గోదావరి నుంచి 4, కృష్ణా నుంచి 3 టీఎంసీల నీటిని తరలించాలి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు సారథి న్యూస్, హైదరాబాద్: నిధుల సమీకరణకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తిచేసి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడో టీఎంసీని తరలించే పనులతో పాటు, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలోని ప్రాజెక్టులు.. వాటికి నిధుల సమీకరణ’పై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం 1,430 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 47,705కు చేరిన పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి ఒకేరోజు ఏడుగురు మృతిచెందారు. ఇప్పటివరకు మరణాల సంఖ్య 422 కు చేరింది. ఇప్పటిదాకా 2,93, 077 శాంపిళ్ల టెస్టింగ్ చేశారు. తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ను వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 703 కరోనా పాజిటివ్కేసులు తేలాయి. రంగారెడ్డి 117, మేడ్చల్105, సంగారెడ్డి 50, ఖమ్మం 14, […]
సారథి న్యూస్, రామడుగు: ప్రస్తుతపరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ఎమర్జెన్సీని ప్రకటించాలని కరీంనగర్ జిల్లా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. సోమవారం కరీంనగర్ జిల్లా రామడుగు అంబేద్కర్ చౌరస్తాలో సీపీఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో ఉమ్మెంతుల రవీందర్ రెడ్డి, మచ్చ రమేశ్, ఏగుర్ల మల్లేశ్, వేముల మల్లేశం, పారునంది మొండయ్య,ఉమ్మెంతుల రాజిరెడ్డి,రఫిక్ తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల గోపాల్రావుపేటలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో మార్కెట్ ఆవరణలో 500 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. మొక్కలను నాటడం గొప్పకాదు వాటిని పరిరక్షించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రిసోర్సెస్ డిపార్టుమెంట్ గా మార్పు ఈఎన్సీలకు కీలక బాధ్యతలు విస్తృతస్థాయి సమావేశం సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్న పరిస్థితుల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యం, బాధ్యత పెరుగుతోందని సీఎం కె.చంద్రశేఖర్ రావు అన్నారు. జలవనరుల శాఖ ఒకే గొడుగు కింద ఉండాలని, వేర్వేరు విభాగాలు ఇకపై కొనసాగవని స్పష్టంచేశారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో నీటి పారుదల శాఖ వికేంద్రీకరణ, పునర్ వ్యవస్థీకరణ జరగాలన్నారు. అవసరమైతే వెయ్యి పోస్టులు కొత్తగా […]
సారథి న్యూస్,రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో కోతుల బెడద ప్రజలను వేధిస్తున్నది. ప్రజలు ఇంట్లోనుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రోడ్లమీద కోతులు గుంపులుగుంపులుగా చేరి భయపెడుతున్నాయి. ఇండ్లలోకి చేరి ఆహారపదార్థాలను ఎత్తుకుపోతున్నాయని ప్రజలు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు చొరవ తీసుకొని కోతులను తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం 1,198 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 46,274 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒకేరోజు ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటిదాకా మృతిచెందిన వారి సంఖ్య 415కు చేరింది. ఇప్పటివరకు 11,003 శాంపిళ్లను పరీక్షించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 510 పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి 106, మేడ్చల్76, సంగారెడ్డి 10, వరంగల్అర్బన్73, కరీంనగర్87, జగిత్యాల 36, మహబూబాబాద్ 36, మెదక్13, మహబూబ్నగర్50, భూపాలపల్లి […]
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. తాజాగా, మరో మూడురోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో […]