సారథి, రామాయంపేట: రైతాంగం గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యారని, రైతాంగాన్ని ఆదుకోవాలని సీఎం కేసీఆర్ ఏడాదికి రూ.12వేల కోట్ల ఖర్చుతో ఉచితంగా కరెంటు అందిస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం మెదక్జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్ లో నిజాంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను ప్రారంభించారు. అలాగే నిజాంపేట జడ్పీ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ సెంటర్ ను […]
సారథి, రామాయంపేట: కరోనాతో రాష్ట్ర ఆదాయం దెబ్బతిన్నప్పటికి కూడా ఏ పథకాలను ఆపకుండా, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా పండించిన పంటను నేరుగా కొనుగోలు సెంటర్లలోనే అమ్ముకోవాలని రైతులకు సూచించారు. ధాన్యం అమ్మిన మూడు నాలుగు […]
తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతా నేను ముమ్మాటికీ ఈ గడ్డ బిడ్డనే మా పార్టీ ఎవరి కిందా పనిచేయదు రాజన్న సంక్షేమ పాలనను మళ్లీ తీసుకొస్తాం స్వరాష్ట్ర ఫలాలు అన్నీ ప్రగతి భవన్ కే.. ఉద్యమ ఆకాంక్షలు ఫలించలేదు ఆత్మగౌరవం దొర కాలికింద నలిగింది సచివాలయంలో అడుగుపెట్టని సీఎం అవసరమా? జూలై 8న పార్టీ జెండా, ఎజెండా ప్రకటిస్తాం ఖమ్మం ’సంకల్పసభ‘లో వైఎస్ షర్మిల సారథి, ఖమ్మం: తెలంగాణ కోసం బరాబర్ నిలబడతానని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ […]
సారథి, రామడుగు: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో యువత ఆత్మహత్యలకు పాల్పడడం విచారకరమని, నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిబాధ్యత వహించాలని బీజేవైఎం కరీంనగర్ జిల్లా రామడుగు అధ్యక్షుడు దుర్శెటి రమేష్ అన్నారు. నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్య పాల్పడిన మహేందర్ యాదవ్, ప్రైవేట్టీచర్ వెన్నం రవికుమార్ ఆత్మహత్యలపై అసమర్థ ప్రభుత్వ పాలనకు నిరసనగా రామడుగు మండల బీజేవైఎం శాఖ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను […]
సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ జగ్గుల చిన్నయ్యకు తెలంగాణ సాంస్కృతిక నాటక అకాడమీ ఉత్తమ అవార్డు దక్కింది. ఈ అవార్డును రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతులమీదుగా ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా జెగ్గుల చిన్నయ్య మాట్లాడుతూ.. 40 ఏళ్ల నుంచి కళాకారుడుగా శ్రీకృష్ణరాయబారం, చింతామణి హరిశ్చంద్ర నాటకాల్లో పలు పాత్రలను పోషించి కళాభిమానుల ఆదరణ పొందినందుకు గుర్తింపుగా తనకు అవార్డు రావడం సంతోషంగా […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల మూసివేత తాత్కాలికమేనని, విద్యార్థులు, తల్లిదండ్రులు, రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని సీఎం కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో లాక్డౌన్ ఉండబోదని స్పష్టం చేశారు.రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అన్నిరకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రతిపక్షాలు బలమైన సలహాలు, సూచనలు ఇవ్వడం లేదన్నారు. ప్రతి విషయాన్ని విమర్శించడం సరికాదని, మూస ధోరణిలో […]
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీపోస్టుల వివరాలను పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని శాఖల కార్యదర్శులకు లేఖలు రాశారు. ఆయా శాఖల్లోని ఖాళీ పోస్టుల సంఖ్య, వాటి హోదా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలనుకుంటున్న పోస్టుల వివరాలను నిర్దిష్ట ఫార్మాట్లో పంపించాలని సూచించారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పోస్టుల వివరాలు వద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉద్యోగుల రిటైర్ మెంట్ ఏజ్ ను పెంచిన దృష్ట్యా ఖాళీపోస్టుల సంఖ్యలో తేడాలు ఏర్పడ్డాయి. […]
టీబీలేని తెలంగాణగా మారుద్దాం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అవేర్ గ్లెనిగల్ గ్లోబల్ దవాఖానలో వరల్డ్ టీబీ డే ఉత్సాహంగా ‘3 కే వాక్థాన్’ అవగాహన ర్యాలీ సారథి న్యూస్, హైదరాబాద్: క్షయవ్యాధిని నిర్మూలిద్దాం.. 2025 లోపు టీబీలేని రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వరల్డ్ టీబీ డే (ప్రపంచ క్షయవ్యాధి దినం) ను పురస్కరించుకుని ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని బైరామల్గూడ అవేర్ గ్లెనిగల్ గ్లోబల్ దవాఖాన ఆధ్వర్యంలో ‘3కె […]