సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం 1,896 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82,647కి చేరింది. కరోనాతో తాజాగా 8 మంది మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 645కు చేరింది. కరోనా బారి పడి ఒక్కరోజే 1,788 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 59,374 చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 22,628 ఉన్నాయి. రాష్ట్రంలో తాజాగా 18,035 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దీంతో […]
సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్రంలో సీఎం రిలీఫ్ఫండ్ పేదలపాలిట వరంలా మారిందని నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు పేర్కొన్నారు. సోమవారం నిజాంపేట మండలం నార్లాపూర్కు చెందిన రాజశేఖర్కు ఆయన రూ.14 వేల సీఎం రిలీఫ్ఫండ్ చెక్కును అందజేశారు. ఆయన వెంట నార్లాపూర్ సర్పంచ్ అమర్సేన్రెడ్డి, తిరుపతి తదితరులు ఉన్నారు.
నీటి వాటా ప్రకారమే తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నం కేంద్రం, ఏపీ ప్రభుత్వానికి సమాధానం చెబుతం తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేయడం సరికాదు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వాస్తవాలు వెల్లడిస్తాం జలవనరులశాఖ అధికారులతో సీఎం కె.చంద్రశేఖర్రావు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం కొత్తగా 1,256 కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్కేసుల నిర్ధారణ 80వేల మార్క్ను దాటింది. రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 80,751కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 10 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 637 కు చేరింది. కరోనా నుంచి తాజాగా 1,587 మంది డిశ్చార్జ్ అయ్యారు. వ్యాధి బారినపడి 57,586 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,528 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో […]
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే మూడు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సోమవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం పశ్చిమ బెంగాల్ ప్రాంతాల మీదుగా విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం కొత్తగా 1,982 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 12 మంది మృతి చెందారు. అయితే ఇప్పటివరకు మహమ్మారి బారినపడి చనిపోయిన వారి సంఖ్య 627కు చేరింది. అయితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటివరకు 79,495కు చేరింది. కొత్తగా 1,669 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 55,999గా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 22,869 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 463 నిర్ధారణ […]
సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్నది. కరోనా భారిన పడ్డ రాజకీయనాయకులు, సెలబ్రిటీల సంఖ్య పెరుగుతున్నది. తాజాగా రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో మల్లారెడ్డికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అలాగే మల్లారెడ్డి కుటుంబసభ్యులకు, ఆయనకు సన్నిహితంగా ఉన్న వారికి కూడా అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు. గతంలో హోంమంత్రి మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ […]
సారథిన్యూస్, హైదరాబాద్: మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కరోనా లక్షణాలతో కొంతకాలం క్రితం నిమ్స్లో చేరారు. తాజాగా ఆయనకు నెగిటివ్ వచ్చింది. దాంతో… కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే నంది ఎల్లయ్యకు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇతర అనారోగ్యసమస్యలతోనే ఆయన చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. ఎల్లయ్య మృతితో రాంనగర్లోని ఆయన నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. నంది ఎల్లయ్య […]