సారథిన్యూస్, రామడుగు: కరోనాను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండా కరోనా వ్యాప్తికి కారణమవుతున్నదని ఆరోపించారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగలో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా వ్యాప్తికి బాధ్యత వహిస్తూ మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమాలాకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి […]
సారథిన్యూస్, రామడుగు: తమకు ఇష్టమైన రాజకీయ నాయకుల పుట్టినరోజులకు పోటీపడి ఉత్సవాలు చేసే నాయకులు.. మహనీయుడైన అబ్దుల్ కలాం వర్ధంతిని మరిచారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పలుచోట్ల కలాంకు వివిధ పార్టీల నాయకులు నివాళి అర్పించారు. కానీ కరీంనగర్ జిల్లా రామడుగులో మాత్రం నేతలు కలాంను మరిచిపోయారు. ఒక పువ్వు పెట్టి నివాళి అర్పించే సమయం కూడా వారికి లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నాయకులను ప్రసన్నం చేసుకోవడం తగ్గించి.. దేశానికి సేవచేసిన మహనీయులను […]
న్యూఢిల్లీ : అయోధ్య రామమందిర నిర్మాణ భూమిపూజకు ఆగస్టు 5న ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు సోమవారం ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయోధ్య రామమందిర భూమిపూజకు హాజరు కావల్సిందిగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చైర్మన్ మోదీకి ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. ప్రధానితో పాటు మరో 250 మంది అతిథులు కూడా హాజరుకాన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వ హిందు పరిషత్ సీనియర్ ప్రతినిధులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ […]
ముంబై: మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ బచ్చన్, ఆమె కుమార్తె ఆరాధ్య కరోనాను జయించారు. బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ కుటుంబంలో జయాబచ్చన్ మినహా మిగిలిన కుటుంబసభ్యులు అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్య కరోనా బారిన పడ్డారు. కాగా వీరంతా ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు కోలుకోవాలంటూ అభిమానులు దేశవ్యాప్తంగా పూజలు చేశారు. ఈ మేరకు సోమవారం అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. ‘మేము కోలుకోవాలని కాంక్షిస్తూ అభిమానులు చేసిన ప్రార్థనలు ఫలించాయి’ […]
సారథి న్యూస్, న్యూఢిల్లీ : అయోధ్యలో రామాలయ నిర్మాణ భూమిపూజను దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. కరోనా నేపథ్యంలో భక్తులెవరూ అయోధ్యకు రావొద్దని, టీవీల్లోనే పూజా కార్యక్రమాలను వీక్షించాలని కోరింది. ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి అన్ని మతాలకు చెందిన పెద్దలను పిలవాలనే యోచనలో ఉన్నట్టు ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా చెప్పారు. కాగా, ఆలయ నిర్మాణానికి అన్ని మతాల ప్రజల నుంచి విరాళాలు స్వీకరించనున్నట్టు ట్రస్టు సభ్యుడు, […]
సారథి న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో 11 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో కాగజ్ నగర్ ఆర్డీవోగా ఆర్ఎస్.చిత్రు, ఆదిలాబాద్ ఆర్డీవోగా జె.రాజేశ్వర్, తాండూరు ఆర్డీవోగా పి.అశోక్ కుమార్, మంచిర్యాల ఆర్డీవోగా ఎల్.రమేష్, నిజామాబాద్ ఆర్డీవోగా టి.రవి, దేవరకొండ ఆర్డీవోగా కె.గోపిరాం, బోధన్ ఆర్డీవోగా కె.రాజేశ్వర్, సూర్యాపేట ఆర్డీవోగా కె.రాజేంద్రకుమార్, హెచ్ఎండీఏకు నిర్మల్ ఆర్డీవో ఎన్. ప్రసూనాంబ బదిలీ..కాగా రెవెన్యూ శాఖకు రిపోర్ట్ చేయాలని ఎస్.మోహన్ రావు, […]
సారథి న్యూస్, సూర్యాపేట : సూర్యాపేట ఆర్డీవో ఎస్. మోహన్ రావు బదిలీ అయ్యారు. మూడు సంవత్సరాలుగా సూర్యాపేట ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న ఆయన అకస్మాత్తుగా బదిలీ కావడం కొంత చర్చానీయాంశమైంది. ఆయన వెయిటింగ్ పోస్టులో ఉన్నప్పటికీ సూర్యాపేట నూతన ఆర్డీవో గా కే.రాజేంద్ర కుమార్ ను నియామిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సారథి న్యూస్, నల్లగొండ : కరోనా విజృంభిస్తున్న తరుణంలో నల్లగొండ పట్టణంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ వ్యాపారస్తులతో తన క్యాంపు ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జులై 30 నుంచి 14 తేదీ వరకు వ్యాపారస్తులు నల్గొండలో స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించాలన్నారు. ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకుల దుకాణాలు మధ్యాహ్నం 1 గంటవరకు తెరిచి ఉంచుతారని, ఇంకా మెడికల్ షాపులు, హాస్పిటళ్లు ఈ లాక్ డౌన్ నుంచి మినహాయించడం జరిగిందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమావేశంలో చెప్పారు. కరోనా […]