బలగాలపై దాడి కుట్రకు యత్నం స్థానికుల సాయంతో ఏరివేత శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని పూంచ్లో భద్రతా బలగాలు పాక్ ఉగ్రవాది అబూజరార్ను మంగళవారం హతమార్చాయి. జరార్ భద్రతా బలగాలపై దాడులకు వ్యూహరచన చేస్తున్న తరుణంలో కశ్మీర్ పోలీసుల సహకారంతో సైన్యం నిర్వహించిన ‘క్లినికల్ ఆపరేషన్’లో హతమయ్యాడు. రాజౌరీ పూంచ్ ప్రాంతంలో తీవ్రవాదాన్ని పునరుద్ధరించే పనిలో ఉన్న జరార్ను హతమార్చడం భద్రతా బలగాలకు భారీ విజయమని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు అన్నారు. పూంచ్, రాజౌరీ బెల్టులోని నియంత్రణ రేఖ […]
తండ్రి కూడా లెఫ్టినెంట్గా పనిచేసిన అనుభవం త్రివిధ దళాల అధికారిగా భారత్ సైన్య ఆధునీకరణకు కృషి ఆధునిక యుద్ధ తంత్రాల్లో ఆరితేరిన దిట్ట న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సీడీఎస్ బిపిన్ రావత్ కుటుంబం అంతా దేశం కోసం ఆర్మీలో పనిచేశారు. ఉత్తరాఖండ్కు చెందిన రావత్ దేశం సైనికంగా బలపడేందుకు అహర్నిశలు పనిచేసేవారు. ఆధునిక యుద్ధవ్యూహాల్లో ఆయన దిట్ట. భారత ఆర్మీని అధునాతన యుద్ధరీతులకు తర్ఫీదు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో అత్యంత శక్తిమంతమైన సైనికాధికారి ఆయనే. […]
లఢక్ : వాస్తవాధీన రేఖ (ఎల్ఎసీ) వెంబడి ఉద్రిక్త వాతావరణం నెలకొందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె అన్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన లఢక్ లో పర్యటిస్తున్నారు. ఎల్ఎసీ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద చైనా బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో నరవణె పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను లేహ్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించాను. కొంతమంది అధికారులతో మాట్లాడాను. ఎల్ఎసీ వద్ద ఉద్రిక్త వాతావరణం […]
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలోని బుందోజ్ ఏరియాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను సెక్యూరిటీ సిబ్బంది మట్టుబెట్టారు. ఉగ్రవాదులు జరిపిన ఎదురుకాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ఒకరు ప్రాణాలు విడిచినట్లు అధికారులు చెప్పారు. బుందూజ్ ఏరియాలో టెర్రరిస్టులు దాక్కురనే పక్కా సమాచారంతో మన సైనికులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఆ సమయంలో ఒక ఇంట్లో నక్కి ఉన్న టెర్రరిస్టులు కాల్పులకు దిగడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఒక జవాన్కు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించగా అతడు […]
న్యూఢిల్లీ: ఇండియా – చైనా సరిహద్దుల్లోని గాల్వాన్లో చైనా సైనికులు పాల్పడ్డ దాడికి సంబంధించి ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ విషయమై శనివారం ఉదయం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రాహుల్ ట్వీట్లు చేశారు. ‘ప్రధాని ఇండియన్ టెరిటరినీ చైనా దురాక్రమణకు అప్పగించారు. 1. మన సైనికులను ఎందుకు చంపారు? 2. ఎక్కడ చంపారు?’ అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. మన టెరిటరీలోకి ఎవరూ ఎంటర్ కాలేదు, ఏమీ […]
సారథి న్యూస్, రామడుగు: చైనా కవ్వింపు చర్యలకు బలైపోయిన 20 మంది అమర జవానులకు రామడుగు పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ జిల్లా రామడుగు స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సరిహద్దులో శత్రుమూకలతో పోరాడి ప్రాణాలు అర్పించిన జవానుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. వారు కలలుగన్న లక్ష్యసాధనకు మనమంత పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్సై అనూష, పోలీస్ సిబ్బంది, యువకులు […]
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ జిల్లా పూంచ్ సెక్టార్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్తాన్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక ఇండియన్ ఆర్మీ జవాన్ అమరుడయ్యాడు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయని అధికారులు చెప్పారు. షాపూర్ సెక్టార్కు సమీపంలో జరిపిన కాల్పుల్లో అస్సాం రెజిమెంట్ 10 బెటాలియన్కు చెందిన సిపాయి లుంగాబుయ్ అనే 29 ఏళ్ల సైనికుడు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. గాయపడిన ఇద్దరు సైనికులను ట్రీట్మెంట్ కోసం హెలికాప్టర్ ద్వారా కమాండ్ హాస్పిటల్కు పంపినట్లు […]
విశ్వసనీయ వర్గాల సమాచారం న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం పట్టుబడ్డ ఇద్దరు పాకిస్తానీ స్పైలలో ఒకరు ఇండియన్ రైల్వేస్, ఆర్మీ, ఎక్విప్మెంట్ గురించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఆర్మీని తరలించే రైళ్ల గురించి అన్ని వివరాలు తెలిసిన వ్యక్తి ద్వారా వివరాలు రాబట్టాలని ప్రయత్నించాడని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ వీసా సెక్షన్లో పనిచేస్తున్న అబిద్ హుస్సేస్, తాహిర్ ఖాన్లను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. వాళ్లిద్దరినీ పాకిస్తాన్ స్పైలుగా గుర్తించిన […]