వాషింగ్టన్: ఇండియా – చైనా బోర్డర్లో నెలకొన్న పరిస్థితులపై అమెరికా మరోసారి స్పందించింది. చైనా నుంచి వస్తున్న ముప్పును ఎదుర్కొనేందుకు తమ సైన్యాన్ని మనకు మద్దతుగా పంపిస్తానని విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. జర్మనీలో ఉన్న అమెరికా బలగాలను ఇక్కడకు పంపుతున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు. జర్మనీలో బలగాలను ఎందుకు తగ్గిస్తున్నారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. భారత్, దక్షిణాసియాకు చైనా ముప్పుడా మారిందన్నారు. గురువారం బ్రసెల్స్ ఫోరం వర్చువల్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన పాంపియో ఈ […]
సారథి న్యూస్, కర్నూలు: ఇండియా బోర్డర్లోని గాల్వాన్ లోయలో చైనా సైనికుల దుశ్చర్యకు 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారని, ఆ దేశంపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారి వస్తువులను బహిష్కరించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారధి పిలుపునిచ్చారు. చైనా వస్తువులను బహిష్కరించే అవకాశం భారత ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని ప్రతిఒక్కరికీ కల్పించారని పేర్కొన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రతి పౌరుడు మేడిన్ ఇండియా వస్తువులనే కొనాలని కోరారు.
లండన్: ఇండియా – చైనా మధ్య నెలకొన్న గొడవను సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని యూకే ప్రధాని బొరిస్ జాన్సన్ అన్నారు. ‘ఒక దేశం కామన్ వెల్త్ మెంబర్, మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ ఒకవైపు. ప్రజాస్వామ్యం అనే మన భావనను సవాలు చేసే రాష్ట్రం. రెండు దేశాల మధ్య జరుగుతున్న సంఘటనలను యూకే నిశితంగా పరిశీలిస్తోంది’ అని అన్నారు. ఈస్ట్రన్ లద్దాఖ్లో పరిస్థితి సీరియస్గా, ఆందోళనకరంగా ఉందన్నారు. రెండు దేశాలు మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తున్నామన్నారు. […]
ముంబై: గాల్వాన్ ఘటన జరిగిన తర్వాత ఐదురోజుల్లో చైనా మన దేశంలో 40,300 సైబర్ ఎటాక్స్ చేసేందుకు యత్నించిందని పోలీసులు చెప్పారు. ఎక్కువ శాతం ఎటాక్స్ అన్నీ బ్యాంకింగ్, ఐటీ సెక్టార్పైనే జరిగాయని మహారాష్ట్ర సైబర్ వింగ్ స్పెషల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశశ్వి యాదవ్ అన్నారు. మహారాష్ట్ర సైబర్ వింగ్, స్టేట్ పోలీస్ వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కువ శాతం సైబర్ ఎటాక్స్ అన్నీ చైనాలోని చెంగ్డూ ఏరియా నుంచి జరిగాయని తెలుస్తోంది. […]
న్యూఢిల్లీ: గాల్వాన్ గొడవ జరిగినప్పుడు మన వాళ్లు 100 మంది ఉంటే చైనావాళ్లు మాత్రం 300 నుంచి 350 మంది ఉన్నారట. అయినా కూడా మనవాళ్లు ఎక్కడా ధైర్యాన్ని కోల్పోలేదు. చైనా వాళ్లను ధీటుగా ఎదుర్కొన్నారు. అసలు ఏం జరిగిందో ఒక వ్యక్తి ఏఎన్ఐ వార్తా సంస్థకు ఈ విధంగా వివరించారు. తూర్పు లద్దాఖ్లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత భూభాగంలో పెట్రోలింగ్ పాయింట్ – 14 వద్ద చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్ఏ) టెంట్ […]
న్యూఢిల్లీ: ఇండియా – చైనా సరిహద్దుల్లోని గాల్వాన్లో చైనా సైనికులు పాల్పడ్డ దాడికి సంబంధించి ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ విషయమై శనివారం ఉదయం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రాహుల్ ట్వీట్లు చేశారు. ‘ప్రధాని ఇండియన్ టెరిటరినీ చైనా దురాక్రమణకు అప్పగించారు. 1. మన సైనికులను ఎందుకు చంపారు? 2. ఎక్కడ చంపారు?’ అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. మన టెరిటరీలోకి ఎవరూ ఎంటర్ కాలేదు, ఏమీ […]
న్యూఢిల్లీ: ఇండియా – చైనా బార్డర్లో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఓ జవాన్ తండ్రి రాహుల్ గాంధీకి సూచనలు చేస్తున్న వీడియోను ట్వీట్ చేసి రాహుల్కు సమాధానం చెప్పారు. ‘ధైర్యవంతుడైన ఆర్మీ జవాన్ తండ్రి రాహుల్కు క్లియర్ మేసేజ్ ఇస్తున్నారు. దేశమంతా ఒకటైన వేళ రాహుల్ గాంధీ కూడా చిల్లర రాజకీయాలు పక్కనపెట్టి దేశానికి రక్షణగా నిలవాలి’అని […]
సారథి న్యూస్, హైదరాబాద్: : భారత్ ఎప్పుడూ శాంతి మంత్రాన్ని పాటిస్తుందని భారత వైమానిక దళాధిపతి ఆర్కేఎస్ భదౌరియా స్పష్టం చేశారు. భారత సైనికులపై కవ్వింపులకు దిగితే మాత్రం ఉపేక్షించబోమని పేర్కొన్నారు. చైనాకు దీటైన సమాధానం చెప్పే సత్తా భారత్ వద్ద ఉన్నదన్నారు. శనివారం హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్తగా విధుల్లో చేరబోతున్న క్యాడేట్లను ఉద్దేశించి భదౌరియా ప్రసంగించారు. […]