సారథిన్యూస్, సనత్నగర్: కరోనా వచ్చినవారి పేర్లను సోషల్మీడియాలో షేర్ చేసినా.. వారిపై దుష్ప్రచారం చేసినా చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని సనత్నగర్ సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో కరోనా రోగులు పేర్లు షేర్ చేస్తున్నారని ఇది చట్టవిరుద్ధమని చెప్పారు. కరోనా రోగులను కించపరిచే పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కరోనా రోగులను దయతో చూడాలని.. వారికి దూరంగా ఉంటూ మాస్కులు, గ్లౌజులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అవకాశం ఉంటే ఏదైనా సాయం […]
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నప్పటికీ.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు 10,94,374 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. అగ్రదేశాలైన అమెరికా, రష్యా వంటి దేశాలతో పోల్చుకున్నప్పడు ఇండియాలో రికవరీ రేటు ఎక్కువగా ఉంది. కాగా, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 57,118 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 16,95,988కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనాతో అధికారికంగా 36,511 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో(శనివారం) 2,083 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తంగా 64,786 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి ఒకేరోజు 11 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మరణాల సంఖ్య 530కు చేరింది. ప్రస్తుతం 17, 754 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ అయిన కేసుల సంఖ్య 1,114 గా నమోదైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 578 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి […]
జెనీవా: కరోనాతో యువతకు ముప్పు ఉందని, దాన్ని లైట్ తీసుకోవద్దని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) వార్నింగ్ ఇచ్చింది. వైరస్ను లైట్ తీసుకుని సమ్మర్ హాలిడేస్ను ఎంజాయ్ చేయలనుకోవడం వల్లే కేసులు పెరిగాయని అన్నారు. ఈ విషయాన్ని గతంలోనే చెప్పామని, ఇప్పుడు మళ్లీ గుర్తుచేస్తున్నామని అన్నారు. వృద్ధులకు ముప్పు ఉన్నట్లే యువతకు కూడా ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. కరోనా బారినపడి యువకులు కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధోనమ్ గెబ్రెయేన్ […]
సారథిన్యూస్, హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు ఫెయిల్ అయిన విద్యార్థులకు కనీస పాస్మార్కులు (35 శాతం) వేసి కంపార్ట్మెంటల్లో పాస్చేసింది. విద్యార్థులందరినీ పాస్చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,50,941 మంది విద్యార్థులను పాస్చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి శుక్రవారం ప్రకటించారు. విద్యార్థులు ఈ నెల 31వ తేదీ (శుక్రవారం) మధ్యాహ్నం 2 […]
సారథి న్యూస్, కర్నూలు: ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ కరోనాను తరిమికొట్టాని కర్నూలు ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్బాష ఆటోడ్రైవర్లకు సూచించారు. గురువారం నగరంలోని సుంకేసుల రోడ్డు నేతాజీ టాకీస్ వద్ద రోజా కమ్యూనిటీ రీసోర్స్పర్సన్ సుమత ఏర్పాటుచేసిన ‘కరోనా ఆటోడ్రైవర్స్ జాగ్రత్తలు’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటోడ్రైవర్లకు సూచనలు, సలహాలు ఇచ్చారు. మాస్క్ లేనిదే ప్రయాణికులను ఆటోల్లో ఎక్కువ మందిని ఎక్కించుకోకూడదని, డ్రైవర్లు కూడా కట్టుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా వేడి నీరు తాగాలని చెప్పారు. వైరస్ను తరిమికొట్టడమే […]
సారథి న్యూస్, గద్వాల: కరోనాను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత షేక్ షావలీ ఆచారి విమర్శించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వం ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా విస్తరిస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని ఆరోపించారు. గద్వాల జిల్లాలో తక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అనారోగ్యంతో ఉన్నవారందరికీ టెస్టులు చేయాలని కోరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు […]
మానోపాడు: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో పరిశుభ్రత ఎంతో ముఖ్యమని జోగుళాంబ గద్వాల డీఎంహెచ్వో చందునాయక్ పేర్కొన్నారు. గురువారం ఆయన మానోపాడు పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పీహెచ్సీ ఆవరణలో చెత్త పేరుకుపోయి ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించారు. రోగులకు విధిగా శానిటైజర్ లను అందించడంతోపాటు కరోన మహమ్మారి పట్ల భయం తొలగించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సవిత, సూపరవైజర్లు చంద్రన్న, లలిత […]