సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి పట్ల రామడుగు మండలం గోపాల్ రావుపేట సర్పంచ్ కర్ర సత్యప్రసన్న ఉదారత చాటుకున్నారు. లాక్ డౌన్ తో అంబులెన్స్ లు, ఇతర వాహనాలు దొరక్క హాస్పిటల్ కు వెళ్లలేని వారి కోసం స్వయంగా తన సొంత కారును గురువారం నుంచి అందుబాటులో ఉంచారు. పెట్రోల్, డ్రైవర్ ను సంబంధిత వ్యక్తులే చూసుకోవాలని సర్పంచ్ సత్యప్రసన్న సూచించారు. […]
సారథి, రామడుగు: ఓ మనసున్న మారాజు ఉండేది విదేశాల్లోనైనా తన స్వగ్రామంలోని నిరుపేదలకు తనవంతు సాయమందిస్తూ పేద కుటుంబాల్లో దేవుడయ్యాడు. అది ఎక్కడో చూద్దాం పదండి. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన తోట సత్యం తన కుటంబంతో సహ అమెరికాలో స్థిరపడ్డాడు. సత్యంకు తన ఊరంటే ఏనలేని ప్రేమతో పేదింటి విద్యార్థుల చదువు, పెళ్ళిలు, వృద్ధులకు పెన్షన్లు, తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ గ్రామంలో తనకంటూ ఓ సముచిత స్థానం […]
సారథి, రామడుగు: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేస్తోందని రామడుగు బీజేపీ మండలాధ్యక్షుడు ఒంటెల కరుణాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైరస్ ఉధృతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో పేద, మధ్య తరగతి కుటుంబాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోందన్నారు. ప్రజలు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రుల్లో చేరితే, వసతుల లేమితో ఆస్పత్రులు కోట్టుమిట్టాడుతున్నాయన్నారు. ప్రాణాలు దక్కించుకుందామని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తే, లక్షలాది రూపాయలను దండుకుంటున్నాయని ఆరోపించారు. కరోనా పేషంట్లకు కుటుంబం చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత లేక వేలాధి […]
సారథి, సిద్దిపేట ప్రతినిధి: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట ఎస్సై కొత్తపల్లి రవి ఉన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిందన్నారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు కిరాణ, వర్తక, వ్యాపార సముదాయాలు తెరిచే ఉంటాయన్నారు. అనంతరం ఉదయం 10గంటల నుంచి పూర్తి స్థాయిలో […]
సారథి, సిద్దిపేట ప్రతినిధి: కొవిడ్ సింటమ్స్ ఉంటే భయపడకుండా నిర్భయంగా తమకు చెప్పుకోవాలని హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అయిలేని అనితశ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబంలో ఎవ్వరికైనా జ్వరం, తలనొప్పి, దగ్గు, జలుబు, ఒంటినొప్పులు ఉంటే వెంటనే ప్రభుత్వాస్పత్రిల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలన్నారు. వ్యాధి తీవ్రతరం కాకముందే తమకు చెప్పుకుంటే సరైన వైద్యం అందించడం ద్వారా కుటుంబ సభ్యులతో పాటు సమాజ హితంగా ఉంటుందన్నారు. కొవిడ్ నిబంధనలకు ప్రకారం […]
సారథి, గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువారం మండలం చీమలకుంటపల్లి, తుమ్మవానిపల్లి, గునుకుల కొండపూర్, మోత్కుపల్లి, చొక్కాలపల్లి, గుండ్లపల్లి గ్రామస్తులు తోటపల్లి సర్కార్ దవాఖానకు పోతే అక్కడ టెస్టులు చేయడం లేదని, మీది కరీంనగర్ జిల్లా, తమది సిద్దిపేట జిల్లా అని కొందరు డాక్టర్లు, వైద్యసిబ్బంది ప్రాంతీయ బేధాలు చూపుతున్నారని ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బామండ్ల రవీందర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు కి.మీ. దవాఖానాను వదిలి 33 కి.మీ. దూరంలో ఉన్న దవాఖానాకు […]
సారథి, హైదరాబాద్: కరోనా కట్టడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మే 12 నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుండటంతో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వ్యవసాయం, మీడియా, విద్యుత్ రంగాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ ఆఫీసులన్నీ 33 శాతం సిబ్బందితోనే పనిచేస్తాయి. రవాణా విషయానికి వస్తే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. సిటీబస్సులు, జిల్లా సర్వీసులు కూడా […]
సారథి, ములుగు: కరోనా వ్యాధి తీవ్రంగా ప్రబలుతున్నందున ప్రభుత్వం జారీచేసిన లాక్ డౌన్ ఉత్తర్వులను ప్రజలంతా విధిగా పాటించాలని ములుగు ఏఎస్పీ సాయిచైతన్య కోరారు. నిబంధనలను ఉల్లంఘించి అనవసరంగా బయట తిరిగే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన ములుగు మండలం మదనపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తిపై కేసునమోదు చేశామని, అంతేకాకుండా కొవిడ్ నిబంధనలు పాటించకుండా, సామాజిక దూరం పాటించకుండా కిరాణ సరుకులు అమ్మిన నవీన్ రెడ్డిపై […]