Breaking News

శ్రీకాకుళం

ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

సారథి న్యూస్, శ్రీకాకుళం: బీజేపీ చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా పాలకొండ సచివాలయ ఆవరణలో సీపీఎం నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు దావాల రమణారావు, ఎన్ఏ రాజపురం శాఖ కార్యదర్శి అర్తమూడి లక్ష్మణరావు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ చేసిన పెద్దనోట్ల రద్దు, జీఎస్ టీ అమలు దేశప్రజల ఆర్థిక పరిస్థితిని తీరోగమనంలోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధాంతరంగా లాక్​డౌన్​విధించి వలస కార్మికుల […]

Read More
ప్రభుత్వ భవనాల్లోనే అంగన్​వాడీ సెంటర్లు

ప్రభుత్వ భవనాల్లోనే అంగన్​వాడీ సెంటర్లు

సారథి న్యూస్, శ్రీకాకుళం: ప్రభుత్వ భవనాల్లోనే అంగన్​వాడీ సెంటర్లు ఉండాలని, అందుకు ‘నాడు..నేడు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళాశిశు సంక్షేమశాఖ, ఐసీడీఎస్​ పథక సంచాలకులు డాక్టర్​జి.జయలక్ష్మి సీడీపీవోలను ఆదేశించారు. శనివారం ఉదయం ఆమె సమీక్షించారు. అంగన్​వాడీ సెంటర్లకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి నివేదిక తమకు అందిస్తే వాటిని జేసీకి పంపిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న భవనాల మరమ్మతులకు సంబంధించి అంచనాల వివరాలను తమకు పంపించాలని సూచించారు.

Read More
స్వామి అగ్నివేశ్​ఇక లేరు

స్వామి అగ్నివేశ్​ ఇకలేరు

న్యూఢిల్లీ: ఆర్యసమాజ్‌ నేత, ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌ (80) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో మృత్యువాతపడ్డారు. 1939 సెప్టెంబర్‌ 21న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో స్వామి అగ్నివేశ్‌ జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో తాతగారి స్వగ్రామం చత్తీస్ ఘడ్ కు వెళ్లిపోయారు. అనంతరం కలకత్తాలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజ్‌ నుంచి లా, కామర్స్‌ డిగ్రీ చదివారు. ఆర్యసభ పేర రాజకీయ పార్టీని స్థాపించి హర్యానా నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా […]

Read More
వంగపండు ఇకలేరు

ప్రజాగొంతుక మూగబోయింది

సారథి న్యూస్​, శ్రీకాకుళం: ప్రజాగొంతుక మూగబోయింది. తన పాటలతో ఇరు రాష్ట్రాల ప్రజలను విప్లవోన్ముఖులను చేసిన ఓ తార నింగికెగిసింది. ప్రజాగాయకుడు, విప్లవకవి, ప్రజావాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు (77) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని స్వగ్రామంలో ఆయన తుదిశ్వాస విడిచారు. వంగపండు ప్రసాదరావు 1943లో పార్వతీపురం సమీపంలోని పెదబొండపల్లి గ్రామంలో జన్మించారు. జగన్నాథం, చినతల్లి ఆయన తల్లిదండ్రులు. 1970లో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన గిరిజనుల ఉద్యమంలో ఆయన పాట తొలిసారి ప్రాచుర్యం పొందింది. […]

Read More
‘సుక్క’ చిన్నబోయింది. ఆకలికి చిక్కి పోయింది

‘సుక్క’ చిన్నబోయింది.. ఆకలికి చిక్కి పోయింది

సారథి న్యూస్, శ్రీకాకుళం: ఆమె..ఒకప్పుడు ఎమ్మెల్యే. ప్రజలకు దీనబంధు. కష్ట జీవుల కళ్లల్లో చిరుదీపం. కారు లేదు. జేజేలు కొట్టే కార్యకర్తలు లేరు. వెన్నంటే తిరిగే పోలీసులు లేరు. కేవలం కూలి పనికి వెళ్లడానికి కాలినడకే దిక్కు. ఆమె ఎవరో కాదు ఏపీలోని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే సుక్క పగడాలమ్మ. ప్రస్తుతం ఈ సుక్క చిన్నబోయింది. ఆకలికి చిక్కిపోయింది. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం ముక్తాపురం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సుక్క పగడాలమ్మ ప్రస్తుతం నిరాడంబర […]

Read More

ఆ స్ఫూర్తితోనే విలేకరి అయ్యా

గిరిజనుల స్థితిగతులపై రాసిన కథనాలు సీఎంనే కదిలించాయ్​ జర్నటిస్టులకు వృత్తిపట్ల శ్రద్ధ, పరిస్థితులపై క్షుణ్ణత ఉండాలి మాతృభాష మన మన అస్తిత్వం.. మనమే బతికించుకోవాలి సీనియర్​ పాత్రికేయులు పట్నాయకుని వెంకటేశ్వరరావు సారథి ‘జర్నలిస్టు’తో ముఖాముఖి ‘అది 2001.. పదిరోజుల పాటు జోరువానలు.. భువనేశ్వర్‌లో భీకర పరిస్థితి, తాటిచెట్టు ఎత్తంత ప్రవహించే వరద.. ఒక్కసారి మా ప్రాణాలు పోయినంత పనైంది. అయినా కూడా సైన్యానికి చెందిన బోట్లలో వెళ్లి కథనాలు రూపొందించాం.’ అని సీనియర్​ జర్నలిస్ట్, కవి, రచయిత, […]

Read More

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి

సారథి న్యూస్​, శ్రీకాకుళం: జిల్లాలో మోడల్ ప్రాజెక్టును పక్కాగా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్​ వ్యవసాయశాఖ కమిషనర్​ హనుమంతు అరుణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం శ్రీకాకుళం కలెక్టరేట్​లో ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ పోర్టేషన్ ప్రాజెక్టు పథకం అమలుపై వ్యవసాయ, అనుబంధ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ఆదర్శ రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. రైతులు అధికాదాయం పొందాలని, ముఖ్యంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నారు. జిల్లాలోని 20 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం […]

Read More

అచ్చెన్నాయుడు అరెస్ట్

సారథి న్యూస్​, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్​ మాజీమంత్రి, శాసనసభ ప్రతిపక్ష ఉపనేత, టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో శుక్రవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వేకువజామునే గ్రామానికి విజయవాడ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చారు. ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక బస్సులో విజయవాడకు తరలించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయనపై ఈఎస్​ఐ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు ఉన్నాయి. అచ్చెన్నాయుడి అరెస్ట్​ నేపథ్యంలో […]

Read More