సామాజిక సారథి, రేగొండ: మండల ప్రజలు ఆనందంగా మకర సంక్రాంతి వేడుకలను కొవిడ్ నిబంధనలతో జరుపుకోవాలని రేగొండ మండల ఎస్సై శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనవసరంగా బయటకు వెళ్ళొద్దని, వెళ్లినా కూడా మాస్కు, భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. కొవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.