Breaking News

క్రైమ్

దైవదర్శనం విషాదాంతం

సారథిన్యూస్​, ములుగు: సమ్మక్క, సారలమ్మ దర్శనం కోసం వచ్చిన ఓ వ్యక్తి జంపన్నవాగులో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్​ సమీపంలోని ఘట్​కేసర్​ పరిధిలోని శివారెడ్డి గూడకు చెందని సుదర్శన్​రెడ్డి (50) స్నేహితులతో కలిసి అమ్మవార్లను దర్శించుకొనేందుకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి వచ్చారు. దైవదర్శనానికి ముందు జంపన్నవాగులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయిన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read More

సర్పంచ్​పై అట్రాసిటీ కేసు

  • July 12, 2020
  • Comments Off on సర్పంచ్​పై అట్రాసిటీ కేసు

సారథి న్యూస్, హుస్నాబాద్: తోటి ప్రజాప్రతినిధిని కులం పేరుతో దూషించిన ఓ సర్పంచ్​పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కరీంనగర్​ జిల్లా అక్కన్నపేట మండలం గండిపల్లి గ్రామంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీటీసీ బానోతు ప్రమీళ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్​ సృజనకు ఎంపీటీసీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన సర్పంచ్​.. ఎంపీటీసీని కులం పేరుతో దూషించింది. సర్పంచ్​తోపాటు ఆమె భర్త వంగపల్లి సంపత్​కుమార్​, అత్త అచ్చవ్వ, […]

Read More
టాబ్లెట్స్ లారీలో మంటలు

టాబ్లెట్స్ లారీలో మంటలు

సారథి న్యూస్, షాద్​నగర్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఘాన్సిమియాగూడ వద్ద బెంగళూరు హైవేపై ఆదివారం ఉదయం ఓ కంటెయినర్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ లారీని పక్కన పార్క్ చేశాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో శంషాబాద్ పొలీసులు ఫైర్ సిబ్బందిని అలర్ట్​చేసి మంటలను ఆర్పివేయించారు. బెంగళూరు నుంచి మైక్రో ల్యాబ్ కు సంబంధించిన ట్యాబ్లెట్ లోడుతో వస్తున్న కంటెయినర్​శంషాబాద్ ఘాన్సిమియాగూడ వద్దకు రాగానే అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Read More
గేదెలను ఢీకొట్టిన ట్రావెల్స్​బస్సు

గేదెలను ఢీకొట్టిన ట్రావెల్స్​ బస్సు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం కలకత్తా నుంచి హైదరాబాద్ కు ఛత్తీస్ గఢ్ మీదుగా వెళ్తున్న ట్రావెల్స్​ బస్సు వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామం వద్ద పాడి గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు గేదెలు మృతిచెందాయి. డ్రైవర్, క్లీనర్​పరారీలో ఉన్నారు.

Read More

యువకుడిని కాపాడిన పోలీసులు

సారథిన్యూస్​, సిద్దిపేట: ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు రక్షించారు. అతడి మొబైల్​ నంబర్​ ఆధారంగా అతడు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి అతడి ప్రాణాలు కాపాడారు. సిద్దిపేటకు చెందిన కాశితే శ్రీనాథ్​ గురువారం రాత్రి ఇంట్లో గొడవపెట్టుకొని తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బయటకు వెళ్లాడు. దీంతో అతడి తండ్రి ఐలయ్య వన్​టౌన్​ పీఎస్​కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ సైదులు, ఐటీ సిబ్బందితో కలిసి శ్రీనాథ్​ మొబైల్​ నంబర్​ ఆధారంగా అతడు స్థానిక ఎల్లమ్మ ఆలయం […]

Read More

ఏసీబీకి చిక్కిన సీఐ

సారథిన్యూస్​, చేవెళ్ల: భూ వివాదంలో లంచం తీసుకుంటూ ఓ సీఐ ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్​ సీఐ శంకరయ్య ఓ వ్యక్తికి సంబంధించిన భూ వివాదాన్ని పరిష్కరించేందుకు రూ. లక్ష 20వేలు లంచం డిమాండ్​ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం షాబాద్​ పీఎస్​లో శంకరయ్య యాదవ్​, ఏఎస్సై రాజేందర్..​ బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. సీఐ శంకరయ్యపై గతంలోనూ అవినీతి కేసులున్నాయి. రంగారెడ్డి […]

Read More

అద్దె అడిగాడని ఘాతుకం

చెన్నై: అద్దె చెల్లించమని అడిగిన పాపానికి ఇంటి ఓనర్​ను హత్యచేశాడో వ్యక్తి. ఈ ఘటన చెన్నైలోని కుండ్రటూర్​లో చోటుచేసుకున్నది. కుండ్రటూర్​కు చెందిన గుణశేఖర్​(51) ఇంట్లో కొంతకాలంగా ధనరాజ్​ అనేవ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. అయితే నాలుగునెలలుగా ధనరాజ్​ యజమానికి అద్దె​ కట్టడం లేదు. దీంతో బుధవారం రాత్రి రెంట్​ కట్టాలంటూ గుణశేఖర్​.. ధనరాజ్​పై ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. కోపోధ్రిక్తుడైన ధనరాజ్​ కుమారుడు అజిత్​.. ఇంటి ఓనర్​పై కత్తితో విచక్షణారహితంగా దాడిచేయడంతో అతడు […]

Read More

రెచ్చిపోయిన ఉగ్రవాదులు

క‌శ్మీర్‌: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజేపీ నేతను కాల్చిచంపారు. జమ్ముకశ్మీర్​లోని బందిపోర్​లో బీజేపీ నేత వసీమ్​ కుటుంబం నివాసం ఉంటున్నది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో బీజేపీ నేత కుటుంబం ఓ దుకాణం వద్ద కూర్చొని ఉన్నది. ఇదే అదనుగా భావించిన ఉగ్రమూకలు అక్కడికి చొరబడి బీజేపీ నేత వసీమ్​, అతడి తండ్రి బషీర్​, సోదరుడు ఉమర్​ బషీర్​పై కాల్పులు జరిపారు. ఆ దుకాణం పోలీస్​స్టేషన్​కు సమీపంలో ఉన్నది. సమాచామందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని […]

Read More