సారథిన్యూస్, గోదావరిఖని: సింగరేణి పరిధిలోని అన్ని కార్యాలయాల్లో, స్థలాల్లో ఈ నెల 23 నుంచి వనమహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెత్తం 35 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. బుధవారం కేంద్ర బొగ్గుశాఖ ప్రత్యేకకార్యదర్శి అనిల్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ పాల్గొని మాట్లాడారు. బొగ్గు పరిశ్రమలన్నీ ఈ ఏడాది ‘వనమహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కేంద్ర […]
సారథిన్యూస్, గోదావరిఖని: సింగరేణి తన వ్యాపార విస్తరణలో భాగంగా నూతన ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నదని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. సోమవారం ఆయన సింగరేణి ఉన్నతాధికారలతో సమావేశమయ్యారు. సింగరేణి సంస్థ రిజర్వాయర్ల నీటిపై తేలియాడే సోలార్ ప్లాంటులను నిర్మించేందుకు సమాయత్తమవుతుందని చెప్పారు. దాదాపు 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను నిర్మించనున్నామని చెప్పారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్ (ఇ&ఎం) ఎస్ శంకర్, రాష్ట్ర రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ శాఖ వైస్ ప్రెసిడెంట్ జానయ్య, ప్రాజెక్టు డైరెక్టర్ […]
సారథిన్యూస్, రామగుండం: సింగరేణి యాజమాన్యం ఇష్టానుసారం కార్మికులను బదిలీ చేస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. అక్రమ బదిలీలను వెంటనే ఆపకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఆర్జీవన్ డివిజన్లోని జీకే ఓకటో గని కార్మికులను యాజమాన్యం ఎందుకు బదిలీ చేస్తున్నదని ప్రశ్నించారు. శనివారం ఆయన కార్మికులను కలిశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఒకటో గనిలో కార్మికులు అవసరం ఉన్నప్పటికీ యజమాన్యం పద్ధతి లేకుండా కార్మికులను అడ్డాయలప్రాజెక్టుకు ఆర్జీ3కి బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. […]
సారథిన్యూస్, గోదావరిఖని: బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూలై 2,3,4 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెకు అన్ని సంఘాలు సన్నద్ధం కావాలని సింగరేణి జేఏసీ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ సమ్మె ద్వారా ప్రధాని మోదీకి కనువిప్పు కలిగించాలని కోరారు. సోమవారం గోదావరిఖనిలో జేఏసీ నాయకులు సమ్మెపోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వేల్పుల కుమార్ స్వామి, నరేశ్, ఎంఏ గౌస్, శ్రీనివాస్, తోకల రమేశ్, ఉపేందర్ ఎండీ గని తదితరులు పాల్గొన్నారు.
50 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె జూలై 2 నుంచి 4 తేదీ వరకు నిరవధిక నిరసన సారథి న్యూస్, గోదావరిఖని: బొగ్గు గనుల్లో మళ్లీ సమ్మె సైరన్ మోగనుంది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గుర్తింపు సంఘాలైన సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్ టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ సంఘాలు జులై 2, 3, 4 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చాయి. యాజమాన్యం ఈనెల 18న మొదటి విడత 41 బొగ్గు బ్లాక్లను […]
సారథిన్యూస్, కొత్తగూడెం: సింగరేణిలో ఎక్స్ ప్లోరేషన్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడెంలో కాంట్రాక్ట్ కార్మికులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలోనే ప్రత్యామ్నాయ పనులలో వీరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పీ ప్రమోద్, ఎన్ సూర్య, భద్రం, నిజాముద్దీన్, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సంపత్, సమ్మయ్య, […]
సారథిన్యూస్, గోదావరిఖని: బొగ్గును విక్రయించేందుకు సింగరేణి సంస్థ ప్రత్యేకపోర్టల్ను ప్రారంభించింది. విదేశీ బొగ్గు దిగుమతికి బదులుగా స్వదేశీ బొగ్గు వినియోగం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు అధికారిక వెబ్సైట్లో ఓ ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించినట్టు సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్, ప్రాజెక్ట్స్) భాస్కర్రావు, ఆపరేషన్స్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ పోర్టల్ కు సంబంధించిన వివరాల కోసం www.scclmines.com వెబ్సైట్ను కానీ 040-23142219 నంబర్ లో కానీ సంప్రదించాలని కోరారు. సింగరేణి సంస్థ వినియోగదారుల అభీష్టం మేరకు […]
సారథిన్యూస్, గోదావరిఖని: కార్మికులు పోరాట ఫలితంగానే సింగరేణి యాజమాన్యం జీతాల చెల్లింపు చేస్తోందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ)రాష్ట్ర, అధ్యక్ష ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజురెడ్డి, మంద నరసింహారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ తప్పుడు ప్రచారం సరికాదన్నారు.