జైపూర్: కాంగ్రెస్ ఎమ్మెల్యేల సపోర్ట్తోనే తాను ధైర్యంగా ఉన్నానని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. మంగళవారం ఉదయం జరిగిన మూడో సీఎల్పీ సమావేశంలో ఆయన ఈ విషయ చెప్పారు. సచిన్ పైలెట్ ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా ఎమ్మెల్యేలంతా తనతో ఉండి నమ్మకంతో సపోర్ట్ చేశారని అన్నారు. తమకు 115 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందన్నారు. ఆ తర్వాత రాజస్థాన్ కేబినెట్ మీటింగ్ కూడా నిర్వహించారు. రాజస్థాన్ అనిశ్చితి తర్వాత గెహ్లాట్ రెండుసార్లు సీఎల్పీ సమావేశం […]
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు మాస్క్ పెట్టుకోవడం విషయంలో పాజిటివ్గా మాట్లాడారు. ప్రెసిడెంట్ మార్క్ ఉన్న నల్లటి మాస్క్ను పెట్టుకున్న తన ఫొటోను ట్వీట్ చేశారు. ‘ నా కంటే గొప్ప దేశభక్తుడు లేడు..సోషల్ డిస్టెంసింగ్ పాటించడం దేశభక్తి అంటున్నారు. నాకన్నా ఎక్కువ ఎవరూ పెద్ద దేశ భక్తుడు కాదు’ అంటూ ట్వీట్ చేశారు. యూఎస్లో కరోనాను కంట్రోల్ చేయడంలో ట్రంప్ ఫెయిల్ అయ్యాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో అమెరికాలో ఎన్నికలు […]
గోదావరి నుంచి 4, కృష్ణా నుంచి 3 టీఎంసీల నీటిని తరలించాలి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు సారథి న్యూస్, హైదరాబాద్: నిధుల సమీకరణకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తిచేసి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడో టీఎంసీని తరలించే పనులతో పాటు, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలోని ప్రాజెక్టులు.. వాటికి నిధుల సమీకరణ’పై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం 1,430 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 47,705కు చేరిన పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి ఒకేరోజు ఏడుగురు మృతిచెందారు. ఇప్పటివరకు మరణాల సంఖ్య 422 కు చేరింది. ఇప్పటిదాకా 2,93, 077 శాంపిళ్ల టెస్టింగ్ చేశారు. తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ను వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 703 కరోనా పాజిటివ్కేసులు తేలాయి. రంగారెడ్డి 117, మేడ్చల్105, సంగారెడ్డి 50, ఖమ్మం 14, […]