Breaking News

TELANGANA

కరోనాకు రెడ్డీల్యాబ్స్​ మందు

సారథిన్యూస్​, హైదరాబాద్​: కరోనా మహమ్మారిని తగ్గించేందుకు రెమిడిసివిర్​, ఫావిపిరవర్​ మందులు కొంతమేర ప్రభావవంతంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ఔషధకంపెనీలు ఈ మందులను మార్కెట్లో విక్రయిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఔషధకంపెనీ రెడ్డీ ల్యాబ్స్​కరోనా టాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. అవిగాన్ బ్రాండ్ పేరుతో ఫావిపిరవిర్ 200 ఎంజీ టాబ్లెట్లను విడుదల చేస్తున్నట్లు బుధవారం డాక్టర్ రెడ్డీస్ బ్రాండెడ్‌ మార్కెట్స్‌ సీఈవో ఎంవీ రమణ తెలిపారు. వ్యాధి తీవ్రంగా లేనివారికి ఈ మందు మెరుగ్గా […]

Read More

తెలంగాణలో 1,763 కొత్త కేసులు

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 1,763 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పటివరకు 95,700 మంది కరోనా బారిన పడ్డారు. మంగళవారం ఒక్కరోజే 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాబారిన పడి 719 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 1789 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 73,991కి చేరుకున్నది. రాష్ట్రంలో 20,990 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. 7,97,470 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు […]

Read More

ఆందోళన వద్దు.. అండగా ఉంటాం

సారథిన్యూస్​, వరంగల్​: వరదబాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రులు కేటీఆర్​, ఈటల, ఎర్రబెల్లి దయాకర్​, సత్యవతి రాథోడ్​ హామీ ఇచ్చారు. మంగళవారం వారు వరంగల్​ నగరంలో పర్యటించారు. మంత్రులు కేటీఆర్​, ఈటల రాజేందర్​ హైదరాబాద్​ నుంచి వరంగల్​కు హెలీక్యాప్టర్​లో వెళ్లారు. అనంతరం ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్​తో కలిసి వరంగల్ నగరంలోని నయీం నగర్, సమ్మయ్య నగర్, గోపాలపూర్, పెద్దమ్మగడ్డ – యూనివర్సిటీ రోడ్, పోతన నగర్, బొందివాగు రోడ్, రామన్నపేట, హంటర్ రోడ్, సంతోషిమాత గుడి ప్రాంతం, […]

Read More

చంద్రశేఖర్​గౌడ్​కు సన్మానం

సారథిన్యూస్, చొప్పదండి: కరీంనగర్​ జిల్లా చొప్పదండి వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్మన్​గా ఎన్నికైన అరెల్లి చంద్రశేఖర్​గౌడ్​ను మంగళవారం డీపీడీఎఫ్​( డెమొక్రటిక్​ ప్రైవేట్​ టీచర్స్​ యూనియన్​ ) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. చంద్రశేఖర్​గౌడ్​ గతంలో డీపీడీఎఫ్​ గౌరవాధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. చంద్రశేఖర్​గౌడ్​ ఆధ్వర్యంలో వ్యవసాయమార్కెట్​ మరింత అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మార్కెట్​కమిటీ వైస్​ చైర్మన్​ కొత్తగంగారెడ్డి, డీపీడీఎఫ్​ నాయకులు మాచర్ల మహేశ్​, ఉపాధ్యక్షుడు గోవులకొండ అనిల్​, కోశాధికారి రమేశ్​, సభ్యులు […]

Read More

నిర్వాసితులంటే ఇంత నిర్లక్ష్యమా!

సారథిన్యూస్, రామడుగు: నిర్వాసితులకు పరిహారం ఇప్పించడంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ విఫలమయ్యారని టీడీపీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి ఆరోపించారు. నారాయణపూర్​ రిజర్వాయర్​ కోసం ఎందరో పేదలు ఇండ్లు, భూములు కోల్పోయారని ఎమ్మెల్యే రవిశంకర్​ కనీసం వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. బుధవారం జోజిరెడ్డి నేతృత్వంలోని టీడీపీ బృందం గంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని సందర్శించి.. బాధిత కుటుంబాలను పరామర్శించింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి జంగం అంజయ్య, గంగాధర మండల […]

Read More

పీహెచ్​సీ ఆకస్మిక తనిఖీ

సారథి న్యూస్, పెద్ద శంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పీహెచ్​సీని రాష్ట్ర కోవిడ్​ బృందం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. పీహెచ్​సీ పరిధిలో ఇప్పటివరకు ఎన్ని కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఎన్ని పాజిటివ్​ వచ్చాయి తదితర వివరాల గురించి రాష్ట్ర బృందం ఆరా తీసింది. డాక్టర్​ ప్రభావతి నేతృత్వంలోని రాష్ట్ర బృందం పీహెచ్​సీ రికార్డులను పరిశీలించింది. కార్యక్రమంలో పీహెచ్​సీ సిబ్బంది భూమయ్య, రామ్మోహన్​, విజయభాస్కర్​ తదితరులు పాల్గొన్నారు.

Read More
తెలుగు రాష్ట్రాలకు వాన గండం

తెలుగు రాష్ట్రాలకు వాన గండం

19న మరో అల్పపీడనం అలర్ట్​ అయిన ఇరురాష్ట్రాల అధికారులు హైదరాబాద్​: తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు మరో మూడురోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని వాతావరణశాఖ అంచనావేసింది. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్ గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఇది ప్రయాణించి బలహీనపడే అవకాశం […]

Read More
సెక్రటేరియట్ పర్యవేక్షణకు కొత్త పోస్ట్​

సెక్రటేరియట్ పర్యవేక్షణకు కొత్త పోస్ట్​

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణం కోసం రోడ్లు భవనాల శాఖలో సూపరింటెండెంట్ ఇంజనీర్ సూపర్ న్యూమరరీ పోస్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది. రిటైర్డ్ ఇంజనీర్ సత్యనారాయణను ఆ పోస్టులో నియమించింది. ఏడాది పాటు లేదా పని పూర్తయిన తర్వాత ఈ సూపర్ న్యూమరరీ పోస్ట్ లాప్స్ కానుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం రాత్రి ప్రభుత్వం జారీచేసింది. ఇప్పటికే నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ ను ఖరారుచేశారు. సెక్రటేరియట్ […]

Read More