బలగాలపై దాడి కుట్రకు యత్నం స్థానికుల సాయంతో ఏరివేత శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని పూంచ్లో భద్రతా బలగాలు పాక్ ఉగ్రవాది అబూజరార్ను మంగళవారం హతమార్చాయి. జరార్ భద్రతా బలగాలపై దాడులకు వ్యూహరచన చేస్తున్న తరుణంలో కశ్మీర్ పోలీసుల సహకారంతో సైన్యం నిర్వహించిన ‘క్లినికల్ ఆపరేషన్’లో హతమయ్యాడు. రాజౌరీ పూంచ్ ప్రాంతంలో తీవ్రవాదాన్ని పునరుద్ధరించే పనిలో ఉన్న జరార్ను హతమార్చడం భద్రతా బలగాలకు భారీ విజయమని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు అన్నారు. పూంచ్, రాజౌరీ బెల్టులోని నియంత్రణ రేఖ […]
సామాజికసారథి, సిద్దిపేట: గతనెల 17న సెలవుపై వచ్చి కనిపించకుండా పోయిన ఆర్మీ జవాన్ బూకూరి సాయికిరణ్ రెడ్డి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతరెడ్డిపల్లికి చెందిన సాయికిరణ్ రెడ్డి 15 నెలల క్రితం ఆర్మీ జవాన్ గా ఎంపికై పంజాబ్ లోని ఫరిద్ కోట్ రెజిమెంట్లో విధులు నిర్వహిస్తున్నాడు. గతనెల 17న అక్కడి నుంచి సెలవుపై ఇంటికొచ్చాడు. తిరిగి […]
న్యూఢిల్లీ: ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సైనికుల్లో చాలా ధైర్యం నింపిందని ఐటీబీపీ చీఫ్ ఎస్ ఎస్.దేశ్వాల్ అన్నారు. ‘ప్రధాని పర్యటన సైనికుల్లో చాలా ధైర్యాన్ని నింపింది. ఆయన ప్రసంగం చాలా బలాన్ని ఇచ్చింది. దేశంలోని పొలిటికల్ లీడర్ షిప్, ఆర్మీ జవాన్లు దేశం కోసం పనిచేస్తున్నారు. వాళ్లంతా సరిహద్దు భద్రతకు అంకితమయ్యారు. భారత సైన్యం, వైమానిక దళం, ఐటీబీపీలోని సైన్యానికి మనోధైర్యం చాలా ఎక్కువ’ అని ఢిల్లీలో అతిపెద్ద కొవిడ్ […]
విశ్వసనీయ వర్గాల సమాచారం న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం పట్టుబడ్డ ఇద్దరు పాకిస్తానీ స్పైలలో ఒకరు ఇండియన్ రైల్వేస్, ఆర్మీ, ఎక్విప్మెంట్ గురించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఆర్మీని తరలించే రైళ్ల గురించి అన్ని వివరాలు తెలిసిన వ్యక్తి ద్వారా వివరాలు రాబట్టాలని ప్రయత్నించాడని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ వీసా సెక్షన్లో పనిచేస్తున్న అబిద్ హుస్సేస్, తాహిర్ ఖాన్లను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. వాళ్లిద్దరినీ పాకిస్తాన్ స్పైలుగా గుర్తించిన […]