Breaking News

TREAT

పైలట్​ రోహిత్​రెడ్డికి కరోనా

పైలట్ రోహిత్​రెడ్డికి కరోనా

వికారాబాద్‌: వికారాబాద్​ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్​ రోహిత్​ రెడ్డి కోరోనా బారినపడ్డారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారినపడి విషయం తెలిసిందే. వారంతా కార్పొరేట్​ దవాఖానల్లో చికిత్సపొంది కోలుకున్నారు.

Read More

కోవిడ్​ సెంటర్​లో లైంగికదాడి

ముంబై: కరోనాతో లక్షణాలతో కోవిడ్​ సెంటర్​లో చేరిన ఓ మహిళపై యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ హేయమైన ఘటన ముంబైలో చోటుచేసుకున్నది. కరోనా లక్షణాలతో ఓ మహిళ(40) నేవీ ముంబైలోని కోవిడ్​ సెంటర్​లో చేరింది. మహిళ రెండోఅంతస్థులో ఉండగా.. డాక్టర్​గా పరిచయం చేసుకున్న ఓ యువకుడు ఆమెపై లైంగికదాడి చేశాడు. సదరు యువకుడు కూడా అదే కోవిడ్​ సెంటర్​లో ఐదోఅంతస్థులో చికిత్సపొందుతున్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read More

పిచ్చాసుపత్రిలో 23 మందికి కరోనా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలన్నింటిని వణికిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కేసులతో సర్వత్రా ఆందోళన నెలకొన్నది. తాజాగా ఢిల్లీ సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓ మానసిక వికలాంగుల ఆశ్రమంలో 8 మంది పిల్లలతోపాటు 23 మందికి కరోనా సోకింది. ఈ ఆశ్రమంలో 960 మంది మానసిక వికలాంగులు ఉంటున్నారు. ఈ నెల 5నుంచి 20వతేదీ వరకు మానసిక వికలాంగుల ఆశ్రమంలో కరోనా పరీక్షలు చేయగా 23 కరోనా పాజిటివ్ అని తేలింది. ఇందులో ముగ్గురు […]

Read More

వైద్యం వికటించి వ్యక్తి మృతి

బిజినేపల్లి , సారథి న్యూస్​: ఆర్​ఎంపీ వైద్యం వికటించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆగ్రహించిన బాధితుడి కుటుంబసభ్యులు ఆర్​ఎంపీ దవాఖాన ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి ఆర్​ఎంపీని అదుపులోకి తీసుకున్నారు. నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూర్​కు చెందిన శ్రీనివాస్​రెడ్డి(35) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు అదే గ్రామంలోని వేంకటేశ్వర ప్రాథమిక చికిత్స కేంద్రం లో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అతడికి పెరాలసిస్ వచ్చినట్టు నిర్దారించుకొన్న వైద్యుడు అతడికి మందులు, […]

Read More