Breaking News

Month: July 2020

ఆడియో టేపులపై సీబీఐ విచారణ

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్​ షేకావత్​ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారంటూ కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. గజేంద్రసింగ్​ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న ఓ ఆడియోను విడుదల చేసింది కాంగ్రెస్​ పార్టీ. అయితే ఆ వాయిస్​ తనది కాదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఆడియోటేపుల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపాలనీ బీజేపీ నేత సంబిత్​ పాత్రా డిమాండ్​ చేశారు.

Read More
జమ్మూకశ్మీర్‌లో మళ్లీ భూకంపం

జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ భూకంపం

జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. కట్రాకు 88 కి.మీ.దూరంలో తెల్లవారుజామున 4.55 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూప్రకంపనలతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధకారులు చెప్పారు. గురువారం కూడా జమ్మూకశ్మీర్ లో భూకంపం సంభవించింది. జూన్ 27వతేదీన సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. జమ్మూకాశ్మీర్, అసోం రాష్ట్రాల్లో వరుస భూకంపాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరుస భూకంపాలతో […]

Read More
ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్య

ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్య

ముంబై: బిగ్​ అమితాబచ్చన్​ కుటుంబం కరోనాతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అమితాబచ్చన్​తోపాటు ఆయన కుమారుడు అభిషేక్​, కోడల్​ ఐశ్వర్యరాయ్​, మనుమరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. కాగా అమితాబ్​, అభిషేక్​ దవాఖానాలో చికిత్స పొందుతుండగా.. లక్షణాలు ఏమీ కనిపించకపోవడంతే ఐశ్వర్యరాయ్​, ఆరాధ్య ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఐశ్వర్యకు కొన్ని లక్షణాలు బయటడపడటంతో ఆమె ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. ఐశ్వర్యతోపాటు ఆమె కూతురు కూడా అదే ఆస్పత్రిలో చేరారు.

Read More
జాన్​ లూయిస్​ మృతి

జాన్​లూయిస్​ ఇకలేరు

వాషింగ్టన్​: అమెరికాకు చెందని పౌరహక్కుల నేత, కాంగ్రెస్​ సభ్యుడు జాన్​ లూయిస్​(80) ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా ఆయన ప్యాంక్రియాటిక్​ కేన్సర్​తో బాధపడుతున్నారు. జాన్​ అమెరికాలో ఎన్నో పౌరహక్కుల ఉద్యమాలు చేశారు. యూఎస్​ ప్రతినిధుల సభలోనూ సభ్యుడికి వ్యవహరించారు. 1965లో ఆయనను అమెరికన్​ పోలీసులు దారుణంగా కొట్టారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అప్పుడు ప్రాణాలతో బయటపడ్డ జాన్​ పౌరహక్కుల ఉద్యమనేతగా ఎదిగారు. ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఆయన మృతికి అమెరికా మాజీ ప్రెసిడెంట్​ […]

Read More
మాస్క్ తప్పనిసరి

మాస్క్ తప్పనిసరి

అమరావతి: ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి కట్టుకోవాలని చేస్తూ ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే స్థలాలు, ప్రయాణ సమయంలో మాస్క్ కచ్చితంగా వినియోగించాలని సూచించారు. కోవిడ్​–19 మహమ్మారి విజృంభిస్తున్ననేపథ్యంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా మెలగాలని హెచ్చరించింది. వ్యాధి నివారణకు కఠినచర్యలు తప్పవని స్పష్టంచేసింది.

Read More

ఆరుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​లో 24 గంటల్లో వేర్వేరు ఎన్​కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు భద్రతాదళాల చేతుల్లో హతమయ్యారు. షోషియాన్​ జిల్లాలో శనివారం ముగ్గురు ఉగ్రవాదులు ఎదురుకాల్పుల్లో మరణించారు. శుక్రవారం కుల్​గాం జిల్లాలో ముగ్గరు ఉగ్రవాదలు హతమైన సంగతి తెలిసిందే. వీరిలో జైషేమహ్మద్​ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్​ కూడా ఉన్నాడు.

Read More

కోవిడ్​ సెంటర్​లో లైంగికదాడి

ముంబై: కరోనాతో లక్షణాలతో కోవిడ్​ సెంటర్​లో చేరిన ఓ మహిళపై యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ హేయమైన ఘటన ముంబైలో చోటుచేసుకున్నది. కరోనా లక్షణాలతో ఓ మహిళ(40) నేవీ ముంబైలోని కోవిడ్​ సెంటర్​లో చేరింది. మహిళ రెండోఅంతస్థులో ఉండగా.. డాక్టర్​గా పరిచయం చేసుకున్న ఓ యువకుడు ఆమెపై లైంగికదాడి చేశాడు. సదరు యువకుడు కూడా అదే కోవిడ్​ సెంటర్​లో ఐదోఅంతస్థులో చికిత్సపొందుతున్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read More
కరోనాపై కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు

కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరువనంతపురం: భారత్​లో కరోనా సామాజికవ్యాప్తి మొదలైందని కేరళ సీఎం పినరయి విజయన్​ పేర్కొన్నారు. మనదేశంలో మొదటి కేసు కేరళ రాష్ట్రంలోనే నమోదైంది. అక్కడిప్రభుత్వం లాక్​డౌన్​ కఠినంగా అమలు చేయడంతో వ్యాధి అంతగా విస్తరించలేదు. దీంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ప్రశంసల వెల్లువెత్తాయి. భారత్​లో కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. అయినప్పటికీ కేంద్రప్రభుత్వం సామాజికవ్యాప్తి జరిగిందని చెప్పలేదు. దీంతో విజయన్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా శుక్రవారం కేరళలో 791 కొత్త కేసులు నమోదు అయ్యాయి. […]

Read More