సామాజిక సారథి, హైదరాబాద్: టాలీవుడ్లో సినిమాలతో పాటు కుటుంబాలు, బాంధవ్యాలకు బాగా విలువిచ్చేవారిలో మెగా ఫ్యామిలీ ఒకటి. ఏ పండగొచ్చినా ఇంటిల్లిపాది కలిసి జరుపుకొంటారు. తెలుగు రాష్టాల్లో అతి పెద్ద పండగైన సంక్రాంతి కోసం మెగా బ్రదర్స్ కుటుంబాలు ఒకే చోట చేరాయి. చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు. కాగా తమ భోగి పండగ సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు వరుణ్ తేజ్. దీంతో ఇవి […]
త్వరగా కోలుకోవాలని చిరంజీవి, ఎన్టీఆర్ ట్వీట్ సామాజిక సారథి, హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా నిర్ధారించారు. నాకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సూచన మేరకు చికిత్స, స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటున్నానని చెప్పారు. అయితే నాతో కాంటాక్ట్ అయినవారంతా పరీక్ష చేయించుకోవాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు. అలాగే ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకోలేదో […]
యాక్సిండెంట్కు సంబంధించి వివరాలు కోరిన పోలీసులు సామాజికసారథి, హైదరాబాద్: సినీ హీరోసాయి ధరమ్ తేజ్ గత సెప్టెంబర్ 10న హైదరాబాద్లోని ఐకియా స్టోర్ వద్ద బైక్ స్కిడ్ కావడంతో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్తేజ్.. ప్రస్తుతం సినిమాల్లో నటించడానికి మళ్లీ సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే తేజ్ యాక్సిడెంట్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సాయి ధరమ్తేజ్పై ఛార్జ్ […]
‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం ఆగిపోయింది. పాట హృదయం చెదిరిపోయింది’..అంటూ టాలీవుడ్ హీరో నాగార్జున ట్వీట్ చేశారు. ప్రముఖ సాహిత్య రచయిత ’సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన చిత్రపరిశ్రమకు తీరని విషాదాన్ని కలిగించింది. ఎంతోమంది గుండెలు బద్ధలయ్యేలా చేసింది. సీతారామశాస్త్రి మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులంతా కన్నీటి నివాళులర్పించారు. ఈ క్రమంలో నాగార్జున కూడా ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం ఆగిపోయింది. పాట హృదయం చెదిరిపోయింది’..అని ట్వీట్ చేశారు. ఇదే […]
బాలీవుడ్ హీరోకు టాలీవుడ్ హీరో సుమంత్ డబ్బింగ్ చెబుతున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో లెజెండరీ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ బయోపిక్ ‘83’. ఈ మూవీలో బాలీవుడ్ హీరోరణవీర్ సింగ్ టైటిల్ రోల్ పోషించారు. కపిల్ దేవ్ భార్య రోమీదేవ్గా రణవీర్ సతీమణి దీపికా పదుకొణె నటించారు. కరోనా వేవ్స్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమాను డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.పాన్ ఇండియా స్థాయిలో […]
తమిళ హీరో, నిర్మాత విశాల్కు, ఆయన తండ్రికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా విశాల్ సోషల్మీడియా ద్వారా వెల్లడించారు. విశాల్కు కరోనా సోకిందంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా విశాలే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు. ‘ముందుగా మా నాన్న(జీకే రెడ్డి)కు కరోనా సోకింది. అతడికి నేను సేవలు చేశాను. దీంతో నాకు లక్షణాలు కనిపించాయి. పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆయుర్వేద మందులు వాడి నేను మా […]
ఆర్జీవీ శిష్యుడు, మొదటి సినిమాతోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ర్టీలో ప్రకంపనలు సృష్టించిన అజయ్ భూపతి కొత్త చిత్రం మహాసముద్రంలో యువనటుడు శర్వానంద్ హీరోగా చాన్స్ కొట్టేశాడు. మహాసముద్రం స్ర్కిప్ట్ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. పలు కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోతూ వస్తున్నది. తాజాగా శర్వానంద్ ఈ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. కాగా హీరోయిన్గా రాశీఖన్నా ఎంపికైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కరోనా పరిస్థితులు ఓ కొలిక్కిరాగానే సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, […]
ప్రముఖ తమిళ హీరో, నిర్మాత, నడిగర్ సంఘం కీలకసభ్యడు విశాల్ను ఆయన కార్యాలయంలో పనిచేసే ఓ మహిళ మోసగించింది. ఆరేండ్ల నుంచి సుమారు 45 లక్షలు కాజేసినట్టు సమాచారం. ఆమె తాజాగా ఓ భారీ ఇల్లు కొనుగోలు చేయడంతో ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఈ మేరకు విశాల్ మేనేజర్ చెన్నైలోని విరుగంబక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. సదరు మహిళ ఆదాయపన్ను కట్టాల్సిన డబ్బులు తన సొంత అకౌంట్కు బదిలీ చేసి ఆరేండ్లలో 45 లక్షలు […]