కార్మికుల సమ్మె సక్సెస్ మూడోరోజూ కొనసాగిన నిరసనలు కార్మిక సంఘాల బైక్ర్యాలీ నిలిచిన 6లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి బొగ్గు గనులపై కేంద్రం కుట్ర: ప్రభుత్వ విప్బాల్క సుమన్ సామాజిక సారథి, కరీంనగర్: బొగ్గుగనుల ప్రైవేటీకీకరణకు వ్యతిరేకంగా చేపట్టిని సింగరేణి సమ్మె సక్సెస్అయింది. శనివారం మూడో రోజుకు చేరింది. సిగరేణివ్యాప్తంగా కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో ఆరు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. మొత్తం 23 భూగర్భగనులు, 16 ఓపెన్ కాస్ట్ గనుల్లో సమ్మె విజయవంతమైంది. […]
బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన సింగరేణి ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు సామాజిక సారథి, భద్రాద్రికొత్తగూడెం: బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 9,10,11 తేదీల్లో జరిగే సమ్మెలో పాల్గొనాలని సింగరేణి కార్మికులకు ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. టీబీజీకేఎస్ నేత కోటా శ్రీనివాస్ అధ్యక్షతన ఓసీ2లో జరిగిన ఫిట్ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు వి.ప్రభాకర్రావు, ఏఐటీయూసీ నేత రామ్గోపాల్, ఐఎన్టీయూసీ నాయకుడు వెలగపల్లి జాన్, […]
సారథి న్యూస్, రామగుండం: అర్జీ 1 ఏరియాలో 100 శాతం బొగ్గు ఉత్పత్తికి కృషిచేయాలని, ప్రతి ఒక్కరూ లక్షణ సూత్రాలు పాటించాలని ఆర్ జీ వన్ జీఎం కే నారాయణ కోరారు. శనివారం సాయంత్రం ఆయన జీఎం కార్యాలయంలో గని అధికారులతో సమీక్షించారు. ఉత్పత్తి ఉత్పాదకత పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలను చర్చించారు. సమావేశంలో అధికారులు త్యాగరాజు, బెంజిమెన్, కేవీ రావు, సత్యనారాయణ, అప్పారావు, వెంకటేశ్వరరావు, నవీన్ కుమార్, ఆంజనేయులు, మురళీధర్, హరినాథ్, గని మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.