్చార్జ్ అయ్యారు.జీహెచ్ఎంసీ పరిధిలో 815 పాజిటివ్ నమోదయ్యాయి. ఇప్పటివరకు మృతుల సంఖ్య 375కు చేరింది. ఇప్పటివరకు 1, 95, 024 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి 240, మేడ్చల్ 97, […]
సారథిన్యూస్, చొప్పదండి: చొప్పదండి నియోజకవర్గంలోని పలు చెరువులను ఎల్లంపల్లి జలాశయం నీటితో నింపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎల్లంపల్లి జలాశయ నీటితో చొప్పదండి నియోజకవర్గంలోని నారాయణపూర్ రిజర్వాయర్, మైసమ్మ చెరువు, పోతారం రిజర్వాయర్, ఫాజుల్ నగర్ చెరువు నింపాలని ఎమ్మెల్య రవిశంకర్.. సీఎంను కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించి ఎల్లంపల్లి నీటితో చెరువులు నింపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం […]
సారథిన్యూస్, రామగుండం: విరసం నేత, విప్లవకవి, రచయిత వరవరరావును వెంటనే విడుదల చేయాలని పలువురు ప్రజాసంఘాలు, దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వృద్ధుడైన వరవరరావును ప్రధాని హత్యకు కుట్రపన్నాడంటూ అరెస్ట్ చేయడం సరికాదని పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆల్ఇండియా అంబేద్కర్ యువనజనం సంఘం నేతలు వివిధ సంఘాలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరు మధు, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు మల్లారెడ్డి, […]
సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోవిడత హరితహారంలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండల వ్యవసాయశాఖ మంగళవారం ‘బండ్ బ్లాక్ ప్లాంటేషన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా వెదిర గ్రామశివారులో రైతుల పొలాల గట్ల వెంబడి 200 టేకు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, చొప్పదండి డివిజన్ ఏడీఏ రామారావు, మండల వ్యవసాయ అధికారి యాస్మిన్, ఎంపీడీవో సతీశ్రావు, ఏపీవో చంద్రశేఖర్, ఏఈవో సంపత్, వీడీసీ చైర్మన్ శేఖర్, […]