9 మందిపై పోలీసుల కేసు సామాజికసారథి’ వరుస కథనాలతో కదిలిన పోలీసు యంత్రాంగం సామాజికసారథి, బిజినేపల్లి: కారుకొండ గ్రామంలో గౌరమ్మ అనే మహిళపై అత్యాచారం.. ఆపై ఆమెను మోసగించి బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్న కేసులో ప్రధాన నిందితుడు మిద్దె బాలస్వామిని మంగళవారం రిమాండ్కు తరలించినట్లు నాగర్ కర్నూల్ సీఐ హనుమంతు యాదవ్ మీడియాకు తెలిపారు. ఆయనతో పాటు మరో 9 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులంతా ఒకే కుటుంబ చెందిన […]
అధికారపార్టీలో టికెట్ కోసం పోటాపోటీ ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ఆశావహులు ::: గంగు ప్రకాశ్, సామాజికసారథి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఏడాదిన్నర ముందే మొదలైనట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని రాజకీయ పార్టీల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో అటు అధికార పార్టీలోనూ అలజడి మొదలైంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ వస్తుందోనని ఎవరి వర్గం నాయకులు వారు అంచనాలు వేసుకుంటున్నారు. ముందస్తుగానే ఎవరికివారు ప్రజల్లో […]
24 మందిపై కేసుల ఎత్తివేత సామాజికసారథి, నాగర్కర్నూల్ ప్రతినిధి: నాగర్కర్నూల్ జిల్లా పోలీసులు రౌడీ షీటర్లకు గుడ్ చెప్పారు. సత్ర్పవర్తన కింద జిల్లాలో 24 మందిపై రౌడీషీట్ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నాగర్కర్నూల్ డీఎస్పీ మోహన్కుమార్ సోమవారం ప్రకటనలో వెల్లడించారు. కొల్లాపూర్, నాగర్కర్నూల్ సబ్ డివిజన్ల పరిధిలో 69 మంది రౌడీషీటర్లను ముఖాముఖిగా పరిశీలించి కౌన్సిలింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ కె.మనోహర్ వారి సంబంధిత వివరాలను సేకరించారు. ప్రస్తుతం చేస్తున్న పనులు, జీవనోపాధి, సామాజిక వ్యవహారాలు, […]
సామాజికసారథి, వెల్దండ: పద్మశ్రీ అవార్డు గ్రహీత, అరుదైన 12 మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్యను సోమవారం నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ ఎస్సై ఎం.నర్సింహులు ఘనంగా సత్కరించారు. ఆయన బాగోగులను అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామం లింగాల మండలం అవుసలికుంటకు వెళ్తున్న ఆయన సోమవారం వెల్దండలో కొద్దిసేపు ఆగారు. మొగులయ్యను వెల్దండ సర్పంచ్ యెన్నం భూపతిరెడ్డి కలిసి సత్కరించారు. […]
ముగ్గురు సంతానం కేసులో జడ్పీ చైర్ పర్సన్ పై అనర్హత తీర్పు తిమ్మాజీపేట జడ్పీటీసీకి నలుగురు సంతానం ఫిర్యాదు చేయని ప్రతిపక్షాలు.. బయటికి ‘అసలు కథ’ తాడూరు సొసైటీ చైర్మన్ వివరాలూ వివాదాస్పదం అధికారపార్టీలో చేరడంతో అంతా గప్చుప్ కందనూలులో చర్చనీయాంశంగా ‘సంతానం పాలిటిక్స్’ సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ప్రస్తుత రాజకీయాల్లో కులం అనేది రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది.. ఓట్లు తెచ్చిపెట్టడంలోనూ, విభజించడంలోనూ ప్రధానపాత్ర పోషిస్తోంది.. అదే కులం ఇప్పుడు ఎన్నికల్లో తప్పుడు ధ్రువీకరణ […]
అధికారులకు ఓ నాయకుడి ఫిర్యాదు సొంత సామాజికవర్గంలోనే వ్యతిరేకత సామాజికసారథి, బిజినేపల్లి: తనకు న్యాయం చేయాలని, సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఏదైనా పని చట్టవిరుద్ధంగా చేస్తుంటే అధికారులకు ఫిర్యాదు చేయడంలో తప్పులేదు. కానీ అందులో తనకు వాటా దక్కలేదని ఫిర్యాదు చేయడమే వివాదాస్పదమైంది. ఒక మంచి ఉద్దేశంతో పేదలకు ఉపయోగపడాలన్న తపనతో చేస్తున్న పనిని అడ్డుకోవాలని నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో ఓ ముస్లిం నాయకుడు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బిజినేపల్లి […]
ఎమ్మెల్యే సొంత మండలంలోనే అంబులెన్స్ సౌకర్యం లేదు బహుజన రాజ్యంలో విద్యా, వైద్యానికి తొలి ప్రాధాన్యం బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ సామాజికసారథి, తిమ్మాజిపేట: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో మంగళవారం తిమ్మాజిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ.. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సొంత మండలమైన తిమ్మాజిపేటలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటన్నారు. 30 […]
మనువాదుల పార్టీ నుంచి బయటికొచ్చి మాట్లాడు నాగర్ కర్నూల్ గడ్డ.. మహేంద్రనాథ్ అడ్డా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు గూట విజయ్ సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మరాజుపై బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జలాల్ శివుడు చేసిన ఆరోపణలపై బహిరంగ క్షమాపణ చెప్పకపోతే భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు గూట విజయ్ హెచ్చరించారు. ధర్మం తప్పితే మీలాంటి వారికి యమధర్మరాజే అవుతారని హితవు […]