Breaking News

Day: January 29, 2021

వన్యప్రాణుల కదలికలను పరిశీలించాలె

వన్యప్రాణుల కదలికలను పరిశీలించాలె

సారథి న్యూస్, ఏటూరునాగారం: ఏటూరునాగారంలోని నార్త్ రేంజ్ పరిధిలోని భూపాతిపూర్ బీట్, గురవేళ్ల బీట్లో నూతనంగా నిర్మిస్తున్న పెర్కోలేషన్ ట్యాంక్ పనులను డీ ఎఫ్ వో ప్రదీప్ కుమార్ శెట్టి శుక్రవారం పరిశీలించారు. పనులు పూర్తి వెంటనే సోలర్ బోర్‌వెల్ ఏర్పాటు చేయాలన్నారు. గతంలో టైగర్ తిరిగిన ప్రదేశం కావునా ఇక్కడ కెమెరా ట్రాప్స్ నిఘా పెంచాలన్నారు. అలాగే వన్యప్రాణుల కదలికలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. ఆయన వెంట ఏటూరునాగారం ఎఫ్ డీవో వీణావాణి ఉన్నారు.

Read More
జాగ్రత్తలు తీసుకుని స్కూళ్లు నడపాలే

జాగ్రత్తలు తీసుకుని స్కూళ్లు నడపాలే

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: స్కూళ్లు పున:ప్రారంభమవుతున్ననేపథ్యంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చిన్నశంకరంపేట ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మిరెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో హైస్కూలు హెడ్ మాస్టర్లు, సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు సమావేశం నిర్వహించారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పాఠశాలు నడపాలని తహసీల్దార్​ రాజేశ్వర్​రావు సూచించారు. పంచాయతీ కార్యదర్శులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఎంపీడీవో గణేష్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు నష్టపోయిన రోజులను దృష్టిలో ఉంచుకుని తక్కువ సమయంలో మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులంతా కృషిచేయాలని ఎంఈవో […]

Read More
ప్రతి శుక్రవారం ‘గ్రీన్ ఫ్రై డే’

ప్రతి శుక్రవారం ‘గ్రీన్ ఫ్రై డే’

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మండలంలోని అభివృద్ధి పనులపై డీఆర్డీవో శ్రీనివాస్ సంతృప్తి వ్యక్తంచేశారు. శుక్రవారం మండలంలోని మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట ఎంపీడీవో కార్యాలయంతో పాటు ఉపాధి హామీ, ఐకేపీ ఆఫీసులను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం సముదాయ కార్యాలయం ముందున్న మొక్కలకు ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మితో కలిసి నీళ్లు పట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం హరితహారాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రీన్ ఫ్రై డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంపీడీవో గణేష్ రెడ్డి […]

Read More
ఓట్లంటే తెల్లకాగితం కాదు: ఆర్.కృష్ణయ్య

ఓట్లంటే తెల్లకాగితం కాదు: ఆర్.కృష్ణయ్య

సారథి న్యూస్, రామాయంపేట: బీసీల అదృష్టం.. మన నుదిటి గీతలో చేతి రాతల్లో లేదని.. మనం వేసే ఓట్లలోనే ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం మెదక్ ​జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహన్ని ఆవిష్కరించారు. మనిషిని మనిషిగా చూడాలని.. మనిషిగా గౌరవించాలని కలలు గన్న గొప్ప వ్యక్తి పూలే అని అన్నారు. ఓట్లంటే తెల్లకాగితం.. కంప్యూటర్ బటన్ […]

Read More
నిరుద్యోగభృతి హర్షణీయం

నిరుద్యోగభృతి హర్షణీయం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: టీఆర్ఎస్​ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని టీఆర్ఎస్ యువ నాయకులు అత్వెల్లి నాగరాజు అన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన తమ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. నిరుద్యోగుల కోసం భృతి ప్రవేశపెట్టడం హర్షణీయమన్నారు. ప్రతిపక్షాలు చేసే అర్థరహితమైన విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని, సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. ఉద్యమ సమయంలో కనిపించని నాయకులు ఉద్యమకారులను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.

Read More
10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే మృత్యుకేక

10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే మృత్యుకేక

మహబూబాబాద్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం ఆరుగురి దుర్మరణం‌‌.. పెళ్లింట విషాదఛాయలు సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి.. మంత్రుల విచారం సారథి న్యూస్, మహబూబాబాద్: మరో పది రోజుల్లో కూతురు పెళ్లి.. కొత్త వస్త్రాలు కొనేందుకు వెళ్లిన ఆ కుటుంబం ఇంటికి తిరిగిరాలేదు. శుభలేఖలతో బంధువుల వద్దకు వెళ్లాల్సిన పెళ్లింటి వారు విగతజీవులుగా మారారు. లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆరుగురిని బలితీసుకుంది. పెళ్లిబాజాలు మోగాల్సిన ఆ ఇల్లు శోకసంద్రంగా మారింది. మహబూబాబాద్​ జిల్లా గూడురు మండలం ఎర్రకుంటతండాకు […]

Read More
ఇంటింటికీ ఇంటర్​నెట్​

ఇంటింటికీ ఇంటర్​నెట్​

త్వరలోనే ఫైబర్​గ్రిడ్ ​ప్రాజెక్టు పూర్తి ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఇంటిని ఇంటర్​నెట్​తో అనుసంధానం చేసేందుకు అవసరమైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును త్వరలోనే పూర్తిచేయనున్నట్లు మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ఫైబర్​గ్రిడ్ ​ప్రాజెక్టుతో భవిష్యత్​లో 5జీ టెక్నాలజీ వంటి సేవలు మారుమూల ప్రాంతాలకు అందుతాయని వివరించారు. శుక్రవారం ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ నిర్వహించిన చార్జి గోస్ట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవల […]

Read More