నటీ, నటుల వ్యక్తిగత జీవితాలపై రూమర్లు రావడం కొత్తేమీ కాదు. ఎంతో మంది సెలబ్రిటీలు తమ మీద వచ్చిన పుకార్లకు వివరణ ఇచ్చుకోలేక తలలు పట్టుకుంటారు. తాజాగా కన్నడ నటి, బిగ్బాస్ సీజన్ 3 ఫేమ్ నేహా గౌడ తల్లి అయ్యిందని ఆమె యూఎస్లోని కాలిఫోర్నియాలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని పలు కన్నడ సైట్లు రాశాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆమె స్పందించారు. ఈ వార్తలో నిజం లేదని తేల్చిచెప్పారు. తనను […]
తనను కొందరు బెదిరిస్తున్నారంటూ టాలీవుడ్ నటి పూర్ణ పోలీసులను ఆశ్రయించారు. లాక్ డౌన్తో ఆమె కొన్ని రోజులుగా సొంత రాష్ట్రమైన కేరళలోనే ఉంటున్నారు. అయితే ఓ నలుగురు వ్యక్తులు సోషల్మీడియా ద్వారా ఆమెను బెదిరించారు. ఏ విషయంలో బెదిరించారన్న విషయం ఆమె స్ఫష్టంగా చెప్పడం లేదు. నలుగురు వ్యక్తలు తనను డబ్బుల కోసం బెదిరిస్తున్నారని ఆమె కుటుంబసభ్యులతో కలిసి సైబర్క్రైం పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్న నలుగురు సభ్యుల […]
తమిళ అగ్రహీరో విజయ్తో రష్మిక మందన్న ఆడిపడనున్నది. ఇప్పడామె తెలుగులో ఓ వెలుగు వెలుగుతున్నది. సీనియర్ హీరోయిన్స్ క్రేజ్ తగ్గడంతో ప్రస్తుతం పూజాహెగ్డే, రష్మిక హవా కొనసాగుతున్నది. ఇటీవల పూజా హెగ్డే వరస విజయాలతో నంబర్వన్ స్థానంలోకి దూసుకుపోతున్నా.. పూజాను బీట్ చేసేందుకు రష్మిక తెగ కష్టపడుతుందట. అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్పతో పాటు మరో రెండు సినిమాల్లో రష్మిక నటిస్తోంది. కాగా త్వరలోనే సౌత్ నెంబర్ వన్ హీరో విజయ్తో నటించనున్నట్టు సమాచారం. […]
ముంబై : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐఐటీ ముంబై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ సంవత్సరం నుంచి కేవలం ఆన్లైన్ క్లాసులను మాత్రమే నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆన్లైన్ క్లాసులు వినేందుకు పేద విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని దాతలను కోరింది. వారు ఆన్లైన్ చదువులు కొనసాగించటానికి అవసరమైన ల్యాప్టాప్స్, ఇంటర్నెట్ కనెక్షన్లు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి దాదాపు ఐదు కోట్ల రూపాయలు అవసరమవుతాయని దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని విన్నవించింది.
శ్రీనగర్: కశ్మీర్లోని సొపోర్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఎన్కౌంటర్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఎన్కౌంటర్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. కశ్మీర్లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. కరోనా మహమ్మారితో దేశం పోరాడుతున్న వేళ.. ఉగ్రమూకలు భారత్లో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నాయి.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ వైరస్కు ఇప్పటివరకు కచ్చితమైన మందు లేదు. కేవలం భౌతికదూరం పాటించటం, శానిజైటర్ల వాడకం, మాస్కులు ధరించడం వంటివి పాటించాల్సిందే. ఈ నేపథ్యంలో మొహాలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ రీసెర్చ్(ఎన్ఐపీఈఆర్) సెఫ్టీ డివైజ్లు, మాస్క్లు, శానిటైజర్లు తయారు చేస్తున్నది. ఇప్పుడు తాజా కరోనాతో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్టీ ని తయారు చేసింది. రోగనిరోధక శక్తిని పెంచుకుంటే కరోనాను ఎదుర్కోవచ్చు. ఈ హెర్బల్ టీని స్థానికంగా […]
సారథిన్యూస్, నాగర్కర్నూల్: జాతీయ ఉపాధిహామీ పథకం కింద తమ పొలాల్లో కల్లాలను నిర్మించుకొనేందుకు చిన్న, సన్నకారు రైతులు ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ సూచించారు. స్థానిక ఎంపీడీవో, ఏఈవో, పంచాయతీ సెక్రటరీ దగ్గర పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఒక్కో కల్లం యూనిట్ కాస్ట్ 50 చదరపు మీటర్లకు రూ. 56వేలు, 60 చదరపు మీటర్లకు రూ.68 వేలు, 75 చదరపు మీటర్లకు రూ.85వేలుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బీసీ, […]
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో గత నెలలో విమానం కూలిపోవడం మానవతప్పిదమేనని ఆ దేశ విమానయానశాఖ మంత్రి గులామ్ సర్వార్ ఖాన్ వెల్లడించారు. పైలెట్, కో పైలెట్ కరోనా వ్యాప్తి గురించి మాట్లాడుకుంటూ ల్యాండింగ్లో తప్పు చేశారని అన్నారు. పైలెట్, కంట్రోల్ ఇద్దరూ రూల్స్ ఫాలో అవ్వలేదని అన్నారు. కరోనా వైరస్ గురించి మాట్లాడుకుంటూ ల్యాండ్ చేశారని, వాళ్ల మధ్య చాలా సేపటి నుంచి అదే డిస్కషన్ జరిగిందని చెప్పారు. పైలెట్, కో – పైలెట్ ఇద్దరూ నిర్లక్ష్యం వహించారని […]