Breaking News

Month: January 2022

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా

24గంటలో 55వేల పైచిలుకు కేసులు ఈ నెల 30 వరకూ విద్యాసంస్థలకు సెలవులు  అన్ని యూనిర్సిటీ పరిధిలోని పరీక్షలు వాయిదా సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,883 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 2,043 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 7,09,209కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. తాజాగా రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వాటితో కలిపి  రాష్ట్రంలో 4,057మంది […]

Read More
బీజేపీ నేతలతో కేంద్ర ఆర్థిక మంత్రి వీసీ

బీజేపీ నేతలతో కేంద్ర ఆర్థిక మంత్రి వీసీ

  • January 17, 2022
  • Comments Off on బీజేపీ నేతలతో కేంద్ర ఆర్థిక మంత్రి వీసీ

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఇవ్వవలసిన ప్రాముఖ్యతలను బీజేపీ నేతల నుండి ఆర్థిక మంత్రి అడిగి తెలుసుకుంటున్నారు. అయితే తెలంగాణకు గిరిజన యూనిర్సిటీ, ఐఐఎం, ఎన్‌ఐడీ, ఎన్‌ఐఎస్‌ఈఆర్ విద్యా సంస్థలను కేటాయించాలని బీజేపీ నేతలు కోరారు. అలాగే రైల్వే లైన్స్, జాతీయ రహదారుల్లో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 2023 ఎన్నికల నేపథ్యంలో రానున్న బడ్జెట్‌లో కేంద్రం నుండి తెలంగాణకు పెద్ద […]

Read More
వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ కరోనా

వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ కరోనా

సామాజిక సారథి, వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. అనేక మంది సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ బత్తుల శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం శ్రీనివాస్ హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. సూపరింటెండెంట్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

Read More
ఫ్యామిలీకి రూ.10లక్షలు

ఫ్యామిలీకి రూ.10లక్షలు

ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి గ్రామగ్రామానా మొహల్లా క్లినిక్స్‌ నెలకు రూ.3వేల నిరుద్యోగభృతి గోవా ప్రజలకు ఆప్​వరాల జల్లు సీఎం కేజ్రీవాల్ సంచలన పథకాలు పానాజి: ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీల హామీల వర్షం కురుస్తోంది. ఫ్రీ పథకాల జోరు కొనసాగుతోంది. ప్రధానపార్టీల నేతలంతా ఓటర్లను ప్రసన్నంచేసుకునే పనిలో పడ్డారు. తాజాగా గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం […]

Read More
మకుటాయమానం రామానుజుల విగ్రహం

మకుటాయమానం రామానుజుల విగ్రహం

  • January 17, 2022
  • Comments Off on మకుటాయమానం రామానుజుల విగ్రహం

ప్రపంచ పర్యాటక ప్రాంతంగా ముచ్చింతల్​ మంత్రులు ఎర్రబెల్లి , వి.శ్రీనివాస్​గౌడ్​ విగ్రహ ప్రారంభోత్సవ ఏర్పాట్ల పరిశీలన సామాజిక సారథి, హైదరాబాద్: ఆధ్యాత్మిక హబ్ గా మారిన తెలంగాణకు రామానుజుల వారి విగ్రహం మకుటాయమానం కానుందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సంక్రాంతి సందర్భంగా ముచ్చింతలలోని చినజీయర్ స్వామి ట్రస్ట్ ని మంత్రులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులు రామానుజుల వారి విగ్రహావిష్కరణ కోసం ప్రత్యేకంగా వేస్తున్న రోడ్డు పనులను పరిశీలించారు. […]

Read More
కత్తితో ముగ్గురు పై దాడి

కత్తితో ముగ్గురుపై దాడి

  • January 17, 2022
  • Comments Off on కత్తితో ముగ్గురుపై దాడి

కొండాపురంలో దారుణం పండుగ పూట విషాదం ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం.  సామాజిక సారథి, వెంకటాపురం: పండగ పూట విషాదం నెలకొన్నది. కత్తితో దాడిచేయడంతో ఒకరు చనిపోవడంతో పాటు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొండాపురం గ్రామంలో జరిగింది. కుటుంబసభ్యులు, గ్రామస్తుల కథనం..గ్రామానికి చెందిన దుర్గం చంటికి భార్య, కుటుంబసభ్యులకు మధ్య కొంతకాలంగా కుటుంబకలహాలు, గొడవలు ఉన్నాయి. ఈ సందర్భంగా మానవ మృగంగా మారిన చంటి, […]

Read More
విద్యా సంస్థలకు సెలవు రద్దు చేయాలి

విద్యా సంస్థలకు సెలవు రద్దు చేయాలి

ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు సామాజిక సారథి, సిద్దిపేట: విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, విద్యార్థులకు విద్యనందిస్తున్నాయన్నారు. సంక్రాంతి పండుగ సెలవుల పేరుతో పాఠశాలకు ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రకటించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా […]

Read More
సంక్రాతిని కొవిడ్ నిబంధనలతో జరుపుకోవాలి

సంక్రాతిని కొవిడ్ నిబంధనలతో జరుపుకోవాలి

 సామాజిక సారథి, రేగొండ: మండల ప్రజలు ఆనందంగా మకర సంక్రాంతి వేడుకలను కొవిడ్ నిబంధనలతో జరుపుకోవాలని రేగొండ మండల ఎస్సై శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనవసరంగా బయటకు వెళ్ళొద్దని, వెళ్లినా కూడా మాస్కు, భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. కొవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Read More