Breaking News

Day: July 17, 2020

కారంచేడు మృతులకు నివాళి

కారంచేడు మృతులకు నివాళి

సారథి న్యూస్, రామగుండం: ప్రకాశం జిల్లా కారంచేడు అగ్రవర్ణాల నరమేధానికి 35 ఏళ్లు గడిచిపోయిందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరి మధు అన్నారు. శుక్రవారం గోదావరిఖని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ భవన్​లో జరిగిన సమావేశంలో కారంచేడు మృతులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాదిగ కులస్తులను ఉచకోత కోసి అగ్రవర్ణాలు నరమేధం సృష్టించాయని ఆవేదన వ్యక్తంచేశారు. అగ్రవర్ణ పార్టీల్లో కొందరు దళిత నాయకులు పాలేరులుగా పనిచేస్తున్నందున కారంచేడు బాధితులకు […]

Read More
దళిత యువకుడి దారుణ హత్య

దళిత యువకుడి దారుణ హత్య

సారథి న్యూస్, కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని మర్రిపల్లి గ్రామంలో దళిత యువకుడు ఈర్లపల్లి కిరణ్ (28)ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా గొడ్డలితో నరికిచంపారు. ఈ ఘటన శుక్రవారం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యోదంతంపై లోతైన విచారణ సాగిస్తున్నారు.

Read More
మానవత్వం.. అభినందనీయం

మానవత్వం.. అభినందనీయం

సారథి న్యూస్, రామగుండం: మూడు నెలల క్రితం ఆస్పత్రిలో వదిలేసిన పసిపాప ప్రాణాలను నిలిపి, అరోగ్యవంతురాలుగా తీర్చిదిద్ది మానవత్వం చాటిన ప్రభుత్వాసుపత్రి సిబ్బంది సేవలు అభినందనీయమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే ఆ చిన్నారిని ఐసీడీఎస్, శిశు సంక్షేమశాఖ అధికారులకు అప్పగించారు. రాష్ట్రంలో తల్లీబిడ్డల సంరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఆయన వెంట నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, […]

Read More
ఫస్ట్​డే చెంచుపెంటల టూర్​

ఫస్ట్ ​డే చెంచుపెంటల టూర్​

చెంచుల సమస్యలు తెలుసుకున్న నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్ శర్మన్​ పరిష్కరిస్తానని చెంచుబిడ్డలకు భరోసా సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్ గా ఎల్.శర్మన్​ శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన వెంటనే లింగాల, అమ్రాబాద్‌ మండలాల పరిధిలోని అప్పాపూర్‌ చెంచుపెంటలకు సందర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్​వాడీ సెంటర్, స్కూలును పరిశీలించారు. చెంచుల ఉపాధి, జీవన ప్రమాణాలను తెలుసుకున్నారు. చెంచులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. 30మంది రైతులకు బ్యాంకు అకౌంట్ నంబర్లు లేవని, ఆశావర్కర్ […]

Read More
నూతన కలెక్టర్​కు శుభాకాంక్షలు

నూతన కలెక్టర్​కు శుభాకాంక్షలు

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎల్.శర్మన్ ను కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే అందజేసి విషెస్​చెప్పారు. జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యేను కలెక్టర్ కోరారు.

Read More
ఎక్కడి చెత్త అక్కడే

ఎక్కడి చెత్త అక్కడే

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్​ జల్లా రామడుగు మండలంలో ని వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు మొక్కుబడిగా సాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కట్ట రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై వెంటనే దృష్టి సారించాలని కోరారు. కరోనా నేపథ్యంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కిసాన్​ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జిట్టవేని అంజిబాబు, భరత్ చారి, కనకం శ్రీనివాస్, గజ్జెల అశోక్, మునిగంట శ్రీనివాస చారి తదితరులు ఉన్నారు.

Read More
కరోనాను జయించిన కానిస్టేబుల్​

కరోనాను జయించిన హెడ్​కానిస్టేబుల్​

సారథి న్యూస్, కర్నూలు: కరోనాను జయించి శుక్రవారం విధుల్లో చేరడానికి వచ్చిన హెడ్‌ కానిస్టేబుల్‌ తిమ్మారెడ్డిని కర్నూలు ఒకటవ పట్టణ పోలీసులు పూలమాలతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. హెడ్‌ కానిస్టేబుల్‌కు కొద్దిరోజుల క్రితం కరోనా టెస్ట్‌ చేయగా పాజిటివ్‌ వచ్చింది. కరోనాతో పోరాడి ఇటీవల ఆయన కోరుకున్నారు. ఈ సందర్భంగా హెడ్‌ కానిస్టేబుల్‌ తిమ్మారెడ్డి మాట్లాడుతూ.. తనకు ఆస్పత్రిలో అందిన వైద్యసేవలు, అక్కడ ఇచ్చిన మెడిసిన్స్‌, తీసుకున్న ఆహారం తదితర వివరాలను వెల్లడించారు. పోషకాహారం, జాగ్రత్తలతో […]

Read More
తెలంగాణలో 1,478 కరోనా కేసులు

తెలంగాణలో 1,478 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి వణికిస్తోంది. శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో 1,478 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా ఇప్పటి వరకు మొత్తంగా 42,496 కేసులు నిర్ధారణ అయ్యాయి. వ్యాధి బారినపడి ఇప్పటివరకు 27,296 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 403 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్​కేసులు 13,389 ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 806, రంగారెడ్డి జిల్లాలో 91, మేడ్చల్​82, సంగారెడ్డి 18, […]

Read More