Breaking News

Month: September 2021

పేదల విద్యా‘సౌభాగ్యం’

పేదల విద్యా‘సౌభాగ్యం’

ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి ఔదార్యం తాడూరు ప్రభుత్వ జూనియర్​ కాలేజీకి రెండెకరాల భూదానం తన సతీమణి స్మారకార్థం విద్యాభివృద్ధికి శ్రీకారం సంతోషం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు సామాజిక సారథి, నాగర్​కర్నూల్: పేదరికం, తల్లిదండ్రుల నిరక్షరాస్యత కారణంగా చాలా పేదపిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. ఉన్నత చదువులు చదవాలని ఉన్నా కుటుంబ, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోడంతో ఎంతోమంది ఆడబిడ్డలు చిన్నతనంలోనే పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. చదువులకు పేదరికం అడ్డకాకూడదని, పేదింటి బిడ్డలు ఉన్నత చదువులు చదివి గొప్పగా రాణించాలని […]

Read More
విద్యార్థులకు నగదు సాయం

విద్యార్థులకు నగదు సాయం

సామాజిక సారథి, చొప్పదండి: ధర్మారం మండలం దొంగతుర్తి ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాసర ఐఐఐటీలో సీటు సాధించిన ఇద్దరు విద్యార్థుల్లో ఒకరైన విద్యార్థిని కొప్పుల అంజలికి ప్రముఖ ఎన్ఆర్ఐ, ఆస్ట్రేలియాలో ఉంటున్న భీమనాతిని రాజశేఖర్ అందించి రూ.10వేల నగదు సాయాన్ని హెచ్ఎం ఎన్.అనురాధ, ఎస్ఎంసీ చైర్మన్​జూంజిపెల్లి రాజయ్య అందజేశారు. విద్యార్థులను సర్పంచ్ పాలకుర్తి సత్తయ్య, ఉపసర్పంచ్ ముత్యాల చంద్రశేఖర్, ఎంపీటీసీ సభ్యుడు దాడి సదయ్య, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Read More
‘ఆజాది కా అమృత్’లో అచ్చంపేట వాసి ప్రతిభ

‘ఆజాది కా అమృత్’లో అచ్చంపేట వాసి ప్రతిభ

సామాజిక సారథి, అచ్చంపేట: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఏడురోజుల పాటు ‘స్మరిద్దాం ఈవేళ…’ పేరిట నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో అచ్చంపేటకు చెందిన ప్రముఖ కవి, గాయకుడు, చిత్రకారుడు మండికారి బాలాజీ కి ద్వితీయ బహుమతి పొందారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, విద్యావేత్త చుక్కా రామయ్య , హృదయ భారతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మక్కపాటి మంగళ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండికారి బాలాజీ […]

Read More
ఘనంగా టీచర్స్ డే

ఘనంగా టీచర్స్ డే

సామజిక సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని వెదిర కిమ్స్ లా కాలేజ్ లో శనివారం టీచర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రొఫెసర్లకు బొకే ఇచ్చి సన్మానించారు. సమాజంలో న్యాయవాద వృత్తి ఉన్నతమైందని కొనియాడారు. కార్యక్రమంలో లా కాలేజీ అడ్మిన్ రవీంద్ర, ప్రొఫెసర్లు వెంకటస్వామి, కిషన్, కొమురయ్య, రంగయ్య చారి, వేణుగోపాల్​రావు, తిరుమలేష్, జలంధర్, మౌనిక, శ్రావణి, రజిత పాల్గొన్నారు.

Read More
హెల్మెట్​తప్పనిసరి ధరించాలి

హెల్మెట్​ తప్పనిసరి ధరించాలి

సామాజిక సారథి, రామడుగు: హెల్మెట్ ధరించి బైక్ నడపాలని బ్లూకోట్​ పోలీసులు గురువారం పలువురికి అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ మాస్కులు విధిగా ధరించాలని, డ్రంకెన్​ డ్రైవ్ ​చేయకూడదని సూచించారు. రామడుగు ప్రధాన కూడళ్లలో గ్రామస్తులు, వాహనదారులకు అవగాహన కల్పించినట్లు పోలీసులు తెలిపారు.

Read More
రాజన్న సన్నిధిలో అసిస్టెంట్ కలెక్టర్

రాజన్న సన్నిధిలో అసిస్టెంట్ కలెక్టర్

సామాజిక సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ పార్వతి సమీత రాజరాజేశ్వరి స్వామివారిని శుక్రవారం సిద్దిపేట ట్రెయిని అసిస్టెంట్ కలెక్టర్ ఫ్రూఫ్ దేశాయి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదొక్తంగా ఆశీర్వచనాలు అందించారు. ఏఈవో ప్రతాప నవీన్ కండువా కప్పి సన్మానించి లడ్డూప్రసాదం అందజేశారు.

Read More
వెండి నాగదేవత ప్రతిమ అందజేత

నాగదేవత వెండి ప్రతిమ అందజేత

సామాజిక సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాతగిరి శంకర దాసమయస్వామి ఆలయానికి మాజీ వార్డు సభ్యురాలు సాయిని విజయ దేవయ్య 1600 గ్రాములతో తయారుచేసిన నాగదేవత వెండి ప్రతిమను బహూకరించారు. అర్చకులు ప్రామక మనోహర్, చొప్పకట్ల కార్తీక్ ఆధ్వర్యంలో అభిషేకం జరిపించారు. కార్యక్రమంలో చందు, దుర్గేశం తదితరులు పాల్గొన్నారు.

Read More
నల్లమలలో బీఎస్పీ బలోపేతం

నల్లమలలో బీఎస్పీ బలోపేతం

సామాజిక సారథి, అచ్చంపేట: నల్లమల ప్రాంతమైన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో బీఎస్పీని బలోపేతం చేస్తామని పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జ్, జిల్లా కార్యదర్శి అడ్వకేట్ శ్రీనివాసులు అన్నారు. ఇతర పార్టీల నుంచి ఎంతో మంది పార్టీలో చేరుతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేస్తున్న సెక్టార్ కమిటీల నిర్మాణంలో భాగంగా శుక్రవారం పదర మండలంలో పలు కమిటీలను ఎన్నుకున్నారు. పదద, చిట్లంకుంట సెక్టార్ కమిటీల అధ్యక్షులుగా ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా లోకేష్, మరుకొందయ్య ఎన్నికయ్యారు. కార్యక్రమంలో పార్టీ […]

Read More