Breaking News

Day: July 15, 2020

ప్రజాశ్రేయస్సే లక్ష్యం

సారథి న్యూస్, నారాయణఖేడ్: సీఎం కేసీఆర్​ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమ నిరంతరం పాటుపడుతున్నారని నారాయణఖేడ్​ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్​రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కల్హేర్​ మండలంలోని పలు గ్రామల్లో ఎమ్మెల్యే పర్యటించారు. బీబీపేట, ఫతేపూర్​ తండాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా కల్హేర్ మండలంలో పలుచోట్ల మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆయాగ్రామాల సర్పంచులు, టీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

Read More
జర్నలిస్టులపై దాడులు సరికాదు

జర్నలిస్టులపై దాడులు సరికాదు

సారథి న్యూస్, నారాయణఖేడ్: రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నదని సంగారెడ్డి జిల్లా ఆమ్​ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు బోర్గి సంజీవ్​ ఆరోపించారు. జర్నలిస్ట్​ తీన్మార్​ మల్లన్నపై దాడిని ఆప్​ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. పక్కాప్లాన్ ప్రకారమే ఆయనపై ఎమ్మెల్యే జీవన్​రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. సీఎం కేసీఆర్​ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ జర్నలిస్టులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆమ్​ఆద్మీపార్టీ జర్నలిస్టులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Read More
ఆర్టీసీ కార్గో పాయింట్ ప్రారంభం

ఆర్టీసీ కార్గో పాయింట్ ప్రారంభం

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్​లోని కోఠి ఉమెన్స్ కాలేజీ బస్టాప్​లో ఆర్టీసీ కార్గో పార్సిల్ పాయింట్ ను హయత్​నగర్​డీవీఎం విజయభాను మంగళవారం ప్రారంభించారు. ఆర్టీసీ కార్గో పార్సిల్​సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మిధాని డిపో మేనేజర్ టి.కిషన్ రావు, సీఐ నమ్రత, మిధాని డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ టీం బి.నాగరాజు, కె.రాములు తదితరులు పాల్గొన్నారు.

Read More

పెండ్లికి 20మందికే అనుమతి

భోపాల్​: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రదేశ్​ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో పెండ్లి వేడుకలకు కేవలం 20 మంది మాత్రమే హాజరకావాలని ఆదేశాలు జారీచేసింది. ఇంట్లో జరిగే పుట్టినరోజు తదితర వేడుకలకు 10 మంది మాత్రమే హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ ఆదేశాలను ఎవరు ఉల్లంఘించినా కఠినచర్యలు తీసుకుంటుమాని పేర్కొన్నది. రాష్ట్రంలో ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు చేయకూడదని.. బహిరంగ ప్రదేశాల్లో 5 కంటే ఎక్కువమంది ఓకే చోట గుమికూడదని పేర్కొన్నది. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుతతరుణంలో […]

Read More

పంజాబ్​ మంత్రికి కరోనా

చంఢీగర్​: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తున్నది. రాజకీయ, సినీప్రముఖులను వదలడం లేదు. ఎవరైతే నాకేంటి అన్నట్టుగా వైరస్​ విజృంభిస్తున్నది. తాజగా పంజాబ్​ మంత్రి రాజిందర్​ సింగ్​ బజ్వాకు కరోనా పాజిటివ్​గా నిర్ధరాణ అయ్యింది. ఆయన కార్యాలయంలోని కొందరికి కరోనా రావడంతో శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు కరోనా నెగిటివ్​గా వచ్చింది. అయినప్పటికి ఆయనకు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో మంగళవారం మరోసారి కరోనా పరీక్షచేయగా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. మంత్రికి పాజిటివ్​ రావడంతో ఆయన కుటుంబసభ్యుల […]

Read More

9 లక్షలు దాటిన కరోనా కేసులు

ఢిల్లీ: భారత్​లో కరోనా కేసులో సంఖ్య భయంకర స్థాయిలో పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో 29,429 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 9,36,181 కి చేరింది. ఈ కాగా ఒకే రోజు ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు కరోనాతో 24,309 మంది మృత్యువాత పడ్డారు. 5,92,031 మంది కోలుకున్నారు. వివిధ ఆసుపత్రుల్లో 3,19,840 మంది చికిత్స పొందుతున్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని.. వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read More

రాష్ట్రంలో టీఆర్​ఎస్​కు తిరుగులేదు

సారథిన్యూస్​, రామగుండం: రాష్ట్రంలో టీఆర్ఎస్​ పార్టీకి తిరుగులేదని.. కేసీఆర్​ నాయకత్వానికి ప్రజలు మద్దతిస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. ఎన్నికలేవైనా టీఆర్​ఎస్​ విజయం సాధించి తీరుతుందని చెప్పారు. మంగళవారం ఆయన రామగుండం కార్పొరేషన్​ పరిధిలోని 50 డివిజన్లకు ఇంచార్జిలను నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన ఇంచార్జ్​లు పార్టీని మరింత బలోపేతం చేయాలని.. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.

Read More

కిన్నెరసానికి భారీ వరద

సారథిన్యూస్​, పాల్వంచ: కిన్నెరసాని రిజర్వాయర్​లోకి భారీగా వరదనీరు వస్తున్నదని కేటీపీఎస్​ 5,6 దశల సీఈ రవీంద్రకుమార్​ తెలిపారు. మంగళవారం రాత్రి గేట్లు ఎత్తి ఐదువేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తామని చెప్పారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గేట్లు తెరిచిన సమయంలో కిన్నెరసాని వాగులో ఎలాంటి రాకపోకలు చేయవద్దని హెచ్చరించారు. కిన్నెరసాని రిజర్వాయర్​ పూర్తిస్థాయి నీటిమట్టం 8.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.495 టీఎంసీల నీరు ఉన్నది. 10 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో […]

Read More