సారథి న్యూస్, నెట్వర్క్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రమంతా అతలాకుతలమైంది. భాగ్యనగరం ఒక్కసారిగా స్తంభించిపోయింది. మూసీ ఉగ్రరూపం దాల్చింది. సరూర్నగర్చెరువు ఉప్పొంగింది. వరద ప్రళయమే సృష్టించింది. వరద ఉధృతికి కార్లు కొట్టుకొచ్చాయి. ఆ గల్లీ.. ఈ గల్లీ.. ఏది చూసినా జలసంద్రమైంది. అలాగే రాష్ట్రంలో పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరి చేలు నీట మునిగిపోయాయి. రోడ్లు, వంతెనలు వరద ఉధృతికి ధ్వంసమయ్యాయి.
సారథి న్యూస్, హైదరాబాద్: కూరగాయలు, పండ్లు, పూల తోటల సాగులో గుణాత్మక మార్పులు రావాలని, ఇందుకోసం ఉద్యానవన శాఖ సుశిక్షితం, బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో విభిన్న స్వభావాలు కలిగిన నేలలు, మంచి వర్షపాతం, వృత్తి నైపుణ్యం కలిగిన రైతులు ఉన్నారని అన్నారు. ఈ సానుకూలతలను వినియోగించుకుని పండ్లు, కూరగాయలు, పూల సాగులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని సూచించారు. ప్రగతి భవన్ లో బుధవారం ఉద్యానవన శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష […]
హైదరాబాద్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో హైదరాబాద్ శివారు ప్రాంతాలు వణికిపోతున్నాయి. నగరంలోని అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 1500 కాలనీల్లో నడుముల లోతు మేర వరద నీరు చేరింది. కాలనీల్లో వరద నీరు ఉధృతంగా ప్రహహిస్తుండడంతో అధికారులు బోట్లు, నాటుపడవల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కనీసం మూడు రోజుల వరకు నగరవాసులు బయటకు రావొద్దని హెచ్చరించారు.అత్యవసర సేవల కోసం 040 – 211111111, జీహెచ్ఎంసీ […]
బిగ్బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బిగ్బాస్ హౌస్లో జరిగేదంతా డ్రామా. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో బయటకు చెప్పరు. అక్కడి పరిస్థితులు చూస్తుంటే మహబూబ్ను కావాలనే సేవ్ చేస్తున్నారని క్లియర్గా తెలుస్తుంది. నేను, టీవీ9 దేవి, జోర్దార్ సుజాత స్కిన్ షో చేయం. అఫైర్లు పెట్టుకోం. వీకెండ్ టైంలో అన్ని విప్పి కూర్చోం. అందుకే మమ్మల్ని ఎలిమినేట్ చేశారు. మోనాల్ గజ్జర్, హారిక, అరియానా బాగా ఎక్స్ఫోజ్ చేస్తారు. లవ్ […]
హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం ఏసీబీ అదుపులో ఉన్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ భూ వివాదంలో నాగరాజు రూ. కోటి పదిలక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే నాగరాజు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలు గదిలో ఆయన ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు జైలు అధికారులు తెలిపారు.
హైదరాబాద్: ప్రముఖ నాట్య కళాకారిణి, పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభానాయుడు బుధవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి శోభానాయుడు స్వస్థలం. ఆమె చిన్నప్పటి నుంచే వెంపటి చిన సత్యం వద్ద శిష్యరికం చేశారు. అనంతరం కొన్ని వేల నాట్యప్రదర్శనలు ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పేరు ప్రఖ్యాతలు సాధించారు. 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. […]
స్వీటీ అనుష్క సోషల్మీడియాలో దూసుకుపోతున్నది. ఎప్పటికప్పడు ఫ్యాన్స్తో విశేషాలను పంచుకుంటూ దూసుకుపోతున్నది. రీసెంట్గా నిశ్భబ్దం చిత్ర ప్రమోషన్లో భాగంగా ట్విట్టర్లో కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ బొద్దుగుమ్మ. అయితే ఇన్స్టాలో అనూష్కను ఫాలో అయ్యేవారి సంఖ్య 4 మిలియన్లకు చేరిందట. ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది స్వీటీ. ‘ధన్యవాదాలు.. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి.. ప్రేమతో మీ అనుష్క’ అని ఆమె సంతకం చేసి ఉంది. ఆమె అభిమానులు కూడా సంతోషం వ్యక్తం […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శ్వేత కేసు గంటగంటకో మలుపు తిరుగుతోంది. ప్రియుడు అజయ్ వేధింపులు భరించలేకే శ్వేత ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే తల్లిదండ్రుల వాదన మరోవిధంగా ఉంది. తమ కూతురును అజయ్ హత్యచేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. కాగా, పోలీసులు ఇప్పటికే అజయ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు నేపథ్యం ఇదీ.. హైదరాబాద్లోని మేడిపల్లికి చెందిన శ్వేత.. హైటెక్ సిటీలోని […]