కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో ఎవరు దగ్గినా, తుమ్మినా అనుమానంగా చూసే పరిస్థితి నెలకొన్నది. సాధారణ దగ్గొచ్చినా కరోనా ఏమోనని అందరూ తెగ ఆందోళన పడుతున్నారు. ఈ క్రమంలో మాములు దగ్గు, జలుబుకు ఆందోళన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. 24 గంటలన్నా ఎక్కువగా దగ్గు వస్తే డాక్టర్ను సంప్రదించడం మేలు. కానీ సాధారణ దగ్గును తగ్గించుకొనేందుకు మాత్రం కొన్ని చిట్కాలు పాటిస్తే మేలంటున్నారు ఆయుర్వేద డాక్టర్లు. అవి ఏమిటో చూద్దాం..అల్లం దివ్య ఔషధంగ్లాసు నీటిలో అర […]
అరటిపండులో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయని పెద్దలు చెప్తుంటారు. అరటిలో ఎన్నో రకాలున్నాయి. చెక్కరకేళి, దేశవాళీ, బొంత, కర్పూర, పచ్చ అరటిపండ్లు, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి.. వీటిలో ఏవీ తిన్నా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అజీర్తి సమస్య పోవాలన్నా, రక్తహీనత తగ్గాలన్నా, మలబద్దకం సమస్య లేకుండా ఉండాలన్నా అరటిపండు తినాలని చెప్పుతూ చెప్తుంటారు పెద్దలు. అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల ప్రతి రోజు మూడు అరటిపండ్లను తింటే గుండె జబ్బులకు బై […]
ఓ వైపు కరోనా.. మరోవైపు సీజనల్ రోగాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రోగనిరోధకశక్తిని పెంచుకోవడం అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో ఇమ్యూనిటీ ఉంటే చాలా రోగాలు మనదరి చేరవు. ఇందుకోసం మనం కొన్ని రకాల పండ్లను తీసుకోవాలి. అవేంటో ఇప్పడు చూద్దాంజ ఆపిల్ జీవక్రియ రేటును పెంచుతుంది. దీంతో శరీరం కూడా చురుగ్గా ఉండదు. కావున యాపిల్ తింటే ఆరోగ్యంగా, చురుగ్గా కూడా ఉంటారు. బొప్పాయి, నిమ్మ జాతిపండ్లు కూడా రోజు తీసుకోవాలి. […]
సారథిన్యూస్, హైదరాబాద్: కరోనా సృష్టించిన సంక్షోభం ఇప్పుడు పసిపిల్లలపైనా పడింది. ఆన్లైన్ క్లాసుల పేరుతో చిన్నపిల్లలు తరుచూ ల్యాప్టాప్, ట్యాబ్, స్మార్ట్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ముందు గంటల తరబడి ఉండాల్సి వస్తున్నది. దీంతో పిల్లల కళ్లపై తీవ్ర భారం పడతుందని.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కంటి సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.ఎనిమిది గంటలపాటు..ఆన్లైన్ క్లాసులు ప్రారంభమైన తర్వాత విద్యార్థులు డిజిటల్ పరికరాలను వినియోగించడం పరిపాటిగా మారింది. మొదట్లో రెండు లేదా మూడు గంటలే […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల వాసులకు తుమ్ము టెన్షన్ పట్టుకుంది. తుమ్ములతో ఎందుకు టెన్షన్ పడుతున్నారనేగా మీ ప్రశ్న. అదేనండి.. ఇది కరోనా కాలం కదా. అందుకేనండి అవంటే అందరూ భయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మార్చి మొదటి వారంనుంచే కరోనా ప్రవేశించింది. ఈ వైరస్ సోకిన వారిలో ప్రధానంగా దగ్గు, తుమ్ములు, మక్కు కారడం, గొంతునొప్పి, జ్వరం ప్రధాన లక్షణాలను వైద్యులు చెబుతున్నారు. మొన్నటి వరకు ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి కరోనా సోకినట్టుగానే భావించారు. వారికి […]
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ వైరస్కు ఇప్పటివరకు కచ్చితమైన మందు లేదు. కేవలం భౌతికదూరం పాటించటం, శానిజైటర్ల వాడకం, మాస్కులు ధరించడం వంటివి పాటించాల్సిందే. ఈ నేపథ్యంలో మొహాలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ రీసెర్చ్(ఎన్ఐపీఈఆర్) సెఫ్టీ డివైజ్లు, మాస్క్లు, శానిటైజర్లు తయారు చేస్తున్నది. ఇప్పుడు తాజా కరోనాతో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్టీ ని తయారు చేసింది. రోగనిరోధక శక్తిని పెంచుకుంటే కరోనాను ఎదుర్కోవచ్చు. ఈ హెర్బల్ టీని స్థానికంగా […]
వర్షాకాలంతో పాటుగా ఆషాఢమాసం వస్తున్నది. ఈ మాసం తనతో కొన్ని ఆచారాలనూ తీసుకువస్తుంది. అవన్నీ ఉత్త చాదస్తాలంటూ కొంతమంది కొట్టివేయవచ్చుగాక, ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కోవచ్చుగాక! కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనకా ఓ కారణం కనిపిస్తుంది. కావాలంటే మీరే చూడండి… పేలాల పిండిఆషాఢంలో వచ్చే గాలి, నీటి మార్పులతో కఫసంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే! ఇక ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది. […]
నిమ్మకాయలను ఆహారంగా తీసుకోవడం వల్లే కాదు.. ఇంట్లో ఉంచుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదెలాగో చూడండి. నిమ్మ కాయలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. వాటిని ఆహారంలో కలుపుకున్నా.. రసం తీసుకుని తాగినా ఆరోగ్యానికి మంచిది. నిమ్మలో విటమిన్-సీ, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే బరువు తగ్గుతారు. వేసవిలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు నిమ్మరసం ఎనర్జీ డ్రింక్లా పనిచేస్తుంది. అయితే, నిమ్మకాయలను […]