Breaking News

DIESEL

ఎడ్లబండ్లతో నిరసన

ఎడ్లబండ్లతో నిరసన

సామజిక సారథి, రాజోలి : డీజిల్‌, పెట్రోల్‌ ధరలపై వ్యాట్‌ను వెంటనే తగ్గించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలోని గాంధీ చౌక్ నుంచి ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి నెలరోజులు గడుస్తున్నా… తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు వ్యాట్ ను తగ్గించలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం […]

Read More
రైతులపై డీజిల్‌ పిడుగు

రైతులపై డీజిల్‌ పిడుగు

సారథి న్యూస్​, హైదరాబాద్​: పెరుగుతున్న డీజిల్‌ ధరలు రైతులపై అదనపు భారం మోపుతున్నాయి. పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా ట్రాక్టర్లు, యంత్రాల కిరాయిలు పెరుగుతుండడంతో పెట్టుబడి ఖర్చు పెరిగిపోతోంది. వ్యవసాయంలో ప్రస్తుతం యంత్రాల వినియోగం భారీగా పెరిగి పోయింది. సాగు పనులకు కూలీల కొరత వేధిస్తుండడంతో రైతులు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. దుక్కి దున్నడం మొదలుకుని పంట చేతికొచ్చే వరకు కీలకంగా మారాయి. కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రైతులకు మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డ చందంగా […]

Read More
పెట్రోల్ @ ₹ 80

పెట్రోల్ @ ₹ 80

న్యూఢిల్లీ: దేశంలో గత 20 రోజుల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం కూడా పెట్రల్ పై లీటర్‌‌కు 21 పైసలు, డీజిల్‌పై 17 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ రూ.80.13కి చేరగా.. డీజిల్‌ ధర రూ.80.19.. ఈ నెల 7 నుంచి ప్రతి రోజు డీజిల్‌, పెట్రోల్‌పై రేట్లను ఆయిల్ కంపెనీలు రివైజ్‌ చేస్తూనే ఉన్నాయి. కేవలం బుధవారం ఒక్కరోజు మాత్రమే పెట్రోల్‌ ధర పెంచలేదు. డీజిల్‌ ధరలు […]

Read More

పెట్రోధరలు తగ్గించండి

సారథి న్యూస్, హుస్నాబాద్: పెంచిన పెట్రోధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి డిమాండ్​ చేశారు. కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా అంతకంతకూ పెరుగుతున్నా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా ప్రజారోగ్యాన్ని గాలికొదిలాయని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ నెల 25న సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళనలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు ఎడ్ల వెంకట్రామిరెడ్డి, సీపీఐ జిల్లా […]

Read More

పెట్రోలును దాటేసిన డీజిల్

న్యూఢిల్లీ: దేశంలో డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. డీజిల్‌ ధర వరుసగా బుధవారం 18వ రోజు పెరిగింది. పెట్రోల్‌ ధరలు మాత్రం యథాతథంగానే ఉన్నాయి. దీంతో డీజిల్‌ రేటు పెట్రోల్‌ను మించిపోయింది. పెట్రోల్‌ ధర కంటే డీజిల్‌ ధర ఎక్కువగా ఉండడం ఇదే తొలిసారి. డీజిల్‌పైన 0.48 పైసలు పెంచారు. దీంతో ఢిల్లీలో రూ.79.40 ఉన్న డీజిల్‌ ధర ప్రస్తుతం రూ.79.88కి చేరింది. పెట్రోల్‌ ధర రూ.79.76గా ఉంది. ఈ 18 రోజుల్లో పెట్రోల్‌పై రూ.9.41, […]

Read More