సారథి న్యూస్, మహబూబ్ నగర్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2020-21 సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరేందుకు ప్రవేశాలు ప్రారంభమైనట్లు నారాయణపేట జిల్లా స్టడీ సెంటర్ నిర్వాహకులకు లక్ష్మణాచారి తెలిపారు. ఇంటర్మీడియట్, ఐటీఐ, ఓపెన్ ఇంటర్మీడియట్ పాసైన అభ్యర్థులు నేరుగా డిగ్రీకి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. జులై 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: తోడు లేని జీవితం అంతలోనే ముగిసింది.. కడ దాకా నీడగా ఉండాల్సిన భార్య అర్ధాంతరంగా కన్నుమూయడంతో ఆ హృదయం కన్నీటితో బరువెక్కింది. భార్య చనిపోయిన పదవ రోజునే ఆ భర్త గుండె ఆగిపోయింది. మరికొన్ని గంటల్లో ద్వాదశ దినకర్మ జారగల్సి ఉన్న ఆ ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన సోమవారం హుస్నాబాద్ పట్టణంలో ప్రతి ఒక్కరినీ కంట కన్నీరు పెట్టించింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన కొత్తపల్లి లక్ష్మి […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రజాప్రతినిధులపై కరోనా మహమ్మారి పగబట్టినట్టే కనిపిస్తోంది.. ఒక్కొక్కరికీ అంటుకుంటోంది.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలందరినీ చుట్టుముట్టేస్తోంది.. తాజాగా తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారని సమాచారం. ఒకరోజు ముందే డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి కరోనా ప్రబలింది. టీఆర్ఎస్ కు చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగలా గణేష్ గుప్తా, […]
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కంటైన్మెంట్ జోన్లలో కేంద్రం లాక్డౌన్ పొడిగించింది. ఈ మేరకు సోమవారం రాత్రి అన్లాక్ -2 విధివిధానాలను ప్రకటించింది. కంటైన్మెంట్ జోన్లలో జులై 31వరరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం కల్పించింది. అలాగే, హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. మెట్రో రైళ్లు, థియేటర్లు, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్పై నిషేధం కొనసాగనుంది. […]
సారథి న్యూస్, వరంగల్: హన్మకొండ సీఎస్ఆర్ గార్డెన్స్ లో సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ పదవీ విరమణ సందర్భంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. పోలీస్ కమిషనర్గా డాక్టర్ రవీందర్ వరంగల్ నగరానికి చేసిన సేవలు అభినందనీయమన్నారు. ప్రస్తుతం కరోనా విపత్కర సమయంలో అందరికీ అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు. అనంతరం సీపీ డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ..వరంగల్లో పనిచేయడం చాలా సంతోషంగా […]
సారథి న్యూస్, నల్లగొండ: కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని, వారిని చూసి హేళనగా మాట్లాడకూడదని, చుట్టుపక్కల వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయొద్దని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాధ్ సూచించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఇంటి యజమానులు వేధిస్తున్నట్లు, ఇల్లు ఖాళీ చేయమని ఇబ్బందులు గురి చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. సరైన జాగ్రత్తలు, ఆరోగ్య రక్షణ చర్యలు చేపట్టడం ద్వారా రోగ నిరోధకశక్తి పెంచుకునే ఆహారాన్ని తీసుకోవడం […]
సారథి న్యూస్, అనంతపురం: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి(జులై 8)ని రైతు దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఏడాది వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని వ్యవసాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రైతుల కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ చర్యలు చేపట్టారని, ఆయన సంస్మరణార్థం రైతు దినోత్సవం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయంపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
సారథి న్యూస్, మహబూబాబాద్: పల్లె ప్రగతి వనాలపై అవగాహన కల్పించాలని మహబూబాబాద్ కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మహబూబాబాద్ రూరల్ మండలం వేమునూరు, శీతల్ గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వ భూములను పరిశీలించడంతో పాటు శ్మశానవాటిక పనులను పరిశీలించారు. అవెన్యూ ప్లాంటేషన్ కు నాటే మొక్కలు పెద్దవిగా ఉండాలని కలెక్టర్ సూచించారు. మొక్కల సంరక్షణకు గ్రామంలో ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని ఊరు వెలుపల నాటే మొక్కలకు సర్కారు తుమ్మ కంపను రక్షణగా ఏర్పాటు […]