న్యూఢిల్లీ: కంటికి కనిపించని ఈ మహమ్మారి వృద్ధులు, చిన్నారులకు అంటుకుంటే డేంజర్ అని డాక్టర్లు హెచ్చరిస్తుండగా.. ఢిల్లీకి చెందిన ఈ 106 ఏళ్ల వృద్ధుడు మాత్రం వ్యాధి నుంచి కోలుకున్నాడు. 70 ఏళ్ల తన కొడుకు కంటే తొందరగా కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(ఆర్జీఎస్ఎస్హెచ్)లో చేరిన ఆ పేషంట్కు వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ తొందరగా రికవరీ అయ్యారని హాస్పిటల్ వర్గాలు చెప్పాయి. ఆ వృద్ధుడికి […]
సారథిన్యూస్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం..ఇల్లెందు మండలం కోటన్ననగర్ సమీపంలోని అనంతారం చెరువు పునరుద్ధరణ పనులు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చేపట్టారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ గుండ్ల రమేష్ ఎంబీ చేసి బిల్లు మంజూరు కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో క్వాలిటీ కంట్రోల్ తనిఖీ కూడా పూర్తి కావడంతో బిల్లు […]
సారథిన్యూస్, రామడుగు: రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం ఓ మహోద్యమంలా సాగుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంటలో ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతిఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, తల్లపల్లి సుజాత శ్రీనివాస్, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, రామగుండం: మద్యం దొంగతనం చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా అప్పనపేట శివారులో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా పట్టుబడింది. నిందితుల వద్ద నుంచి 3 బైక్లు, 2 ట్రాలీ ఆటోలు, రూ. 3,66,800 విలువైన మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన శేఖర్, కుమ్మాటి రాజు, కుర్ర అంజయ్య ముఠాగా ఏర్పడి పలు చోట్ల మద్యం దుకాణాలను […]
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో దారుణం చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిన 34 ఏళ్ల జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎయిమ్స్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. హిందీ డైలీ ‘డైనిక్ భాస్కర్’ పేపర్లో పనిచేస్తున్న జర్నలిస్ట్కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో భయపడిపోయిన ఆయన రెండు రోజుల నుంచి కొలీగ్స్, ఫ్రెండ్స్కు డిప్రెషన్ మెసేజ్లు పంపడం మొదలుపెట్టాడు. జర్నిలిస్టులు పరిస్థితి మరీ దారుణంగా తయారైందని, చాలా సార్లు […]
న్యూఢిల్లీ: అనేక విషయాల్లో ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వాన్ని నిత్యం టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్ర మోడీ మూడు అంశాల్లో ఫెయిల్ అయ్యారని, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ స్టడీలో ఈ విషయం తేలిందని రాహుల్ గాంధీ అన్నారు. ‘ఫ్యూచర్ హెచ్బీఎస్ స్టడీస్ ఆన్ ఫెయిల్యూర్: 1. కొవిడ్ 19, 2,డీమానిటైజేషన్, 3. జీఎస్టీ అమలు’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దాంతో పాటు మోడీ కరోనాపై మాట్లాడుతున్న […]
ఒమాన్లో ఏకైక శైవమందిరం లింగరూపంలో పరమశివుడు ప్రత్యేక పర్వదినాల్లో విశేషపూజలు దర్శించుకున్న భారత ప్రధాని మోడీ సుల్తానేట్ ఆఫ్ ఒమాన్ దేశంలో ఒకే ఒక్క శైవ మందిరం మోతీశ్వర స్వామి ఆలయం. ఇక్కడ ఆ పరమ శివుడు లింగరూపంలో అత్యంత వైభవోపేతంగా విరాజిల్లుతున్నాడు. భక్తుల కోర్కెలు నెరవేర్చి కొంగుబంగారమై వెలుగొందుతున్నాడు. ప్రశాంతమైన వాతావరణం మధ్య అరేబియా మహాసముద్రం తీరాన, మనకు ఆ పరమశివుడు ఎంతో సుమనోహరంగా దర్శనమిస్తున్నాడు. ఆలయాన్ని కట్టించింది ఇండియన్లేసుమారు 125 ఏళ్ల క్రితం ఇండియాలోని […]
సిడ్నీ: ఆస్ట్రేలియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు రెండు స్టేట్స్ బోర్డర్స్ క్లోజ్ చేసినట్లు విక్టోరియా ప్రీమియర్ డానియల్ అండ్రూవ్స్ చెప్పారు. మంగళవారం నుంచి బోర్డర్స్ పూర్తిగా క్లోజ్లో ఉంటాయన్నారు. న్యూ సౌత్ వేల్స్తో బోర్డర్స్ వందేళ్ల తర్వాత క్లోజ్ చేసినట్లు అధికారులు చెప్పారు. 1918–19లో స్పానిష్ ఫ్లూ సమయంలో బోర్డర్స్ క్లోజ్ చేశామని, ఇప్పుడు మళ్లీ మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విక్టోరియా క్యాపిటెల్లో కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్న […]