సారథి న్యూస్, నారాయణఖేడ్: సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమ నిరంతరం పాటుపడుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని పలు గ్రామల్లో ఎమ్మెల్యే పర్యటించారు. బీబీపేట, ఫతేపూర్ తండాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా కల్హేర్ మండలంలో పలుచోట్ల మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆయాగ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, నారాయణఖేడ్: రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నదని సంగారెడ్డి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు బోర్గి సంజీవ్ ఆరోపించారు. జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నపై దాడిని ఆప్ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. పక్కాప్లాన్ ప్రకారమే ఆయనపై ఎమ్మెల్యే జీవన్రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ జర్నలిస్టులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆమ్ఆద్మీపార్టీ జర్నలిస్టులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్లోని కోఠి ఉమెన్స్ కాలేజీ బస్టాప్లో ఆర్టీసీ కార్గో పార్సిల్ పాయింట్ ను హయత్నగర్డీవీఎం విజయభాను మంగళవారం ప్రారంభించారు. ఆర్టీసీ కార్గో పార్సిల్సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మిధాని డిపో మేనేజర్ టి.కిషన్ రావు, సీఐ నమ్రత, మిధాని డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ టీం బి.నాగరాజు, కె.రాములు తదితరులు పాల్గొన్నారు.
భోపాల్: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో పెండ్లి వేడుకలకు కేవలం 20 మంది మాత్రమే హాజరకావాలని ఆదేశాలు జారీచేసింది. ఇంట్లో జరిగే పుట్టినరోజు తదితర వేడుకలకు 10 మంది మాత్రమే హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ ఆదేశాలను ఎవరు ఉల్లంఘించినా కఠినచర్యలు తీసుకుంటుమాని పేర్కొన్నది. రాష్ట్రంలో ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు చేయకూడదని.. బహిరంగ ప్రదేశాల్లో 5 కంటే ఎక్కువమంది ఓకే చోట గుమికూడదని పేర్కొన్నది. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుతతరుణంలో […]
చంఢీగర్: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తున్నది. రాజకీయ, సినీప్రముఖులను వదలడం లేదు. ఎవరైతే నాకేంటి అన్నట్టుగా వైరస్ విజృంభిస్తున్నది. తాజగా పంజాబ్ మంత్రి రాజిందర్ సింగ్ బజ్వాకు కరోనా పాజిటివ్గా నిర్ధరాణ అయ్యింది. ఆయన కార్యాలయంలోని కొందరికి కరోనా రావడంతో శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు కరోనా నెగిటివ్గా వచ్చింది. అయినప్పటికి ఆయనకు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో మంగళవారం మరోసారి కరోనా పరీక్షచేయగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మంత్రికి పాజిటివ్ రావడంతో ఆయన కుటుంబసభ్యుల […]
ఢిల్లీ: భారత్లో కరోనా కేసులో సంఖ్య భయంకర స్థాయిలో పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో 29,429 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 9,36,181 కి చేరింది. ఈ కాగా ఒకే రోజు ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు కరోనాతో 24,309 మంది మృత్యువాత పడ్డారు. 5,92,031 మంది కోలుకున్నారు. వివిధ ఆసుపత్రుల్లో 3,19,840 మంది చికిత్స పొందుతున్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
సారథిన్యూస్, రామగుండం: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని.. కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు మద్దతిస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఎన్నికలేవైనా టీఆర్ఎస్ విజయం సాధించి తీరుతుందని చెప్పారు. మంగళవారం ఆయన రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లకు ఇంచార్జిలను నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన ఇంచార్జ్లు పార్టీని మరింత బలోపేతం చేయాలని.. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.
సారథిన్యూస్, పాల్వంచ: కిన్నెరసాని రిజర్వాయర్లోకి భారీగా వరదనీరు వస్తున్నదని కేటీపీఎస్ 5,6 దశల సీఈ రవీంద్రకుమార్ తెలిపారు. మంగళవారం రాత్రి గేట్లు ఎత్తి ఐదువేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తామని చెప్పారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గేట్లు తెరిచిన సమయంలో కిన్నెరసాని వాగులో ఎలాంటి రాకపోకలు చేయవద్దని హెచ్చరించారు. కిన్నెరసాని రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 8.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.495 టీఎంసీల నీరు ఉన్నది. 10 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో […]