ఆశ వర్కర్ల చేత అక్రమ రవాణా…గుట్టు రట్టు సారథి న్యూస్ విశాఖపట్నం : విశాఖలో చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండీ నర్మద ఆధ్వర్యంలో చిన్నపిల్లల అమ్మకాలు జరుగుతున్నట్టు గుర్తించారు. పిల్లలను పోషించే స్థితిలో లేని తల్లి దండ్రులను టార్గెట్ చేసి అమ్మకాలు చేస్తున్నట్టు తేలింది. తల్లిదండ్రులకు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి పుట్టిన తరువాత పిల్లలను తరలిస్తున్నట్టు గుర్తించారు. పిల్లలను అక్రమరవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. […]
మూడు రోజులుగా తుంగభద్ర నదిలో గాలింపు కర్నూలు శివారు.. 8 కి.మీ. దూరంలో డెడ్బాడీ కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబసభ్యులు సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): కలుగొట్ల వద్ద కారు వాగులో కొట్టుకుపోయిన ఘటనలో మహిళ డెడ్ బాడీ మూడు రోజుల అనంతరం సోమవారం మధ్యాహ్నం దొరికింది. ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామశివారులో శనివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కారు బోల్తాపడిన పడిన విషయం తెలిసిందే. కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి చెందిన […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం పాత భవనాల కూల్చివేత, శిథిలాల తొలగింపు చేపట్టింది. ఇప్పటికే దాదాపు 90 శాతం కూల్చివేత పనులు పూర్తయ్యాయి. శిథిలాలు మొత్తం దాదాపు 4500 లారీల లోడు ఉంటుందని అంచనా. ఇందులో ఇప్పటికే రెండువేల లారీల ట్రిప్పులు ఎత్తివేశారు. మిగతా పనులు చకచకా సాగుతున్నాయి. ఎత్తయిన భవనాలను కూల్చివేసే సందర్భంలో ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఎవరినీ […]
న్యూఢిల్లీ: రాజస్థాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ను రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి సోమవారం ఉపసంహరించుకున్నారు. సచిన్ పైలట్తో పాటు 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే విధించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్చేస్తూ స్పీకర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా ఆయన తన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. రాజస్థాన్ సంక్షోభాన్ని […]
హైదరాబాద్ లో నివాసం ఉండే చిరు వ్యాపారికి కరోనా ప్రబలింది. కుటుంబసభ్యులు, బంధువులు చిన్నచూపు చూస్తారనే భయంతో వరంగల్ జిల్లాలోని తన సొంతూరుకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తెల్లవారుజామున ఏపీలోని గుంటూరులోని ఓ ఐసోలేషన్ కేంద్రంలోనే మరొకరు ఉరివేసుకుని చనిపోయారు. గురువారం హైదరాబాద్ లో ఎయిర్ ఫోర్స్ రిటైర్ట్ ఉద్యోగి ప్రైవేట్ ఆస్పత్రిలోని కిటికీలో నుంచి దూకి బలవన్మరణానికి ఒడిగట్టాడు. కరోనా మహమ్మారి జనాలను భయంతో చంపేస్తోంది.. పొరుగు వారు చూపుతున్న వివక్షకు తోడు.. చనిపోతామేమో […]
భోపాల్: దొంగల్లోను చాలా రకాలుంటారు. వాళ్ల అభిరుచులు కూడా భిన్నమే. తాజాగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పోలీసులకు చిక్కిన ఓ దొంగ మాత్రం చాలా విచిత్రమైన దొంగ. ఈ దొంగ కేవలం బాలికలు, యువతుల లోదుస్తులను మాత్రమే కాజేస్తాడు. అనంతరం వాటిని చింపి పీలికలు చేసి పడేసి పైశాచిక ఆనందం పొందుతాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో లేడిస్ హాస్టల్స్, యువతులు అద్దెకుండే నివాసాల్లో కొంతకాలంగా రాత్రివేళల్లో లోదుస్తులు మాయం అవుతున్నాయి. దీంతో బాధిత మహిళలు విజయ్నగర్ పోలీసులకు ఫిర్యాదు […]
సోషల్మీడియాలో వేధింపులు భరించలేక తమిళ నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ‘నామ్ తమిళర్’ పార్టీ నేత సీమన్, ‘పనన్కట్టు పడై’కి చెందిన హరి నాడార్ మద్దతుదారులు తనను వేధింపులకు గుర్తిచేస్తున్నారని ఆమె ఫేస్బుక్లో విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొన్నారు. గమనించిన స్థానికులు ఆమెను దవాఖానకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ”ఇది నా చివరి వీడియో. సీమన్, అతడి పార్టీ కార్యకర్తల వల్ల గత నాలుగు నెలలుగా నేను తీవ్ర […]
ప్రాజెక్టుకు భారీగా వరద.. 4 గేట్లు ఎత్తివేత నిండుకుండలా ఉన్న సంజీవయ్య సాగర్ సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు సమీపంలోని గాజులదిన్నె సంజీవయ్య సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తుతోంది. నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో హోలగుంద, ఆస్పరి, పత్తికొండ, ఆలూరు, తుగ్గలి ప్రాంతాల నుంచి వాగులు, వంకలు పొంగి వరదనీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. 60వేల క్యూసెక్కుల నీరు చేరడంతో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాజెక్టు అసిస్టెంట్ ఇంజినీర్ […]