సారథి న్యూస్, హైదరాబాద్: హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని, డాక్టర్లతో కౌన్సెలింగ్ ఇప్పించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, జిల్లాల్లో కోవిడ్ మేనేజ్ మెంట్ పై జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో గురువారం బీఆర్ఆర్ భవన్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్థానిక జిల్లా […]
ఢిల్లీ: ప్లాస్మా థెరపీతో ఏ విధమైన ప్రయోజనం లేదని.. ఈ విధానంతో మరణాలను తగ్గించలేకపోతున్నామని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిమ్స్ చేసిన ప్రాథమిక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని చెప్పారు. బుధవారం ఢిల్లీలో నేషనల్ క్లినికల్ గ్రాండ్ రౌండ్స్ ‘కరోనా కట్టడిలో ప్లాస్మా థెరపీ పాత్ర’ అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సదస్సులో గులేరియా మాట్లాడారు. ఎయిమ్స్లో జరిపిన ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయిల్స్లో ఈ విషయం వెల్లడైందన్నారు. ఎయిమ్స్లో 30 […]
సారథి న్యూస్, మానవపాడు: కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ దివ్య సూచించారు. మానోపాడు పీహెచ్సీ పరిధిలో 75 మందికి పరీక్షలు నిర్వహించగా 21 కేసులు బయటపడ్డాయని చెప్పారు. కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జలుబు, దగ్గు , ఆయాసం, జ్వరం ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 2,092 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 13 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 589కు చేరింది. ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 73,050 నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో కోలుకుని ఇప్పటి వరకు 52,103 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 20,358 రాష్ట్రంలో యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 13,793 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ […]
ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 13, 28,336 కు చేరుకుంది. గత 24 గంటల్లో 46,121 కేసులు నమోదయ్యాయి. కాగా, ఇప్పటివరకు 67.6 శాతం రికవరీ రేటు ఉందని కేంద్ర వైద్యశాఖ అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు కరోనాతో 40, 699 మంది మృతిచెందగా, 5,95,501 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావు పాటిల్ నీలాంగేకర్ (88) బుధవారం కన్నుమూశారు. అనారోగ్యంతో పూణేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. శివాజీరావుకు ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయడంతో ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్నా కిడ్నీ ఫెయిలవ్వడంతో బుధవారం తెల్లవారుజామున మరణించారని వైద్యులు చెప్పారు. శివాజీరావు మధుమేహం, బీపీ, కరోనాలతో బాధపడుతూ చికిత్స పొందుతూ మరణించారని వైద్యులు […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి సామాన్యులను, సెలబ్రిటీలను సైతం వదలడం లేదు. తాజాగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. మూడురోజులుగా జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. కాగా, తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. కుటుంబసభ్యులకు ఇబ్బంది కలుగకూడదనే ఆస్పత్రిలో చేరానని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తనను పరామర్శించేందుకు చాలా […]
వాషింగ్టన్: కరోనా మహమ్మారిని యూఎస్ బాగా కట్టడి చేసిందని, ఇండియా మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘మనం చాలా బాగా చేస్తున్నామని అనుకుంటున్నాను. ఏ దేశం చేయని విధంగా మనం పనిచేశామని అనుకుంటున్నాను. మీరు పరిశీలిస్తే ఇప్పుడు ఏ దేశాల గురించి మాట్లాడుకుంటున్నారో తెలుస్తోంది. మనది చైనా, ఇండియా మినహా మిగతా దేశాల కంటే పెద్ద దేశం. చైనా ప్రస్తుతం భారీ మంటలను ఎదుర్కొంటోంది. ఇండియా విపరీతమైన సమస్యను ఎదుర్కొంటోంది. భారతదేశానికి […]