సారథి న్యూస్, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిషన్ భగీరథ నీటిని మాత్రమే ప్రజలు వినియోగించుకునేలా చైతన్య కార్యక్రమాలు మరిన్ని రూపొందించాలని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి స్మితా సబర్వాల్ సూచించారు. బుధవారం మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో అన్ని జిల్లాల సీఈలు, ఎస్ఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్తగా నిర్మిస్తున్న రైతువేదికలు, వైకుంఠధామాలకు భగీరథ నీటిని అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆస్పత్రులు, ధార్మిక సంస్థలకు వాటర్ కలెక్షన్లు […]
సారథి న్యూస్, పెద్దపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతువేదిక నిర్మాణాలను ప్రణాళికాబద్దంగా, సకాలంలో పూర్తిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న రైతు వేదికల నిర్మాణంపై సోమవారం పంచాయతీరాజ్శాఖ ఈఎన్సీతో కలిసి ఎన్టీపీసీలోని మిలీనియంహాల్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులను సంఘటితం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. నియంత్రిత వ్యవసాయసాగు ద్వారా రాష్ట్రంలోని రైతులంతా పెట్టుబడికి తగిన దిగుబడి సాధిస్తారని […]
సారథి న్యూస్, మహబూబ్నగర్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతి గ్రామంలో రైతు వేదికలు నిర్వహించాలని నిర్ణయించిందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు చెప్పారు. క్షేత్రస్థాయి అధికారులంతా సమష్టి కృషితో వ్యవహరించి రెండు నెలల్లో ఈ రైతు వేదికల నిర్మాణాన్ని కంప్లీట్చేయాలని ఆదేశించారు. సోమవారం మహబూబ్ నగర్ జడ్పీ మీటింగ్హాల్లో నిర్వహించిన అధికారుల ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లాలో 88 రైతు వేదికలు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.13.5 కోట్లు […]