Breaking News

క్రైమ్

లాయర్​ మిస్సింగ్​

లాయర్​ మిస్సింగ్​

సారథి న్యూస్​, నిజామాబాద్​: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ నగర్ కు చెందిన న్యాయవాది కొర్రి గంగాధర్ యాదవ్ ఈనెల 7 నుంచి కనిపించడం లేదు. మరుసటి రోజు బిర్కుర్ లోని తన తల్లి వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని 3 టౌన్​ ఎస్సై సంతోష్​ కుమార్​ శనివారం తెలిపారు.

Read More

ఉరివేసుకుని జంట ఆత్మహత్య

సారథి న్యూస్​, నిజామాబాద్​: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్ర శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఇద్దరు సూసైడ్​ చేసుకున్నారు. శనివారం ఉదయం గ్రామస్తులు గుర్తించారు. మృతులను మాచారెడ్డి గ్రామానికి చెందిన బాలనర్సు(38), ప్రేమలత(35)గా గుర్తించారు. మృతులు ఇద్దరికి కూడా పెళ్లిళ్లు అయి పిల్లలు కూడా ఉన్నారు. వేర్వేరు కుటుంబాలకు చెందిన వీరు ఆత్మహత్య చేసుకోవడానికి వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Read More
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

ఎండుమిర్చిన తీసుకెళ్తుండగా ఘటన.. మృతులు రైతులు సారథి న్యూస్, రంగారెడ్డి: అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు రైతులు మృతిచెందారు. ఈ సంఘటన మాడ్గుల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం.. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం, శాంతిగూడెం గ్రామానికి చెందిన రామచంద్రయ్య(45), సుబయ్య(36) కలిసి ఎండు మిర్చిని ట్రాక్టర్​ లో ఇర్విన్ గ్రామానికి తీసుకొచ్చారు. తిరిగి వెళ్తుండగా అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో రామచంద్రయ్య, సుబ్బయ్య […]

Read More
డీసీఎం, బొలెరో ఢీ.. డ్రైవర్ మృతి

డీసీఎం, బొలెరో ఢీ.. డ్రైవర్ మృతి

విజయవాడ హైవేపై ఘటన సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: డీసీఎం, బొలెరో వాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపురం సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. విజయవాడ హైవే(ఎన్​హెచ్​ 65) పై మల్కాపురం వద్ద ఆగిన డీసీఎంను హైదరాబాద్ వైపు మామిడికాయల లోడ్​ తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరో వాహనం డ్రైవర్ అజయ్​ కుమార్(20) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే […]

Read More
ఉల్లం‘ఘనుల’పై ఉక్కుపాదం

ఉల్లం‘ఘనుల’పై ఉక్కుపాదం

–వాహనాలు సీజ్.. చలానా విధింపు సారథి న్యూస్, అనంతపురం: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అనంతపురం జిల్లా పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. లాక్ డౌన్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో విపత్తు నిర్వహణ, తదితర చట్టాల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వివిధ కేసులు నమోదుచేశారు. రోడ్డుభద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1,07,982 నమోదుచేసి..రూ.4,63,05,620 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. అలాగే 2,604 వాహనాలను సీజ్ […]

Read More
లిఫ్ట్ నుంచి జారిపడి..

లిఫ్ట్ నుంచి జారిపడి..

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రమాదవశాత్తు లిఫ్ట్ నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని   హస్తినాపురం డివిజన్​ సాగర్ రోడ్డు ఓంకార్ నగర్ కాలనీలో నివాసముంటున్న ఇక్రిశాట్​ మాజీ ఉద్యోగి జె.కృష్ణ గౌడ్ (62) శుక్రవారం సాయంత్రం ఇంటికి సమీపంలో ఉన్న అపార్ట్ మెంట్ పై వాకింగ్ చేసి లిఫ్ట్ నుంచి కిందికి దిగుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు లిఫ్ట్ తలుపులు తెరుచుకుని ఐదంతస్తుల […]

Read More
కరెంట్ షాక్​తో మహిళ మృతి

కరెంట్ షాక్​తో మహిళ మృతి

సారథి న్యూస్, మెదక్: ప్రమావశాత్తు కరెంట్ షాక్ తో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన శనివారం మెదక్​ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానిక గోల్కొండ వీధికి చెందిన బిస్మిల్లా బీ (55) తన ఇంటి ఆవరణలో చెట్టు వద్ద పేరుకున్న చెత్తాచెదారం తొలగిస్తుంగా పైన ఉన్న విద్యుత్​ వైర్లకు చేతి తగిలింది. దీంతో కరెంట్​ షాక్ తో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్షం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బిస్మిల్లా బీ […]

Read More

బావిలో పడి మహిళ మృతి

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన వట్టెం ప్రేమలత అనే మహిళ(35) ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. బావిలో పడిన సమయంలో ఆమెను స్థానికులు కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. కాగా, మృతురాలి భర్త ఆరేళ్ల క్రితమే చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.

Read More