Breaking News

RAMAGUNDAM

బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

సారథి, రాముగుండం ప్రతినిధి: గోదావరిఖని బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా బల్మూరి అమరేందర్ రావు ఎన్నికయ్యారు. మొత్తం 178 ఓట్లకు గాను 169 ఓట్లు పోలయ్యాయి. ఆయనకు 104 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి మేడ చక్రపాణికి 55 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా పోటీచేసిన జవ్వాజి శ్రీనివాస్ కు 86ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి చందాల శైలజకు 81 ఓట్లు పడ్డాయి. కోశాధికారిగా బరిలో నిలిచిన ఈ.నరసయ్యకు 62, గుల్ల రమేష్ కు […]

Read More
కుంట శ్రీనివాసే సూత్రధారి

కుంట శ్రీనివాసే సూత్రధారి

వీడిన న్యాయవాది దంపతుల హత్యకేసు మిస్టరీ ప్రధాన నిందితులు ముగ్గురు అరెస్ట్ హత్యకు వాడిన నలుపు రంగుకారు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఐజీ వి.నాగిరెడ్డి సారథి న్యూస్, రామగుండం: మంథనికి సమీపంలో హైకోర్టు న్యాయవాదుల దంపతులు గట్టు వామన్ రావు, పీవీ నాగమణిని దారుణంగా హతమార్చింది కుంట శ్రీనివాస్, అతని గ్యాంగేనని తేలింది. అన్ని కోణాల్లో దర్యాప్తుచేసిన పోలీసులు ప్రధాన నిందితులు కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్​ను అరెస్ట్​చేశారు. హత్యోదంతానికి సంబంధించిన వివరాలను గురువారం […]

Read More
17న సామూహిక హరితహారం

17న సామూహిక హరితహారం

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా సింగరేణి యాజమాన్యం ఈనెల 17తేదీన ఒక్కరోజునే రెండులక్షలకు పైగా మొక్కలను సింగరేణివ్యాప్తంగా నాటాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ఏరియాల్లో దీనికోసం సన్నాహాలు చేస్తున్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఎస్‌.చంద్రశేఖర్‌(ఆపరేషన్స్‌,పా) కొత్తగూడెం కార్పొరేట్‌ ఏరియాలో ఎన్‌.బలరాం(ఫైనాన్స్‌, పీ అండ్​ పీ) భూపాలపల్లి ఏరియాలో డి.సత్యనారాయణరావు(ఈఎం) రామగుండం-1 ఏరియాలో పాల్గొననున్నారు. కరోనా జాగ్రత్తలను కచ్చితంగా పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాజమాన్యం కోరింది.

Read More
ఆర్మీ రిక్రూట్​మెంట్​లో 50 మంది ఎంపిక

ఆర్మీ రిక్రూట్​మెంట్​లో 50 మంది ఎంపిక

సారథి న్యూస్, రామగుండం: సింగరేణి ఆర్జీ–1 డివిజన్ పరిధిలోని జవహర్​ లాల్ నెహ్రూ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన ఆర్మీ రిక్రూట్ మెంట్​ టెస్టులో 50 మంది యువకులు ఎంపికయ్యారు. దరఖాస్తు చేసుకున్న 147 మంది అభ్యర్థులకు అన్నిరకాల పరీక్షలు నిర్వహించారు. జీఎం కె.నారాయణ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ఆర్మీ రిక్రూట్​మెంట్​ ర్యాలీని ప్రారంభించారు. ఎంపికైన అభ్యర్థులకు 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు జి.దామోదర్ రావు, ఎస్ వో–2 జీఎం […]

Read More
20 నుంచి కార్మిక, కర్షక పోరుయాత్ర

20 నుంచి కార్మిక, కర్షక పోరుయాత్ర

సారథి న్యూస్, రామగుండం: జనవరి 20 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే కార్మిక, కర్షక పోరుయాత్రను జయప్రదం చేయాలని సీఐటీయూ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక శాంతిభవన్​లో పెద్దపెల్లి జిల్లా సీఐటీయూ ఆఫీస్ బేరర్స్​సమావేశం బుర్ర తిరుపతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని డిమాండ్​చేశారు. చలిలో పోరాడుతున్న రైతులను పట్టించుకోవడం లేదన్నారు. 30న గోదావరిఖనిలో ముగింపు […]

Read More
రామగుండం ఐటీ పరిశ్రమలకు అనువైన ప్రాంతం

రామగుండం ఐటీ పరిశ్రమలకు అనువైన ప్రాంతం

సారథి న్యూస్, రామగుండం: రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు ఆదేశాల మేరకు ఐటీ సీఈవో(ప్రమోషన్స్) విజయ్ ​రంగనేనితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఐటీ పార్క్ వస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు.మంత్రి నిరంజన్​రెడ్డిని కలిసిన కోరుకంటిఅంతకుముందు ఆయన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డిని కలిశారు. రైతు వేదికలు, వ్యవసాయ మార్కెట్​ ప్రారంభోత్సవానికి రావాలని […]

Read More
చిరుత సంచారం.. అలర్ట్​గా ఉండాలె

చిరుత సంచారం.. అలర్ట్​గా ఉండాలె

సారథి న్యూస్, రామగుండం: చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో పరిసర గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఫారెస్ట్​అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం రోజులుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని జనగామ శివారులో చిరుత పులి సంచరిస్తోందని, శివారు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. సమావేశంలో నగర మేయర్ అనిల్ కుమార్, అడవిశాఖ […]

Read More
మహనీయుల జీవితాలు అందరికీ ఆదర్శం

మహనీయుల జీవితాలు అందరికీ ఆదర్శం

సారథి న్యూస్, రామగుండం: మహనీయుల జీవితాలను యువకులు ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. నేషనల్ యూత్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక శ్రీరామ విద్యానికేతన్ ఆవరణలో సావిత్రిబాయి పూలే 190వ జయంతి, స్వామి వివేకానంద 150వ జయంతి, జాతీయ యువజన వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం విజేతలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. యూత్ ప్రాజెక్ట్ రాష్ట్ర అధ్యక్షుడు కె.యాదవరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, […]

Read More