సారథి న్యూస్, విజయవాడ: ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి జూన్ 30 నాటికి ముగిసిందని, మరో మూడునెలల పాటు పెంచుతున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జులై 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొత్త కార్డులను జారీచేయడం లేదా, కరోనా పరిస్థితి ఇలాగే ఉంటే మరోసారి కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు ఈ విషయాన్ని గమనించి సంబంధిత జిల్లా సమాచార పౌర […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికుల చేత ప్రతి ఇంటిలో నుంచి చెత్తను సేకరించాక ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ ను స్కాన్ చేయించాలని కమిషనర్ డీకే బాలాజీ శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన నగరంలోని కృష్ణానగర్, మద్దూర్ నగర్, అశోక్ నగర్, వెంకటరమణ కాలనీ, బాలాజీ నగర్ ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రతి దుకాణం వారు కచ్చితంగా చెత్తబుట్టలను ఏర్పాటు చేసుకోవాలని, లేకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కమిషనర్వెంట […]
సారథిన్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఇంచార్జిగా ఆర్జేసీ కృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం నియామక ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణను మంత్రులు కేటీఆర్, అజయ్ అభినందించారు. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు.
సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుత వానాకాలంలో రైతులు సాగు చేస్తున్న వరినారు మళ్లలో మొగి పరుగు సోకిందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. గురువారం వారు మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో వరినారును పరిశీలించారు. మొగి పురుగు నివారణకు కార్బోఫ్యూరన్ లేదా కార్టప్హైడ్రోక్లోరైడ్ గుళికలను నారుమళ్లలో చల్లుకోవాలని నిజాంపేట వ్యవసాయాధికారి సతీశ్ తెలిపారు. నారుమళ్లలో సూక్ష్మధాతు లోపాలు గమనిస్తే ఫార్ములా 4ను పిచికారి చేసుకోవాలని సూచించారు.
సారథిన్యూస్, రామడుగు/ గంగాధర: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో రూ. 15 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. కాగా గంగాధర మండలం కొండయ్యపల్లిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గురువు చెట్టుపల్లి కొండయ్య అనారోగ్యంతో మృతిచెందారు. వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కల్గెటి […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలంలో నల్లబెల్లం విక్రయిస్తున్నారనే సమాచారంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై మారుతి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. దాడుల్లో రూ.10 లక్షల విలువ చేసే 8,850 కేజీల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
సారథి న్యూస్, కర్నూలు: ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని, అందులో భాగంగా రాష్ట్రంలో పెద్దసంఖ్యలో 108,104 వాహనాలను ప్రారంభించారని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కాలేజీ మైదానంలో గురువారం మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు, నంద్యాల ఎంపీలు డాక్టర్ సంజీవ్కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంఏ హఫీజ్ఖాన్, శ్రీదేవి, ఆర్థర్ తదితరులతో కలిసి అంబులెన్స్వెహికిల్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు […]
చెన్నై: తమిళనాడులోని ట్యుటికోరన్ జిల్లాలో జరిగిన తండ్రి కొడుకుల కస్టోడియల్ మరణాల కేసులో సీబీసీఐడీ పోలీసులు గురువారం మరో నలుగురు పోలీసులను అరెస్టు చేశారు. ఇన్ స్పెక్టర్ శ్రీధర్, మరో ముగ్గురినీ అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేశ్ను అరెస్టు చేయగా.. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులను అరెస్టు చేశారని తెలసిన వెంటనే స్థానికులు పెద్దఎత్తున బయటికి వచ్చి సంబురాలు జరుపుకున్నారు. పటాకులు […]