హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత అనుచరుడిగా పనిచేసి ఆయన ఆత్మగా పేరొందిన సూరీడుపై అతని అల్లుడు సురేంద్రనాథ్రెడ్డి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలోకి ప్రవేశించి క్రికెట్ బ్యాట్తో దాడికి దిగాడు. గతేడాది కూడా సురేంద్రనాథ్ సూరీడుపై దాడికి తెగబడ్డాడు. భార్యను వేధింపులకు గురి చేస్తుండడంతో గతంలో సురేంద్రనాథ్పై గృహహింస కేసు నమోదైంది. ఈ కేసును ఉపసంహరించుకోవాలని సూరీడుపై సురేంద్రనాథ్ ఒత్తిడి తీసుకొస్తున్నాడు. కేసును ఉపసంహరించుకోకపోవడంతో కక్షతో మామను […]
ఆదిలాబాద్: కట్నకానుకల కింద తమ బిడ్డ, అల్లుడికి బంగారు నగలు, స్థిరాస్తులు రాసి ఇస్తున్న ఈ తరుణంలో ఓ తండ్రి తన కూతురుకు విలువైన సంపద ఇచ్చాడు. అవేమిటో తెలుసా.. అరకపోయే జోడెద్దులు. ఈ సంస్కృతి సంప్రదాయం గిరిజన కుటుంబాల్లో తరతరాలుగా వస్తోంది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం వైజాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం సంగీతను ఆదిలాబాద్ మండలం ఛిచూధర్ ఖానాపూర్ గ్రామానికి చెందిన నైతం ప్రభుకు ఇచ్చి పెండ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. మంగళవారం పెళ్లికొడుకు […]
సారథి న్యూస్, వాజేడు: వాజేడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సోషల్ వెల్ఫేర్ ఎస్సీ బాయ్స్ హాస్టల్ లోని విద్యార్థులు, టీచర్లు, సిబ్బందికి, అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ స్టాఫ్, స్టూడెంట్స్కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. డాక్టర్ యుమున ఆధ్వర్యంలో అనంతరం కోయవీరపురం, దూలపురం, కొంగల గ్రామాల్లో మెడికల్ టెస్టులు చేశారు. మొత్తం 75మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, అందరికీ నెగటివ్ గా రిపోర్ట్ వచ్చింది. కార్యక్రమంలో డాక్టర్ యమున, సీఎచ్ వో. సూర్యప్రకాష్, […]
టీబీలేని తెలంగాణగా మారుద్దాం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అవేర్ గ్లెనిగల్ గ్లోబల్ దవాఖానలో వరల్డ్ టీబీ డే ఉత్సాహంగా ‘3 కే వాక్థాన్’ అవగాహన ర్యాలీ సారథి న్యూస్, హైదరాబాద్: క్షయవ్యాధిని నిర్మూలిద్దాం.. 2025 లోపు టీబీలేని రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వరల్డ్ టీబీ డే (ప్రపంచ క్షయవ్యాధి దినం) ను పురస్కరించుకుని ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని బైరామల్గూడ అవేర్ గ్లెనిగల్ గ్లోబల్ దవాఖాన ఆధ్వర్యంలో ‘3కె […]