Breaking News

యాదాద్రి

యాదాద్రి సన్నిధిలో..

యాదాద్రి సన్నిధిలో..

సామాజికసారథి, బిజినేపల్లి: తెలంగాణ డెంటల్​డాక్టర్స్ అసోసియేషన్​రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి తనయుడు, యువనేత డాక్టర్ ​కూచకుళ్ల రాజేశ్​రెడ్డి మంగళవారం యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు. సకాలంలో వర్షాలు కురిసి.. పాడిపంటలు కలగాలని.. కరోనా పీడ పూర్తిగా తొలగాలని.. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు. రాజేశ్​రెడ్డి వెంట పలువురు కుటుంబసభ్యులు, సన్నిహితులు ఉన్నారు.

Read More
యాదాద్రిలో వైభవంగా లక్ష పుష్పార్చన

యాదాద్రిలో వైభవంగా లక్ష పుష్పార్చన

సామాజికసారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి లక్ష్మీనృసింహుడి సన్ని ధిలో మంగళవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్షపుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. బాలాలయ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో దివ్యమనోహరంగా అలంకరించి ఆచార్యులు ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. అర్చకబృందం, వేదపండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాలపూలతో లక్షపుష్పార్చన పూజలు సంప్రదాయరీతిలో వైభవంగా నిర్వహించారు. పాంచ రాత్రాగమ శాస్త్ర ప్రకారం సుమారు గంటకు పైగా లక్షపుష్పార్చన పూజ పర్వాలు కొనసాగాయి. విశేష వేడుకులను […]

Read More
పట్టా బుక్కు ఇవ్వడం లేదని..

పట్టా బుక్కు ఇవ్వడం లేదని..

భువనగిరి కలెక్టరేట్​ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం వారించిన సిబ్బంది సామాజికసారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం.. బుడిగే మహేశ్‌ తండ్రి ఉప్పలయ్య ఆలేరు మండలం కొలనుపాకలో 20ఏళ్ల క్రితం నాలుగు ఎకరాల భూమిని రూ.ఆరువేలకు కొన్నాడు. ఇప్పటి వరకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వకపోవడంతో లోన్లు, ఇతర సౌకర్యాలు రావడం లేదు. దీంతో మహేశ్‌ మనస్తాపం చెందాడు. […]

Read More
యాదాద్రికి ఎమ్మెల్యే మర్రి బంగారు కానుక

యాదాద్రికి ఎమ్మెల్యే మర్రి బంగారు కానుక

సామాజిక సారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణం తాపడం కోసం నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు. సీఎం కేసీఆర్​ సమక్షంలోనే ఆయన గతంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ హామీ మేరకు బంగారాన్ని ఆలయానికి అప్పగించారు. శుక్రవారం కుటుంబసమేతంగా లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం పలికారు. అంతకుముందు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం […]

Read More
యాదగిరీశుడికి ఎమ్మెల్యే మర్రి ‘బంగారు’ కానుక

యాదగిరీశుడికి ఎమ్మెల్యే మర్రి ‘బంగారు’ కానుక

సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణం తాపడానికి నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి రెండు కేజీల బంగారాన్ని శుక్రవారం ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. తెలంగాణ కళావైభవం చాటేలా, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గతంలో ఆయన సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ముందుకొచ్చి.. తాజాగా రెండు కేజీల బంగారాన్ని అందజేశారు. నారసింహుడి ఆలయాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి కుటుంబసమేతంగా […]

Read More
అదిగదిగో అర్బన్​పార్క్​

అదిగదిగో అర్బన్​పార్క్​

సారథి న్యూస్, యాదాద్రి: యాదాద్రి ఆంజనేయ, నరసింహ అరణ్యం అర్బన్ ఫారెస్ట్ పార్కులను దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్​రెడ్డి, రాజ్యసభ్య సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. అరణ్యంలో కాలినడకన తిరుగుతూ సందర్శకుల కోసం ఏర్పాటుచేసిన సౌకర్యాలను పరిశీలించారు. అటవీశాఖ ప్రాంతాన్ని వ్యూ పాయింట్ నుంచి తిలకించారు. హరితహారం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు అడవులను కాపాడుకునేందుకు అత్యంత కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని వెల్లడించారు. సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆలోచనలకు అనుకూలంగా హైదరాబాద్ నలువైపులా ఇతర పట్టణాలకు […]

Read More
లారెక్కిన ప్రయాణికుడికి కరోనా

లారెక్కిన ప్రయాణికుడికి కరోనా

సారథి న్యూస్, రంగారెడ్డి: కరోనా లక్షణాలతో ఉన్న ఓ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరో 58 మంది హమాలీ కార్మికులను హోమ్ క్వారంటైన్​ కు పంపించారు. రాజస్థాన్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు గన్నీ బ్యాగ్స్ లోడ్ తో వచ్చిన లారీలో ఎక్కిన ఓ ప్రయణికుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడు ప్రయాణించిన లారీ విషయమై పోలీసులు ఆరా తీయగా వలిగొండ లో ఉన్నట్లు గుర్తించి డ్రైవర్, క్లీనర్లను రంగారెడ్డి జిల్లా రావిరాల […]

Read More