సంగ్రామ్ మహారాజ్ ఆశీర్వాదం తీసుకుంటున్న ఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి
అయోధ్య: ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నోకు బయలుదేరారు. రోజువారి వస్త్రధారణకు భిన్నంగా మోడీ పంచెకట్టులో కనిపించారు. లక్నో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత హెలికాప్టర్లో అయోధ్యకు ప్రధాని పయనమవుతారు. తొలుత ఆయన హనుమాన్ గర్హిలో ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో అయోధ్యను అధికారులు అణువణువునా శానిటైజ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ హనుమాన్ గఢీ ఆలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. రంగురంగుల పూల […]
అయోధ్య: ఎన్నో దశాబ్దాల పోరాట ఫలితంగానే అయోధ్యలో రామమందిరం నిర్మించుకోబోతున్నామని ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోడీ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం యోగి మాట్లాడుతూ.. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అయోధ్యలో రామాలయ కల సాకారమైందని చెప్పారు. ఇక అయోధ్య ప్రపంచస్థాయి నగరంగా రూపుదిద్దుకోబోతున్నదని చెప్పారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ.. రామమందిరం […]
అయోధ్య: భారతీయ జాతీయభావాలకు, సంస్కృతికి అయోధ్య రామాలయం ఓ ప్రతీక అని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. అయోధ్య పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. బుధవారం ఆయన అయోధ్యలో రామాలయానికి భూమిపూజ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఇవాళ జైశ్రీరామ్ అనే నినాదం అయోధ్యలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ప్రతిధ్వనిస్తోందని మోదీ అన్నారు. ‘ప్రతి గుండె ఉప్పొంగుతోంది. ఇది యావద్దేశం భావోద్వేగంతో పులకిస్తున్న వేళ. సుదీర్ఘ నిరీక్షణ ఈ రోజుతో ముగిసింది. రామ్ లల్లా కోసం […]
అయోధ్య: అయోధ్యపురిలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. యావత్ భారతదేశం వేయికండ్లతో వేచిచూసిన దృశ్యం కనువిందు చేసింది. దశాబ్దాల పోరాటం ఫలించింది. 130 కోట్ల భారతీయుల కల నెరవేరింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తొలిఅడుగు పడింది. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా ప్రధాని మోదీ రామాలయ నిర్మాణానికి బుధవారం భూమి పూజచేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భూమి పూజకు ముందు ప్రధాని మోదీ హనుమాన్గర్హిలో పూజలు నిర్వహించారు. రాంలల్లా విగ్రహాన్ని దర్శించుకుని పూజలు […]
ముంబై: ఓ వైపు కరోనా మహమ్మారితో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతుంటే.. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం అవసరమా? అంటూ నవనిర్మాణ సేన అధినేత రాజ్థాక్రే వ్యాఖ్యానించారు. శుక్రవారం ముంబైలోని ఓ ప్రాంతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రజలు పండగలు, ఉత్సవాలు చేసుకొనే మూడ్లో లేరని వ్యాఖ్యానించారు. కరోనా కేసులు పూర్తిగా తగ్గాక అయోధ్యలో భూమిపూజ చేస్తే ప్రజలు ఈ వేడుకలో ఉత్సాహంగా పాలుపంచుకొనేవారని చెప్పారు.
అయోధ్య: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో భక్తులెవరూ అయోధ్యకు రావొద్దని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ కోరారు. ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర శంకుస్థాపన జరుగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో చంపత్ రాయ్ ఈ ప్రకటన చేశారు. దేశంలోని భక్తులందరూ తమ ఇంట్లోనే ఆరోజు పూజలు చేసుకోవాలని సూచించారు. రామమందిర శంకుస్థాపన చరిత్రలో నిలిచిపోతుందని ఆయన చెప్పారు. కరోనా విపత్తువేళ కేవలం పరిమితమైన సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించినట్టు ఆయన చెప్పారు.
అయోధ్య : యావత్ ప్రపంచం గర్వించేలా అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తామని ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. శనివారం ఆయన అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయోధ్యలోని రామ మందిరం, హనుమాన్ మందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆగస్టు 5న జరగనున్న శంకుస్థాపనకు సంబంధించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆ కార్యక్రమం గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయోధ్య దేశానికే గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు. “ ప్రధాని మోడీ అయోధ్య రామమందిరాన్ని సందర్శించనున్నారు. కచ్చితంగా అయోధ్యని దేశం, […]