వణికిపోతున్న పల్లెజనం ఏపీలో కొత్త ప్రాంతాలకు మహమ్మారి సారథి న్యూస్, కర్నూలు: ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్లో పాగా వేస్తోంది. కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇటీవలే ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా చికిత్సల కోసం అనుమతులు ఇచ్చింది. కరోనా వైరస్ సోకిన వారికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యసేవలు పొందేలా ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ప్రజల్లో […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శనివారం 1,178 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా మహమ్మారి బారినపడి 9 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు మొత్తంగా 348 మంది బలయ్యారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 33,402 కు చేరాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,62,171 టెస్టులు చేశారు. జీహెచ్ఎం పరిధిలో 736 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి జిల్లా 125, మేడ్చల్101, సంగారెడ్డి 13, వరంగల్ అర్బన్ 20, కరీంనగర్24, సిరిసిల్ల […]
సారథి న్యూస్, వాజేడు: భౌతికదూరం పాటించడం, నిరంతరం చేతులను శుభ్రపరుచుకోవడం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించి కరోనాను జయించాలని వాజేడు ఎంపీపీ శారద సూచించారు. శనివారం ములుగు జిల్లా వాజేడు మండలం ఆరుగుంటపల్లిలో ఆమె వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా గ్రామస్థులకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మంకిడి వెంకటేశ్వర్రావు , హెచ్ఎస్ కోటిరెడ్డి, హెచ్ఏ శ్రీనివాస్, ఆశాకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ: కరోనా చికిత్సలో ఉపయోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మరో ఔషధానికి అనుమతిచ్చింది. చర్మవ్యాధి అయిన సొరియాసిస్ను నయం చేసేందుకు ఉపయోగించి ‘ఇటోలీజుమ్యాజ్’మందును కరోనాకు వాడొచ్చని చెప్పింది. ఈ మెడిసిన్ కేవలం ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది. ఓ మోతాదు నుంచి తీవ్ర లక్షణాలు ఉన్నవారికి ఈ మందు వాడొచ్చని డీసీజీఐ అనుమతి ఇచ్చింది. భారత్కు చెందిన బయోకాన్ సంస్థ దీన్న తయారుచేస్తోంది. కోవిడ్పై పోరాడే యాంటీబాడీల ఉత్పత్తిలో కీలకంగా పనిచేసే సైటోకిన్ల విడుదలలో ఇది […]
ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్నది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన గణాంకాలప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 8,20,916 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 27,114 మందికి కరోనా సోకింది. దేశవ్యాప్తంగా 2,83,407 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు 22,123 మంది కరోనాకు బలయ్యారు. 5,15,385 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలంతా భౌతికదూరం పాటించి మాస్కులు ధరించాలని, అత్యవసరమైతేనే బయటకు […]
బెంగళూరు: కర్ణాటక సీఎం యడ్యూరప్ప హోంఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. ఇటీవల ఆయన కార్యాలయంలోని పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘నా కార్యాలయంలోని కొంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో నేను హోం ఐసోలేషన్లోకి వెళుతున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి తాను అధికారిక నివాసం ‘కావేరి’ నుంచి పనిచేస్తానని… వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు తగిన సూచనలు […]
సారథిన్యూస్, హైదరాబాద్: హోం ఐసోలేషన్లో ఉండి చికిత్సపొందుతున్న కరోనా బాధితులకు ‘ఐసోలేషన్కిట్’ ను ఇంటికే పంపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ కిట్లో బాధితుడికి అవసరమైన ఔషధాలు, మాస్క్లు, శానిటైజర్లు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటిని కరోనా బాధితుడికి ఉచితంగా అందిస్తుంది. శుక్రవారం కోఠిలోని ఆరోగ్యకార్యాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు వీలైనంత త్వరలో ఈ కిట్లను అందజేయాలని అధికారులను ఆదేశించారు.ఐసొలేషన్ అవస్థలను తప్పించడానికే..రాష్ట్రంలో రోజురోజుకు […]
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. తిరువనంతపురంలో ఇప్పటికే లాక్డౌన్ విధించిన ప్రభుత్వం అది స్ట్రిక్ట్గా అమలయ్యేందుకు కమాండోలను దించింది. తిరువనంతపురం పరిధిలోని పుంథూరాలో కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నందున ఆ ప్రాంతంలో కమాండోలను మోహరించారు. ఈ ప్రాతంలో గత ఐదు రోజుల్లో 600 మందికి టెస్టులు చేయగా.. 119 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు చెప్పారు. స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్స్కు చెందిన 25 […]