అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వచ్చే విద్యాసంవత్సరానికి ప్రణాళికను ప్రభుత్వం ఖరారుచేసింది. సెప్టెంబర్ 5న స్కూళ్లను పున:ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. అలాగే అక్టోబర్ 15న కాలేజీలను పున:ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. స్కూళ్లు ప్రారంభమైన రోజే 43లక్షల మంది విద్యార్థులకు ‘జగనన్న విద్యాకానుక’ అందిస్తామని పేర్కొన్నారు. గురువారం ఆయన అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. స్కూళ్ల రీ ఓపెనింగ్కు ముందే వెబ్ కౌన్సెలింగ్ ద్వారా టీచర్ల బదిలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 15 నుంచి 21వ […]
డిగ్రీ అర్హతతో ఎస్బీఐలో 3,850 జాబ్స్ దరఖాస్తుల స్వీకరణ జూలై 27 నుంచే.. పెద్దసంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేస్తోంది. మొత్తం 3,850 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణ సర్కిల్లోనూ ఖాళీలు ఉన్నాయి. గుజరాత్, తెలంగాణ సర్కిల్కు 550 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణతో పాటు గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.ముఖ్యమైన తేదీలుదరఖాస్తు […]
చంఢీఘర్: పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆ రాష్ట్రంలోని 11,12 వ తరగతి విద్యార్థినులకు బంపర్ఆఫర్ ప్రకటించారు. ఆన్లైన్ క్లాసులు వినేందుకు విద్యార్థినులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయనున్నారు. మొదటి విడత పంపిణీకి 50 వేల స్మార్ట్ ఫోన్లు సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు. స్మార్ట్ ఫోన్ల పంపిణీకి చైనాకు చెందిన ఓ కంపెనీతో పంజాబ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం నిర్ణయం పట్ల ఆ రాష్ట్రంలోని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం […]
ప్రకటించిన సీఎం జగన్ సారథి న్యూస్, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా మూతపడిన పాఠశాలలు సెప్టెంబరు 5వ తేదీన ప్రారంభం అవుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆగష్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడు పనులపై రెండు రోజులకోసారి జిల్లా కలెక్టర్లు సమీక్ష చేయాలని సూచించారు.అదేవిధంగా ఆగస్టు 15న రాష్ట్రంలో పేదలకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ http//tsbie.cgg.gov.in ద్వారా సవరించిన మార్కులు, స్కాన్ చేసిన జవాబు స్క్రిప్టులు డౌన్లోడ్ చేసుకోచ్చని తెలిపింది. మొత్తం 37,387 మంది విద్యార్థులు 72,496 సబ్జెక్టుల్లో రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. అయితే ఇప్పటి వరకు […]
హైదరాబాద్: తెలంగాణ పాలీసెట్ ఆన్లైన్ దరఖాస్తు గడువును పెంచుతూ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్బీటెట్) నిర్ణయం తీసుకుంది. రూ.300 ఆలస్య రుసుముతో జులై 30వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని కార్యదర్శి యూవీఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
సారథి న్యూస్, హైదరాబాద్: ఓపెన్ స్కూల్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇటీవల టెన్త్ ఎగ్జామ్స్ ను రద్దుచేసిన ప్రభుత్వం తాజాగా ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. అందరికీ 35 మార్కులు ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కరోనా దృష్ట్యా ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వరవర్మ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదన […]
సారథిన్యూస్, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా హైదరాబాద్ సహా ఏడు చోట్ల ఈనెల 25న నిర్వహించాల్సిన జాతీయ ఫార్మా విద్య, పరిశోధన సంస్థ (నైపర్) జేఈఈని వాయిదా వేశారు. ఈ పరీక్షను సెప్టెంబర్ 28న నిర్వహించనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ పరిశోధన సంస్థలు ఫార్మసీ విద్యలో పీజీ కోర్సులను అందిస్తున్నాయి.