Breaking News

Month: May 2021

కొంత మందికే కరోనా టెస్టులు

కొంత మందికే కరోనా టెస్టులు

సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి రైతు వేదికలో నిర్వహిస్తున్న కరోనా టెస్టింగ్ కేంద్రాలకు జనం బారులుదీరుతున్నారు. రోజు 100 మంది నుంచి 150 మంది టెస్టుల కోసం వస్తుండగా, కిట్లు మాత్రం 50 ఉంటున్నాయి. దీనితో పరీక్షల కోసం రెండు మూడు రోజులు తిరగాల్సి వస్తోంది. రోజుకు 50 టెస్టులు చేయగా అందులో 20 నుంచి 25 వరకు పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. గత 25 రోజుల్లో చొప్పదండిలో 30 నుంచి 40 మంది […]

Read More
ముస్లింలకు రంజాన్ కానుక

ముస్లింలకు రంజాన్ కానుక

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి మండలం బండపల్లిలో రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కేసీఆర్ రంజాన్ కానుకను ప్రజాప్రతినిధులు, నాయకులు గురువారం అందజేశారు. బండపల్లిలో స్థానిక సర్పంచ్ న్యాయ విజయ జార్జ్ ఆధ్వర్యంలో వాటిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కాసారపు గంగాధర్ గౌడ్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు మల్యాల గంగానర్సయ్య, వార్డు సభ్యులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, టెంపుల్ చైర్మన్ గడ్డం సంజీవరెడ్డి, ముస్లింలు పాల్గొన్నారు.

Read More
ఊరంతా క్లీన్ గా ఉండాలని శానిటైజేషన్

ఊరంతా క్లీన్ గా ఉండాలని శానిటైజేషన్

సారథి, జగిత్యాల రూరల్: జగిత్యాల రూరల్ మండలంలోని తక్కళ్లపెల్లిలో సర్పంచ్ గడ్డం జైపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ నల్లాల విక్రమ్ గురువారం పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి శానిటైజేషన్ చేయించారు. కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వారు వెల్లడించారు. ప్రతిఒక్కరూ మాస్క్ లు ధరించాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని, ఎవరికైనా కరోనా అని అనుమానంగా ఉంటే వెంటనే ఆరోగ్య కేంద్రానికి వెళ్లి టెస్ట్ చేయించుకోవాలని సర్పంచ్ గడ్డం జైపాల్ రెడ్డి, ఉప […]

Read More
నేడే రంజాన్ పండగ

నేడే రంజాన్ పండగ

సారథి, మానవపాడు: కరోనా మహమ్మారి నుంచి విముక్తి కల్పించాలని, అందరూ సుఖశాంతులతో జీవనం కొనసాగించాలని ముస్లింలు గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని జామియా మసీదు ముతవల్లి మహబూబ్ పాషా కోరారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించి.. సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే రంజాన్ చేసుకోవాలని కోరారు.

Read More
కరోనా నియంత్రణకు టాస్క్ ఫోర్స్

కరోనా నియంత్రణకు టాస్క్ ఫోర్స్

సారథి, వనపర్తి: కరోనా నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందని తెలిపారు. గురువారం పెబ్బేరులో కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, జిల్లా ఆస్పత్రి, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు. డాక్టర్ల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ఫ్రంట్ లైన్ వారియర్లు అందరికీ అభినందనలు తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఐసొలేషన్ లో ఉంచితే ఇబ్బంది ఉండదని, ఇంటింటి సర్వేలో జ్వరపీడితులను గుర్తించి […]

Read More
బయటకు రావొద్దు.. ఇబ్బంది పడొద్దు

బయటకు రావొద్దు.. ఇబ్బంది పడొద్దు

సారథి, పెద్దశంకరంపేట: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అల్లాదుర్గం సీఐ జార్జ్ అన్నారు. గురువారం ఆయన పెద్దశంకరంపేట్ లో లాక్ డౌన్ పరిస్థితిపై పర్యవేక్షించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ప్రజలంతా తప్పకుండా పాటించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. లాక్‌డౌన్‌ మినహాయింపు సమయంలో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పికెట్లు, ప్రధాన రహదారిపై […]

Read More
పెళ్లి ట్రాక్టర్ బోల్తా

పెళ్లి ట్రాక్టర్ బోల్తా

సారథి, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం మల్లాపురం రాచపల్లి క్రాస్ రోడ్ వద్ద పెళ్లి బృందం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గురువారం సాయంత్రం బర్లగూడెం పంచాయతీలోని ఒంటిమామిడిలో జరిగిన వివాహానికి హాజరై తిరిగి ఛత్తీస్ గఢ్ బయలుదేరిన పెళ్లి ట్రాక్టర్ రాచపల్లి వద్ద ట్రాలీ లింక్ ఊడిపోవడంతో బోల్తాపడింది. ట్రాక్టర్ లో 30 మందికి పైగా ఉన్నారు. వీరంతా ఛత్తీస్ గఢ్ లోని నాంపల్లి […]

Read More
సీటీ స్కానింగ్ రేట్లు తగ్గించిన్రు

సీటీ స్కానింగ్ రేట్లు తగ్గించిన్రు

సారథి, సిద్దిపేట: కొవిడ్ బాధితుల నుంచి ప్రస్తుతం వసూలు చేస్తున్న సీటీ స్కానింగ్ రేటు రూ.5,500 బదులుగా రూ.రెండువేల మాత్రమే తీసుకునేందుకు స్కానింగ్ సెంటర్లు అంగీకారం తెలిపాయని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కష్టకాలంలో కొవిడ్ చికిత్స పొందే పేద, మధ్యతరగతి బాధితులకు ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే చికిత్స అందించాలని సూచించారు. జిల్లాలో కొవిడ్ ఆస్పత్రులుగా మారిన అన్ని […]

Read More