Breaking News

ఎస్పీ ఫక్కీరప్ప

సైబర్​నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి

సైబర్​ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి

సారథి న్యూస్, కర్నూలు: అపరిచిత వ్యక్తుల ఫోన్​కాల్స్, సైబర్​ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ కె.ఫక్కీరప్ప సూచించారు. డేటింగ్ వెబ్ సైట్స్ లో రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన మొబైల్ నంబర్స్​ను వాట్సప్​ద్వారా పరిచయం చేసుకుంటారని, మిమ్మల్ని మాయమాటలతో గారడీ చేసి ఫోర్న్​సైట్ల నుంచి తీసుకున్న వీడియోలతో బ్లాక్​మెయిల్​చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. తరువాత డబ్బుల కోసం బెదిరించడం మొదలుపెడతారని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు […]

Read More
శాంతియుతంగా గణేశ్​నిమజ్జనోత్సవం

శాంతియుతంగా గణేశ్​ నిమజ్జనోత్సవం

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలో ఆదివారం జరిగిన గణేశ్​ నిమజ్జన వేడుకల్లో కర్నూలు ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. నిమజ్జనం ప్రశాంతంగా, శాంతియుత వాతవరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు. కోవిడ్19 నిబంధనల మేరకు నిమజ్జనోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ బాలాజీ, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్ వీ మోహన్ […]

Read More
‘పవర్ గ్రిడ్’ జీఎంకు ఘన సన్మానం

‘పవర్ గ్రిడ్’ జీఎంకు ఘన సన్మానం

సారథి న్యూస్, కర్నూలు: కరోనా లాక్​డౌన్​సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కర్నూలు నగర పోలీసులకు ఆహారం ప్యాకెట్లను పంపిణీ చేసిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కర్నూలు డిప్యూటీ జనరల్ మేనేజర్​ప్రకాశ్​ను గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు. కార్యక్రమంలో హోంగార్డు కమాండెంట్ రామ్మోహన్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాక్రిష్ణ, ఎఆర్ డీఎస్పీ ఇలియాజ్ బాషా, ఆర్ఐ లు సురేంద్రరెడ్డి, వెంకటేశ్వర్ రావు, వెంకటరమణ పాల్గొన్నారు.

Read More
ఎస్పీని కలిసిన డీఎస్పీలు

ఎస్పీని కలిసిన డీఎస్పీలు

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్పను పలువురు పోలీసు ఆఫీసర్లు గురువారం మర్యాదపూర్వకంగా కలిపి బొకేలు అందజేశారు. రామాంజి నాయక్ ఎస్సీఎస్టీ సెల్-1 డీఎస్పీగా, వై.రవీంద్రారెడ్డి హోంగార్డు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలిశారు.

Read More
లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్​గా ఉండండి

లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్​గా ఉండండి

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరానికి సమీపంలోని గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టును జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప సోమవారం ఆకస్మికంగా సందర్శించి వరద ఉధృతిని పరిశీలించారు. ముందస్తు జాగ్రత్త చర్యలపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. వాగులు, వంకలను దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారన్నారు. ఆరువేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరిందన్నారు. హంద్రీనీవా నదిలో […]

Read More
ఎస్పీని కలిసిన ఏఎస్సైలు

ఎస్పీని కలిసిన ఏఎస్సైలు

సారథి న్యూస్, కర్నూలు: అనంతపురం జిల్లాకు చెందిన 8 మంది ఏఎస్సైలు ఎస్సైలుగా పదోన్నతి పొందిన సందర్భంగా వారిని విధుల కోసం కర్నూలు జిల్లాకు కేటాయించారు. గురువారం వారు జిల్లా ఎస్పీ ఆఫీసులో ఎస్పీ డాక్టర్ కాగినెల్లి ఫక్కీరప్పను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. మరిన్ని పదోన్నతులు పొందాలని ఎస్పీ ఆకాంక్షించారు. కరోనా సమయంలో ప్రజలకు మంచి సేవలు అందించి పోలీసుశాఖకు పేరు తీసుకురావాలని కోరారు.

Read More

సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలి

సారథి న్యూస్, కర్నూలు: కరోనా వ్యాప్తి సమయంలో సైబర్​ నేరాలు పెరిగిపోతున్నాయని, వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి సూచించారు.మంగళవారం కర్నూలు నగరంలోని రీజినల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను ఆయన పరిశీలించారు. సైబర్​నేరగాళ్లు మాయమాటలతో మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోం(ఇంటి నుంచి ఉద్యోగాలు) ఉద్యోగాలు చేసేవారు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఫేక్ ఐడీలు, ఫేక్ వెబ్ సైట్లతో ఆన్ లైన్ లో ఉద్యోగాలు చేసే […]

Read More